Tuesday, September 14, 2010

తెలిసో, తెలీకో అంటే తప్పే .... అన్నీ తెలిసే......

మారుతున్న సమాజం..... మారుతున్న సమాజం.....
ఇది అధునాతన వినికిడి.... వింతైన సవ్వడి....
మారుతున్న సమాజానికి తగ్గట్టు మారాలి మనం.... జనం.....
ఇది నవ సందేశం ..... నూతన తరాలకు ఉపదేశం....

జరుగుతున్న ఈ మార్పు గమనం ఎటు వైపు?
మనం మారుతున్న దశలో వేసే అడుగు ఏ వైపు?

అది మంచా? చెడా? ఆశా? నిరాశా?
ఏ వైపు? అది ఎటు వైపు?

మంచి వైపే అనడానికి ఉందా ఉదాహరణ?
చెడు వైపే అనడానికి చేయొచ్చు నిర్థారణ!!
సమాజం మారుతుంది! నవ సమాజం ప్రారంభమవుతుంది!!
ఎక్కడో గౌరవ, మర్యాదలు...... ఎప్పుడూ వెక్కిరింతలు, వేళాకోళాలు....
లేదు చిన్నా, పెద్దా, ఆడా, మగా, పిల్లా, గొడ్డా....
ప్రతీదీ ఆకతాయితనమే ..... అహంభావమే.....
తెలిసో, తెలీకో అంటే తప్పే .... అన్నీ తెలిసే......

సమాజం మారుతుంది! నవ సమాజం ఆరంభమవుతుంది!!
ఎక్కడో ఆచార, సంప్రదాయాలు .... ఎప్పుడూ పాశ్చాత్య ధోరణులు, వెర్రి పోకడలు....
లేదు సిగ్గూ, ఎగ్గూ, వయసూ, వరసా, బుద్ధి, జ్ఞానం....
ప్రతీదీ విపరీతమే ..... వికృత కృత్యమే .....
తెలిసో, తెలీకో అంటే తప్పే .... అన్నీ తెలిసే ....

సమాజం మారుతుంది! నవ సమాజం సమాయత్తమవుతుంది!!
ఎక్కడో మంచి, మానవత్వం.... ఎప్పుడూ స్వార్థం, ఆవేశం, కుల, మత కలహం....
లేదు జాలీ, దయ, ఆలోచన, నీతి, ప్రేమ, సామరస్యం....
ప్రతీదీ కల్లోలమే .... భువి మీదే చూపించే నరకమే .....
తెలిసో, తెలీకో అంటే తప్పే ..... అన్నీ తెలిసే .....
అంతా తెలిసే .... ఆలోచనా రాహిత్యమే ....

సగం సగం కూడా లేని మంచీ, చెడుల ఈ సమాజం.....
మారుతున్న దిశ ఏ వైపు?
మారే దశలో వేసే అడుగు ఎటు వైపు?
ఏ వైపు? అది ఎటు వైపు????

Thursday, August 5, 2010

ఎలా చేయగలం???

ప్రతీ ఒక్కరూ నిర్మలమైన మనస్సు (Pure Heart) కై కృషి చేస్తుంటాం. అంటే అన్నీ మంచి పనులే చేయాలి. అబద్ధాలు చెప్పకూడదు. ఎవరకీ హాని చేయకూడదు లాంటివి. కానీ ఒక్కసారి ఆలోచించిన ఆ ప్రయత్నంలో మనం ఎంతవరకూ సఫలమయ్యాం? ఎంత మంది సఫలీకృతులమయ్యాం? అంటే మాత్రం ఆ లెక్కకి మన చేతి వేళ్ళు సరిపోతాయేమో. కాదంటారా?

మనస్సనేది ఓ అద్భుతం. నిజానికి, అది నిజంగా మన నియంత్రణలోనే ఉందా? మన మనస్సును మనం నియంత్రిస్తున్నామా లేదా మన మనస్సే మనల్ని నియంత్రిస్తుందా? నిజంగా ఆలోచించవల్సిన విషయమే. ఏంటి లోపం? ఎక్కడుంది లోపం?

మన బుద్ధి , మనశ్శక్తి మొండివి, మార్చలేనివి అంటే అద్భుతం కాదు కానీ, ఆధ్యాత్మిక బోధనలు వాటి మధ్య ఉంటూ మనం చేసే పనులు, అవి మంచివా, చెడ్డవా, చెయ్యొచ్చా, చెయ్యకూడదా అనే అలోచనల్లో సహాయం చేస్తూ, కొన్ని సమయాల్లో మన మనస్సును నియంత్రించడంలో తోడ్పడుతూ, ఏదో ఓ విశ్వాసం మనల్ని , మన మనశ్శక్తిని ముందుకు నడిపిస్తున్నాయేమో, అదే ఆధ్యాత్మికతేమో అంటే మాత్రం అదో అద్భుతమే. మన విశ్వాసాలు కొన్నిసార్లు మారవచ్చు. వాటిని కాపాడుకోవాలి, వాటిని ఎప్పుడూ ఆదరించాలి, వాటితోనే జీవనం సాగించడమంటే కష్టమేమో గానీ ఎప్పటికీ ఆధ్యాత్మికతంగా ఉంటే మనలోని దుష్ట శక్తులకు, చెడ్డ పనులు చేయలన్న ఆలోచనలకు ఈ ఆధ్యాత్మికతా ధోరణి అడ్డుపడుతూండడం వల్ల మనలోని దైవత్వాన్ని పంపొందించుకోగలమేమో, మన మనస్సు మన నియంత్రణలోనే ఉంటుందేమో. ఏదేమైనా మన ప్రయత్నం మాత్రం తప్పనిసరిగా ఉండాలి ఎందుకంటే అలా ఆధ్యాత్మికత భావనలను పెంపొందించుకోవడం అంత సులభమంటారా?
ఒక్కసారి గతాన్ని చూచిన, మనకి ఎందరో గొప్ప గొప్ప మహానుభావులున్నారు. గౌతమ బుధ్ధుడు, స్వామి వివేకానందుడు, వాళ్ళకి అంత ఆధ్యాత్మిక ధోరణి ఎలా వచ్చిందో ఎంత ఆలోచించినా నాకు తట్టదు. బహుశా వాళ్ళు అన్ని విలాసాలను, సౌకర్యాలను త్యజించి, త్యాగం చేసి, ఒక్క దైవం మీదే మనస్సు లగ్నం చేయడం వల్లా, లేదా ఆ దేవునిపై వారికున్న విశ్వాసమా? లేదా రెండూనా!! అయితే అలా అన్నింటినీ మనం త్యాగం చేయాల్సిన అవసరం లేదేమో కానీ మనలోని ఉన్న దుష్ట శక్తులను, చెడ్డ ఆలోచనలను త్యాగం చేసి, త్యజించి, దైవత్వం మీద మనస్సు లగ్నం చేసిన నిర్మలమైన మనస్సును సాధించవచ్చేమో!!!!






Friday, July 16, 2010

కాగలరా డిటెక్టివ్?!!!

రెండు కుటుంబాలు, అబ్బాయి తరపు వాళ్ళు, అమ్మాయి తరపు వాళ్ళు, ఇరువురి చుట్టాలు, స్నేహితులు అందరూ కలిసి సంతోషంగా జరిపే వేడుక "పెళ్ళి". అదెలా జరుగుతుందో అందరికీ తెలిసిందే. సాంప్రదాయాలు వేరైనా, పద్ధతులు వేరైనా భావన ఒక్కటే. సంబరం - సందడి ఒక్కటే. అయితే ఆ వేడుకకు ముందు ఉన్న జీవితం, తర్వాత జరగబోయే జీవితం మాత్రం అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సూటిగా చెప్పాలంటే పై పై హంగులు చూసి, భ్రమలో మోసపోతున్నామన్న సంగతి, లోతుగా తెలుసుకోకుండా తొందరపడి జీవితాన్ని నాశనం చేసుకున్నామన్న సంగతి, పెనంలో నుండి పొయ్యిలో పడ్డ నానుడిలా ఆ సుడిగుండంలో చిక్కుకున్నాకే తెలుస్తుంది. జరగబోయే దానిని ఎవరూ ఊహించలేరు, శాసించలేరు కనుక జరుగుతున్న దాన్ని సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ఓ అడుగు ముందుకు వేయాలని, తొందరగా పనులు చేయొచ్చు కానీ తొందరపడి పనులు చేయకూడదన్న విషయాన్ని ఓసారి అందరికీ గుర్తు చేద్దామనే చిన్న ప్రయత్నానికి జీవితంలో అతి పెద్ద ముఖ్య ఘటన "పెళ్ళి" ని ఉదహరణగా తీసుకుని, పెళ్ళికి ముందు చేయవలసిన పనులలో జరిగిన, జరుగుతున్న కొన్ని మార్పులను సూచిస్తూ, వీలైతే మనం కూడా అనుసరించవచ్చేమో అనిపించి, దాని అవలంబన, లోటుపాట్లు, తదితర అంశాలు మీరు కూడా క్షుణ్ణంగా పరిశీలించి, సూచనలు, సలహాలు ఇస్తారని......

ఇంట్లో అమ్మాయి లేదా అబ్బాయి, ఈ రోజుల్లో బాగా స్థిరపడ్డాక పెళ్ళి చేసుకోవాలనే వారి ఆలోచనలకు అవకాశమిచ్చి, ప్రోత్సహించి, అలా స్థిరపడ్డాక, వివాహం చేయాలనే ఆలోచనతో తెలిసిన వాళ్ళనో, పెళ్ళిళ్ళ పేరయ్యనో, వివాహ వేదికలనో సంప్రదించి ఒకటి, రెండు, మూడు, ఇలా..... నచ్చేదాకా రకరకాల సంబంధాలను చూసి, కుటుంబ సాంప్రదాయం, మంచి పేరు, హోదా, పలుకుబడి, ఇరువురి విద్యార్హత, ఉద్యోగాల్లో సమానత్వం, ఇలా అన్నింటినీ ఆరా తీసి, అన్నీ బావుంటే వాటిపై ఆధారపడి అబ్బాయి-అమ్మయిలను విశ్లేషించుకుని పెళ్ళిచూపులు, ఆ తర్వాత నచ్చితే మాటలు, కట్నాలు, కానుకలు, భోజనాలు, నిశ్చితార్థం, కాస్త గడువు, పెళ్ళి, మేళతాళాలు, అక్షింతలు, ఆశీర్వాదం, అందరి మదిలో సంతోషం.

అయితే చాలామంది, మనలోనే ఎంతో మంది, కుటుంబం కోసం ఆరా తీస్తున్నారు కానీ, ఆ అబ్బాయి, అమ్మాయిల గురించి తెలుసుకోవడం లేదని అనను కానీ లోతుగా పరిశీలించడం లేదు.

భారతదేశ సాంప్రదాయం ఎంతో గొప్పదని అందరికీ తెలుసు కానీ ఈనాటి భారతీయులు పాశ్చాత్య ధోరణి మోజులో పడి మన సాంప్రదాయాలను మట్టి కరిపిస్తున్నారని ఎంత మందికి తెలుసు? ఇంకా చేదుగా చెప్పాలంటే ఇంట్లో పెద్దవాళ్ల బాధ పడలేక మన సంస్కృతిని, ఓ సారి ఇంట్లో నుండి బయటకు రాగానే విదేశీ సంస్కృతిని అనుసరిస్తున్నారంటే ఒక్కసారిగా పెద్దలు ఉలిక్కిపడక తప్పదు. మరికొంత మంది ఇంట్లో పెద్దల మాట వినకుండా, వారికి ఎదురు చెప్పిన సందర్భాలు కోకొల్లలు. అయితే మన పిల్లలే కదా అని పెద్దలు సర్దుకుపోయిన సందర్భాలెన్నో. అది అబ్బాయి అయినా, అమ్మాయి అయినా ఒకే ధోరణి. దుస్తులు, వ్యావహారికం, సిగరెట్లు, పాన్ పరాగ్ లు, సెల్ ఫోన్లో కబుర్లు చెప్పడం తప్పు కాదు కానీ, అదే పనిగా మాటలు, ఫోటోలు, మెసేజ్ లు, ఇక అమ్మాయిలు మేమేం తక్కువా అన్నట్లు వ్యవహరించడం. ఈ దశలో ఇలాగే ఉంటారు తర్వాత వాళ్ళే మారుతారులే అనుకోవడమంత సులభంగా జరుగుతుందా ఆ మార్పు? నూటికో, కోటికో ఒకరిద్దరన్నట్లు ఉంటుంది ఆ మార్పు.

అయితే ఇక్కడ మరో మాట. పెళ్లైతే వాళ్ళే మారుతారులే అన్న మాట మరీ దారుణం. మొక్కై వంగనిది మానై వంగునా! జన్మనిచ్చిన పుణ్యభూమి, తల్లిదండ్రులకివ్వని గౌరవం, వేరే ఎవరికో ఇస్తారా?

ఇలా ఆలోచించకుండా, మారుతారులే అని పెళ్ళిళ్ళు చేసేసి, ఎన్నో కలలతో కొత్త జీవితంలో అదుగుపెట్టిన అమ్మాయి-అబ్బాయి కలకాలం సంతోషంగా జీవించగలరా? ఛీ! ఇక సర్దుకుపోవాలి అనుకుంటూ జీవించడం. అంతకు మించి దుర్భరమైన జీవితముంటుందా? లేదా విడిపోవడం, విడిపోవడానికా చేసుకునేది పెళ్ళి?!

ఒక ఉద్యోగం కోసం సర్టిఫికేట్లు చాలవన్నట్లు ఎవరిదో ఒకరిదైనా రిఫరెన్సు కావాల్సిన, అలా కాకుంటే ఉద్యోగాలు కష్టమైపోతున్న ఈ రోజుల్లో కుటుంబ పేరు, హోదాలను చూసేసి కట్నాలు ఇచ్చేయడం లేదా తీసుకోవడం ఎంత వరకూ సమంజసం? అందుకేనేమో, పెళ్ళికి ముందు పూర్తిగా, క్షుణ్ణంగా పరిశీలించి, కుటంబాలను కాదు, వధూవరులను, వారి గురించి ఎంక్వైరీ చేసి, వారికో కొత్త జీవితాన్ని అందించేందుకు, మన నగరాల్లో ఉన్నారో, లేరో తెలీదు కానీ మహానగరాలు -మెట్రొపాలిటన్ సిటీల్లో ఏర్పడ్డారట "MARRAIGE-PRIVATE DETECTIVES".

మన వరకు మనం ఎంత వరకూ నిఘా వేయగలం. మనకున్న పనులకు తోడు పెళ్ళంటే మరి కొన్ని అదనపు బాధ్యతలు ఎలానూ తప్పవు. ఒకవేళ వీలు చూసుకుని అలా చేసినా, మనం కనిపెడుతున్నట్లు వాళ్ళకి తెలిసిపోతే. అమ్మో! మన అభిప్రాయం - మంచి సంబంధం, చేజారిపోతుందేమో! అందుకే మనకెందుకీ గొడవ. ఆ పనిని ఈ డిటెక్టివ్స్ కీ, డిటెక్టివ్ ఏజెన్సీస్ కీ అప్పజెప్పేస్తే....

అబ్బాయి మంచివాడా, చెడ్డవాడా, నటిస్తున్నాడా, జీవిస్తున్నాడా, ఉన్న అలవాట్లు, మంచివా, చెడ్డవా, ఎంత మంది స్నేహితులు, అందులో మగవాళ్ళెంత మంది, ఆడవాళ్ళెంత మంది, వాళ్ళతో వట్టి స్నేహమేనా, గట్టిగా మరింకా ఎక్కువేదైనానా (భావం ఊహించగలరు), పాన్ షాప్ వాడికి ఈయన సిగరెట్లు, పాన్ లు, వగైరా చెత్త వల్ల ఎంత ఆదాయం వస్తుంది, ఎన్ని గంటలు ఇంట్లో గడపడానికి ఇష్ట పడతాడు, ఎంత సేపు బయట షికార్లు చేస్తాడు, ఆయన గారు చూసే సినిమాలేంటి, చేసే సిత్రాలేంటి, ఇలా అన్నింటినీ శరీరాన్ని స్కాన్ చేసే యంత్రం మాదిరి అన్నీ వాళ్ళే చూసుకుని మీ అమ్మయికి ఓ మంచి జీవితం ప్రసాదించగలరు.

అదే అమ్మాయైతే అణుకువగా ఉండేందుకు ఇష్టపడుతుందా, అందంగా ఉండేందుకు ఇష్టపడుతుందా, సేవ చేయాల్సి వస్తే చేస్తందా, చేయించుకుంటుందా, ఎంతమంది స్నేహితులు, అమ్మాయిలా, అబ్బాయిలా, వట్టి స్నేహమేనా, ఇంకా ఏమైనానా (వ్యాఖ్య కఠినంగా ఉన్నా వినక, చదవక, ఆలోచించక తప్పదు), ఆమెకు ఆలోచించగల సామర్థ్యం ఎంత? ఇతరులను ఆలోచనలో పడేసే సామర్థ్యం ఎంత?ఇలా ఏవైనా సరే పూర్తిగా ఎంక్వైరీ చేసి మీ అబ్బాయికో స్నేహితురాలు, భార్య, తల్లి, ఇలా అన్ని లక్షణమైన లక్షణాలుండే జీవిత భాగస్వామిని అందించగలరు.

అంతకన్నా మనకింకేం కావాలి? పెళ్ళి జరిగేటప్పుడు సంతోషం ఎలాగైతే ఉండాలో, పెళ్ళి తర్వాత రెట్టింపు సంతోషంగా ఉండాలంటే ఇలాంటి డిటెక్టివ్స్ మన ప్రాంతాల్లో కూడా ఉండడం శ్రేయస్కరం. రెండు జీవితాలను చక్కగా ఒక్కటి చేసేందుకు, వారు సంతోషంగా జీవితాన్ని సాగించేలా చేస్తున్న ఆ డిటెక్టివ్స్ ను నిజంగా అభినందించాల్సిందే. మనలో, మన ప్రాంతాల్లో కూడా ఎవరైనా అలా డిటెక్ట్ చేసేందుకు, అందరినీ సంతోషపరిచేందుకు డిటెక్టివ్స్ గా మారితే ఎంతో బావుంటుంది కదా! నిజానికి ఇది కూడా సమజ సేవే అని నేను భావిస్తున్నా..... కాదంటారా??!!

Sunday, February 14, 2010

ప్రేమ - మతం - సమ్మతం

అమ్మా నాన్నల అనురాగం, అక్కా తమ్ముళ్ళ ఆప్యాయతతో
ఆ నలుగురి సహాయ, సహకారాలతో, ప్రోత్సాహాలతో
చక్కగా చదువుకుని, మంచి ఉద్యోగం చేస్తూ...
ఆ దేవుని ఆశీస్సులతో, అందరి దీవెనలతో...
చలాకీగా ఓ వైపు, హుందాగా మరో వైపు...
మంచి పేరుతో.... అయితే పనీ లేదా కుటుంబం అనుకుంటూ....
అందరి ప్రశంసలు అందుకుంటూ తనదైన శైలిలో వ్యవహరించే ఓ అమ్మాయి....

అమ్మా నాన్నల అనురాగం, చెల్లీ తమ్ముళ్ళ ఆప్యాయతతో
వెలకట్టలేని స్నేహమందించే మిత్రుల అభిమానంతో...
వారందరి సహాయ సహకారాలతో, ప్రోత్సాహాలతో...
చక్కగా చదువుకుని, మంచి ఉద్యోగం చేస్తూ...
ఆ దేవుని దీవెనలతో... అందరి ఆశీస్సులతో....
పెద్దల యందు వినయంతో, ఉన్న దాంట్లో పదిమందికీ సహాయమందించాలనే...
తపనతో.. అన్ని రకాలా ఉన్నతంగా ఆలోచిస్తూ....
అందరి ప్రశంసలు అందుకుంటూ తనదైన శైలిలో వ్యవహరించే ఓ అబ్బాయి....

నెల రోజుల క్రితం ఒక మంచి సంస్థలో ఉద్యోగం సంపాదించిన ఆ అబ్బాయి
నెల రోజుల తర్వాత అదే సంస్థలో ఉద్యోగావకాశం పొందిన ఆ అమ్మాయి

ఇద్దరూ అపరిచితులు....
ఏంటో విధి చిత్రం... ఆ దేవుడు చేస్తున్న విచిత్రం...
అపరిచితులు అయ్యారు సుపరిచితులు...
ఆ తరువాత స్నేహితులు......

ఆ అబ్బాయి పేరు వింటేనే అందరిలో కలుగుతుంది ఓ గౌరవ భావం...
ఎప్పుడూ ఉండే తనని చూస్తే చాలు...
ఆ నవ్వే తన ఆభరణమా? అదే తన ధైర్యమా?.... అనిపిస్తుంది...
ఆ నవ్వు చూస్తే చాలు మన ఆనందం రెట్టింపవుతుంది...
ఎంతటి బాధైన మాయమవుతుంది....
తన నడక, తీరు, పద్ధతి బహుశా ఈ లోకంలో వేరెవరికీ ఉండదేమో....
ఇక ఇంతకన్నా ఎక్కువ చెప్తే అతిశయం అవ్వదు కానీ....
చెప్పేకన్నా ప్రత్యక్షంగా చూస్తే నమ్మకం కలుగుతుంది....

అటువంటి నమ్మకంతోనే ఆ అమ్మాయి అతనికే ప్రత్యేకంగా ఉంటే బాగుందనుకుంది
ఆ హృదయాన్ని కోరుకుంది.... అతనితోనే జీవితం అనుకుంది....
ఆ విషయం అతనితో చెప్పాలన్న ఆరాటం ....
చెప్తే అవునంటారో.. కాదంటారో అన్న సందేహం.... భయం..
తననే చూస్తూ... తనతో ఉంటూ.. చెలిమే చేస్తూ....
తన తోడేకావాలనుకున్నా.. తన నీడే చేరాలనుకున్నా..
ఎందుకో చెప్పలేక గుండెల్లోనే మౌనంగా దాచేస్తున్న ప్రయత్నాన్ని జయించలేక..
సతమతమవుతూ... మాట్లడలేని తన మౌనాన్ని అర్థం చేసకోలేవా?
కళ్ళళ్ళో చూసి తనపై ఉన్న ప్రేమని తెలుసుకోలేవా?
ఆపై తన హృదయాన్ని అందంచలేవా? అనుకుంటూ...

ఆ అమ్మాయి మనసులోని మాట పెదవి దాటి బయటకు రాదా?
ఆ నిజానికి ఎప్పటికైనా జీవం వస్తుందా? జీవం లేని శిల్పంలా నిలిచిపోతుందా?
తాకితే నీటిలో నీడలా చెదిరిపోతుందా? చూడలేని కలలా కళ్ళళ్ళోనే దాగిపోతుందా?
నీలి గగనంలో నల్ల మబ్బులా కరిగిపోతందా?

ఎందుకింత ఆరాధన? అసలెందుకింత ఆవేదన?
మనసులోనే జీవిస్తున్నందుకా? కళ్ళ ముందే నిలుస్తున్నందుకా?
అసలా మాట తను పోయేలోగా బయటకు వచ్చేనా?
లేదా తనతో పాటే సమాధి అయ్యేనా?

అనుకుంటూ ప్రతీరోజూ ఆ అబ్బాయిని చూడగానే..
ఇది స్నేహం కాదు ప్రేమని చెప్పలేక..
ప్రేమని దాచి స్నేహాన్నే పంచలేక..
చెలిమి చేస్తూ... ప్రేమను దాచలేక...
సతమతమవుతున్న ఆమె మనస్సును ఓదార్చలేక..
చేస్తున్న సంఘర్షణలో ఆమెకు దక్కింది విజయం...

దైవానుగ్రహమో.. అతనికున్న ధైర్యమో..
అంతలోనే అతనే చెప్పాడు... తన మనసులో ఉన్న ఆమె భావం!!!

ఎప్పుడూ ఆమె ఊహించని పరిణామం..
అనుకోలేదు వస్తుందని ఆ నిమిషం..

అతని తీయని మాటతో... ఆమె కోరిన భావంతో...

ఆమె సాధించింది విజయం..
ఆమెకు మాత్రమే సంతోషం...
ఆమె మనసుకు మాత్రమే ఆనందం ....
కానీ, ఆ విజయం నిలుస్తుందా?
జీవితాంతం ఆమెతో ఉంటుందా?

మళ్ళీ మొదలైంది సంఘర్షణ...
ఇప్పుడు ఇద్దరికీ....
ఎప్పుడు అంతమవుతుందో తెలియని వేదన...
అసలు అంతమవుతుందా? వారికి విజయాన్నిస్తుందా?
లేదా వారితో పాటే అంతమవుతుందా? ఆలోచనలకు లేదు అంతం....

ఇంతలోనే వచ్చింది మరో సమయం... విజయం...
మరో మంచి సంస్థలో చక్కని అవకాశం..
అతను వెళ్ళాల వద్దా... అనే సందేహం...

అయితే జీవితంలో ముఖ్యం ఉన్నత స్థానానికి వెళ్ళడం
ఇంకా మంచి పేరు సంపాదించుకోవడం... మంచిగా స్థిరపడడం..

సంతోషం.... బాధ..... కలయికల మధ్య వీడ్కోలు...
ఇద్దరూ ఇరు చోట్ల.... కానీ,
ఇద్దరి మనసుల్లో ఒకే భావం...
ఒకరి కోసం ఒకరనుకునే స్వభావం...
అన్ని విషయాల్లోనూ సామ్యం..

ప్రతీక్షణం పిల్లల కోసమే ఆలోచించే ఆ తల్లి మనసు
ఆ అమ్మాయిని అంత మంచి స్థితికి తీసుకొచ్చిన ఆ మనసు
మా అమ్మాయి ఎప్పుడూ సరియైన నిర్ణయమే తీసుకుంటుందనే

నమ్మకమున్న ఆ మనసు
ఈ నిర్ణయాన్ని ఎందుకో అంగీకరించలేకపోతుంది...

ఏమిటి కారణం? ఆ అమ్మాయి నిర్ణయం నేరమా? లేదా ఆలోచనలో లోపమా?
కాదు.. ఆ నిర్ణయం కాదు నేరం.. ఆ ఆలోచనలో లేదు లోపం...

మరెందుకు? అందరూ ఆలోచించేది ఒక్కటే.. మతం! జనం!! సంఘం!!!

అబ్బాయి మంచివాడే.. కానీ, మతాలు వేరు...
మంచివాడు కనుక అభ్యంతరం లేదు... కానీ, సంఘంలో పేరు..
చేసేది మంచి పనైతే సొసైటీ కోసం ఆలోచించాల్సిన పని లేదు.. కానీ, జనం ఏమనుకుంటారు?..

ఇవే సందేహాలు... ఎంతో గౌరవమైన కుటుంబం....
తర్వత పరిస్థితి ఎలా ఉంటుందో?....

అయితే ఈ ఆలోచనలేవీ నిలవలేదు
అతని మంచితనం ముందర!!!!

పెళ్ళి అనే శాశ్వత బంధానికి కావాల్సింది నమ్మకం కానీ మతం కాదు...
ఇరువురి మధ్య ఉండాల్సింది ప్రేమ కానీ సంఘం కాదు... జనం కాదు...

అంటూ ఇరు కుటుంబాలు వచ్చిన ఏకాభిప్రాయానికి వందనాలు....
అంత పెద్ద మనస్సుతో అర్థం చేసుకున్న తల్లిదండ్రులకు వారు జన్మించినందుకు కృతజ్ఞతలు...
అలా సృష్టించి, పుట్టించిన ఆ దేవునుకి ఆత్మసంతృప్తితో నమస్కారాలు.....

ఆ దైవ లీలతో ప్రేమగా మారిన ఆ పరిచయం, స్నేహం....
ప్రేమికుల రోజున జరిపించాయి వారి నిశ్చితార్థం....
అదే వారి వివాహ నిశ్చయం... వింత అనుభవం...
అర్థం కాని అద్భుతం,... ప్రేమపై నమ్మకం....
ప్రేమలో విశ్వాశం.... అందుకు వారి ప్రేమే నిదర్శనం....
ఈ ప్రేమికుల రోజే సాక్ష్యం....
ఆదివారం (14-02-2010)కి గడిచేను ఒక సంవత్సరం...

సంతోషంగా... పరస్పర సహాయ సహకారాలతో....
అందరి ఆశీస్సులతో.... దేవుని చల్లని దీవెనలతో....
అమ్మ మనస్సు రెట్టింపు సంతోషంతో.....
కూతురి సంతోషంతో.... అల్లుడు కాదు కొడుకులా ఉంటున్న అల్లుడిని చూస్తున్న సంతోషంతో.......





Friday, May 2, 2008

రెండు జీవితాలు

అరమరికలు లేని వయసు
అలుపన్నదే ఎరుగని తనువు
ఏదైనా చేయగలనన్న మొండి దైర్యం
ఏదో చేసేయాలన్న సాహసం
అది మంచో, చెడో ఆలోచించలేని
స్థితిలో ఉన్న లేలేత మనసు
ఎగిరెగిరి పడే లేడి పిల్లలా
పూర్తిగా వికసించని మొగ్గలా
పౌర్ణమి ఇంకా రాక, ఆకాశంలో
సగం పరుచుకున్న వెన్నెలలా
ఎటువంటి బాధ్యతా లేకుండా
ఒళ్ళంతా నిండిన అహంకారంతో
స్నేహితులతో కబుర్లతో, షికార్లతో
అప్పుడప్పుడు చదవాలని గుర్తొస్తే
పుస్తకం తిరగేస్తూ, లేదంటే ఆటలతో
కాలం గడిపేస్తున్న ఆ అబ్బాయి!

పున్నమి నాడు నిండు జాబిలిలా
చిగురిస్తున్న ఆకులతో ఉన్న వసంతంలా
అందంగా మెరిసే చంద్రబింబంలా
అమ్మా నాన్నల అనురాగంతో
అక్కా తమ్ముడి ఆప్యాయతతో
ఆ నలుగరే తన లోకంగా
అయిదో వ్యక్తే అనవసరమనుకుంటూ
మరో ప్రపంచమే వద్దనుకుంటూ
ఎంతో సరదాగా ఆడుకుంటూ
అందర్నీ తన చిలిపితనంతో నవ్విస్తూ
అల్లరి చిల్లరిగా తిరిగే వయసు నుండి
అణకువుగా ఉండే వయసుకు
తనకు తెలియకుండానే ఎదిగిన ఓ అమ్మాయి!!

జీవితంలో ఎదగడానికి ఉపయోగపడేది చదువు
జీవితాంతం నిశ్చింతగా ఉండేందుకు ఉండాలి చదువు
అందుకే,
చదువుల తల్లి నిలయమైన ఓ దేవాలయం
దేవాలయం లాంటి ఆ విద్యాలయం
అర్చకుల్లాంటి అధ్యాపకులున్న ఆ నిలయం
చదువుకోవాలన్న కాంక్షకులకు సువర్ణావకాశం
ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని
జీవితంలో మంచి స్థానంలో స్థిరపడాలని
జీవితాన్ని ఆనందమయం చేసుకోడానికి.........

కలువ వంటి కళ్ళల్లో ఉన్న బెరుకును
గుండె లోతుల్లోకి నెట్టేస్తూ
నాజూకైన పాదాల్లో పుడుతున్న వణుకును
నరనరాల్లోకి నెట్టేస్తూ
అడుగుపెట్టిందా అమ్మాయి ఆనందంగా.....
మొదటి రోజు జరిగాయి పరిచయాలు
వికసించాయి స్నేహ పరిమళాలు
మొదలయ్యాయి పాఠాల బోధనలు
అంతలోనే తన తెలివికి వచ్చాయి ప్రశంసలు
ఇక తిరుగులేని ఉత్సాహం
తరిగిపోని ఉల్లాసం, ఇలా
రెండు, మూడు ...... అన్ని రోజులు
ఎంతో సంతోషం, క్లాసులో ప్రథమ స్థానం..

చల్లదనాన్ని కోరుకుంటే చిరుగాలి వస్తుందనుకుంది
అడకుండాన్నే దేవుడు వరాలిస్తాడనుకుంది
తనకేం తెలుసు?
చిరుగాలికి బదులు పెను తుఫాను వస్తుందని
అడక్కుండానే అమ్మయినా అన్నం పెట్టదని
అయినా సరే,
తనను సృష్టించిన దేవుడు సకలం మంచే చేస్తాడని
అంతా బావుంటుందనే తలంచింది??!!!

అనుకున్నట్లే జరుగుతుండడంతో మనసంతా సంతోషం
అంతా హాయిగా సాగిపోతున్న తరుణంలో
తన స్నేహితుల్లో ఒకడుగా చేరాడు
ఏ మాత్రం బాధ్యత లేని ఆ అబ్బాయి
కానీ నాకేం పోయిందనుకుంది ఆ అమ్మాయి
నలుగురితో పాటే తనూను అనుకుంది
స్నేహితులందరినీ సమానంగా భావించింది
అందరితో చేసినట్టే తనతోనూ స్నేహం చేసింది
కానీ,
ఆ అబ్బాయికి మాత్రం ఆ అమ్మాయి ముందే తెలుసు
చందమామ కోసం ఎదురు చూసే రాత్రిలా
వాన రాక కోసం ఎదురు చూసే పంటలా
విజయం కోసం వేచి చూసే వీరుడిలా
అవునా? కాదేమో? ఏమో?
ఎంతగానో ఎదురు చూశాడు, వేచి ఉన్నాడు
ఎదురు పడగానే స్నేహమన్నాడు.......
నవ్వించాడు, ఏడిపించాడు, పోటీ పడ్డాడు
ప్రతీ దానిలోనూ, స్నేహమన్నాడు.....

పరిస్థితుల ప్రభావమో, స్నేహితుల ప్రోత్సాహమో
మనసు పెట్టిన ప్రలోభమో, వయసు చేసిన ప్రమాదమో

ఆ రోజు శుభప్రదమైన శుక్రవారం
ఏప్రిల్ రెండో వారంలో ఓ డే
ప్రత్యేకంగా సంబరం చేసుకునే డే
అందరికీ నచ్చే రోజున వచచే గుడ్ఫ్రైడే..

సూర్యాస్తమయం, సంధ్యా సమయం
పగలంతా అలసి కాసేపు రిలాక్సయి
తిరిగి సాయంకాలం ఎక్స్ట్రా క్లాసులో
పాఠాలయి, పుస్తకం తిరగేస్తున్న వేళ

చేరాడు ఆ అబ్బాయి ఆ అమ్మాయి పక్క
కొంతసేపు పాఠాలు, మరి కాస్సేపు మాటలు
అయ్యాక ఇచ్చాడు ఆమెకో మడిచిన కాగితం!!

ఏమిటా అని ఆత్రంగా తెరిచిన ఆమెకు
కలిగింది అకస్మాత్తుగా ఆశ్చర్యం
ఏమీ అర్థం కాలేదు, ఒక్క నిమిషం
అంతా అయోమయం, గందరగోళం
ఏంటీ అబ్బాయి వైనం?
మూడే పదాలున్న ఆ కాగితం
నిదానంగా ఆలోచించకపోతే
జీవితాన్నే మలుపు తిప్పే భయంకర పత్రం
తెలివితక్కువ కాని ఆ అమ్మాయి
టక్కున తేరుకుని అతన్ని మందలించి
పూర్తిగా మాట్లాడడం మానేసింది..

అనుకున్న పని సాధించకపోతే ఎలా?
'ఛీ' అన్న ఆమేతో 'రా' అనిపించకపోతే ఎలా?
అవమానం కాదా నలుగురిలో
అందుకే అసహనాన్ని దిగమింగి
అంతులేని సహనంతో ప్రతీరోజూ
ఆ కాగితంలో ఉన్న పదాలు
ఆమె వెంటపడీ మరీ చెప్పేవాడు

తిట్టినా, ఛీ కొట్టినా, బెదిరించినా
రోజూ ఒకటే పని, అదే పని
చెట్టుదిగని బేతాళుడిలా
పట్టు వదలని విక్రమార్కుడిలా
ఏ పనైనా మర్చిపోయేవాడేమో
ఈ మూడు పదాలను కాదు
వాటిని ఆమెతో చెపపడం మర్చిపోలేదు.....

ఆమెకు బయటికి వెళ్ళాలంటే భయం
అతను కనిపిస్తాడని కాదు
అతని మాటలను వినాల్సి వస్తుందని
ఆమెకు స్నేహితులతో మాట్లాడాలంటే భయం
వాళ్ళేదో అంటారని కాదు
వాళ్ళలో ఆ అబ్బాయి కూడా చేరుతాడేమోనని!!

"దేవుడా! ఎందుకిదంతా చేయిస్తున్నావు
ఆ అబ్బాయిలో మార్పే రాదా?"
అంటూ వేడుకునే సందర్భంలో
తనలో తాను పడే సంఘర్షణలో
కాలం చేసిన ఇంద్రజాలంతో
దూరంగా వేరే చోటుకి వెళ్ళిపోయాడు
హమ్మయ్య......

మళ్ళీ కొత్త వసంతం వచ్చింది
ఆ అమమాయి జీవితానికి వెలుగునిచ్చింది
ఇంకంతా హాయే కలుగుతుంది
జీవితంలో తిరుగులేదనుకుంది.!

రిస్కు లేక లైఫ్ ఉంటుందా?
జీవితమంతా సుఖమే ఉంటుందా?
తాను వెళ్ళిన దూరం తక్కువే కావడంతో
తరచూ వెనక్కి వస్తూనే ఉండేవాడు
ఆమెను కలుస్తూనే ఉండేవాడు
ఆ మూడు పదాలు చెప్తూనే ఉండేవాడు!...

"దేవుడా! ఇతనికి ఆ దూరం చాలదు
ఇంకా చాలా దూరం తీసుకుపో!"
అంటూ వేడుకునే సందర్భంలో
తనలో తాను పడే సంఘర్షణలో
దగ్గర, మనుషుల్ని దూరం చేస్తుంది
దూరం, మనుషుల్ని దగ్గర చేస్తుంది
అన్నట్లుగా, కాలం చేసిన ఇంద్రజాలంతో
ఓ రోజు ఆమెలో ఏదో అలజడి
గుండెలో మోగే ఏదో సవ్వడి
ఆ అబ్బాయిని చూడాలని, అతన్ని కలవాలని
తనతో అవే మూడు మాటలను చెప్పాలని

ఒకటే ఆత్రం, మనసు చేసింది మారాం
ఎదురు చూసింది అతని రాక కోసం!......

అంతలోనే తిరిగింది కాలం
అతన్ని కలిసిన క్షణం, చెప్పలేని ఆనందం
మనసులో మాట, అనుకున్న మాట చెప్పింది

I Love You
I Love You
I Love You........

ఇద్దరి మనసుల్లో అంతులేని ఆనందం
ఆకాశమే హద్దుగా రేగిపోవాలన్న సంతోషం
బాధ్యతలను మరువకూడదన్న ఒప్పందం
ముందుగా జీవితంలో స్థిరపడాలన్న నిశ్చయం
తర్వాత తీసుకోవాలనుకున్నారు పెద్దల సమ్మతం
ఎప్పుడూ హద్దులు దాటకుండా చేసిన పోరాటం
జీవితాంతం కలిసి ఉండాలన్న ఆరాటం
అన్నీ కుదిరాక చెప్పలేనంత ఉల్లాసం.....

ఆ ఉల్లాసంతో, చేసుకున్న బాస్లతో
జీవితాన్ని ముందుకు సాగిస్తున్న ప్రయాణంలో

ఎదురైందో ఊహించని ప్రమాదం

ఆ అబ్బాయి నచ్చక దూరంగా తీసుకెళ్ళీపో
అని ఒకప్పుడు దేవుడికి ప్రార్థన చేసింది, కానీ

ఆ అబ్బాయి నచ్చాక ఇద్దరినీ ఒకటి
చేయమని వేడుకోవడం మరచింది!!
తనకేం తెలుసు?

అన్నీ ఆ దేవుడికి ప్రత్యేకంగా చెప్పాలా?
తానే కదా సకలం చేస్తాడని తలచింది.
ఇలా జరుగుతుందని ఎలా ఊహిస్తుంది?
అయితే తన పూజకు ఎంతో బలముంది
తాను తనకు దూరంగా తీసుకెళ్ళమని
వేడుకుంటే, ఆ దేవుడు ఏకంగా

సుదూర తీరాలకు, అనంత లోకానికి
అందనంత దూరానికి, అందుకోలేనంత దూరానికి
తన దగ్గరికే తీసుకెళ్ళిపోయాడు
ఊహించని ఆ మలుపు, ఎప్పటికీ రాదు మరుపు....

ఇప్పుడేం చేయాలి? విధి రాతను చూస్తూండాలి.....
ఇంకేం చేయాలి??????????

(ఇది వాస్తవంగా జరిగిన, జరుగుతున్న జీవితం)

డార్క్నెస్ విజబుల్

విలియం గోల్డింగ్ ఆధ్యాత్మిక, నిరాశమయ, కల్పిత నవలా రచయిత. ఆయన రాసిన కథలు ఎంతో వినోదకరంగా, ఉత్కంఠభరితగా ఉంటాయి. చదవడానికి ఎక్కువ ప్రయత్నం చేయనక్కర్లేకుండా మనకు తెలియకుండానే చివరి వరకూ ఇష్టంగా చదివేలా ఉంటాయి. 20వ శతాబ్దపు సాహిత్యానికి మంచి కథలను నవలల రూపంలో అందించారు. వాటిలో ప్రత్యేకంగా చెప్పుకోదగింది "డార్క్నెస్విజబుల్". 1979లో పబ్లిషైన ఈ నవల 'జేమ్స్టైట్ బ్లాక్ మెమొరియల్ ప్రైజ్' ను గెలుచుకుంది. రెండో ప్రపంచ యుద్ధం గోల్డింగ్పై ఎటువంటి ప్రభావం చూపిందో తెలుస్తుంది. నిప్పుతో ప్రకాశింపజేయబడిన ఓ చీకటి పుస్తకమిది. ఈ ప్రపంచంలో దుర్మార్గానికున్న ఆధిక్యత, దాని ఆధిపత్యాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ నవలను రచించారు గోల్డింగ్. ఈ నవలా పరిచయం మీకోసం......

మంచికీ, చెడుకీ మధ్య జరిగిన పోరాటం నుండి భౌతికంగా తప్పించుకోవడానికి చేసిన స్వాభావికమైన సాధుత్వం, నిరంతర ప్రయత్నాలకు టెర్రరిజాన్ని కాస్త జోడించి ఆధునిక సంద్ర్భానుసారంగా ఈ కథను అల్లారు. డార్క్నెస్ విజబుల్ నైతికాంశాల్లో ఖచ్ఛితమైన తీర్పునివ్వడంలో ఉన్న కష్టాలను అన్వేషిస్తుంది. వ్యక్తుల పతాక స్థాయి ప్రవర్తన, విపరీతమైన సాధుత్వం, వాళ్ళకున్న శాపాలు, వాళ్ళు పడే బాధలు ఇలా వాళ్ళ అంతరాత్మల్లో జరుగుతున్న వివాదాలను భరించే సామర్థ్యం ఉన్న వారు రక్షింపబడతారా లేదా నశిస్తారా అన్న చివరి ఫలితాన్ని ఇది చూపిస్తుంది. మరో వైపు ఈ అధ్యాత్మిక ప్రపంచంలో మన చుట్టూ, మనకు చేరువలో ఉన్న కొన్ని రహస్యాలు ఎంతో మందికి కనిపిస్తాయి లేదా తెలియకుండానే దాటి వెళ్ళిపోతాయి. ఇలా ఆధ్యాత్మిక పరిణామాల్లో జీవిస్తూ వ్యతిరేక భావాలతో ఉన్న రెండు పాత్రలనుపయోగించి గోల్డింగ్ ఈ రహస్యాలను ప్రవేశపెట్టారు. ఆ పాత్రలే మ్యాటీ, సోఫీ.

మాటీ భౌతికంగా అందంగా లేకపోయినా తన ప్రపంచంలో నిస్వార్థ ప్రేమ, అంకిత భావాలతో ఒక సాధువులా జీవిస్తాడు. తనకి వ్యతిరేకంగా సోఫీ దుర్మార్గ శక్తులకు ప్రతినిధిగా ఉండే అందమైన యువతి, తన కౄర ప్రవర్తనతో, జీవితంపై సాధారణ దృక్పథంతో ప్రపంచ వినాశనానికీ, అవ్యక్త స్థితికీ ప్రేరణ కలిగేలా ఉంటుంది, అలానే ప్రేప్రేపిస్తుంది. అన్నింటినీ ఆ దేవుడే చూస్తాడన్న నమ్మకం మ్యాటీదైతే, అవకాశం కోసం ఎదురు చూస్తుంది సోఫీ.ఈ నవల రచన తీరు ఒక్కో పాత్రను సులభంగా అర్థం చేసుకునే రీతిలో ఉంటుంది. మ్యాటీ స్వచ్ఛమైన క్రీస్తు ప్రతిమగా వర్ణించబడ్డాడు. ఎందుకంటే ఈ నవలలో మ్యాటీ అగ్ని ప్రమాదం నుండి తప్పించుకున్న ఓ మంచి వ్యక్తి. ఇంకా చెప్పాలంటే, ఎక్కడ నుండి వచ్చాడో అంటే ఏ ప్రాంతానికి సంబంధించిన వాడో తెలియదు కానీ మంటల్లో నుండి అద్భుతంగా, అంతే ఆశ్చర్యంగా బయటకొస్తాడు. తన ఎడమ వైపు ముఖ భాగం పూర్తిగా కాలిపోయి మాట్లాడలేని స్థితిలో ఉన్న మ్యాటీని అక్కడున్న కొంత మంది వ్యక్తులు ఆసుపత్రిలో చేర్చి, మ్యాటీ ఎవరనేది తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో వారే తనకీ రెండు క్రీస్తు పేర్లు మాథ్యూ, సెప్టిమస్గా పెట్టి పిలుస్తారు. తరువాత, మ్యాటీగా గుర్తించబడిన తనని స్కూలుకి పంపించినా అక్కడున్న పిల్లలతో, టీచర్లతో సరిగ్గా మాట్లాడలేకపోవడం, తన అందవికార ఆకృతి వల్ల ఏ పనీ చేయలేక బాధపడ్డ మ్యాటీ, కొంత మంది విద్యార్థులు, పెడిగ్రీ అనే ఓ టీచర్ సహాయంతో కాస్త చురుగ్గా తయారవుతాడు. అయితే అంతలోనే తన సహచర విద్యార్థి హెండర్సన్ అనుమానస్పద స్థితిలో మరణించడం, తన అభిమాన టీచర్ పెడిగ్రీపై అనుమానంతో ఆయన్ని జైలుకు తీసుకెళ్ళే సమయంలో అదంతా మ్యాటీ తప్పేనని, తన వల్లే అంతా జరిగిందన్న ఆయన మాటలకు మ్యాటీ ఎంతో అపరాధ భావనతో బాధపడి, హెన్డర్సన్ వినాశనానికి ఆధ్యాత్మిక శక్తి ప్రభావముందా అని అర్థం కాని ఆ వయసులో ఆలోచిస్తూ అయోమయంలో ఏం జరిగిందో అక్కడ హెడ్ మాష్టర్కి స్పష్టంగా చెప్పలేక పోవడంతో తననా స్కూలు నుండి పంపించేయడం, ఆ తరువాత ఎక్కడికి వెళ్ళినా అతన్ని తీస్కరించడంతో మ్యాటీ ఓ సంచారిలా మారిపోతాడు.

తరువాత అసలీ ప్రపంచంలో ఏం ఉందో, అంతకన్నా ముందుగా తనను తాను తెలుసుకోవాలని వేరే దేశం వెళ్ళి ఎన్నో సాహస కార్యాలు చేస్తాడు. మ్యాటీ మంచితనానికి వ్యతిరేకంగా ఇద్దరు కవలలు సోఫీ, ఆంటోనియాలు తమ వయసుకు మించిన దుర్మార్గాలు చేస్తుంటారు. సోఫీ, టోనీలు సహజ దుర్మార్గాన్ని ముఖాలకు తొడుకున్నట్లుగా ఉంటారు. ఆ కవలలు భౌతిక అందం వారి అంతఃచీకటిని దాచితే, మ్యాటీ నిరాకారమైన ముఖమ్, శరీరం తనలో దాగియున్న మంచితనాన్ని తెలియకుండా చేశాయి. కొన్ని సౌమ్య శక్తులు మ్యాటీ, సోఫీలను వ్యతిరేక దిశల్లో అభివృద్ధి చేశాయి. మ్యాటీ తనకు తానుగా అధ్యాత్మికంగా, నిర్మాణాత్మకంగా మారితే, సోఫీ ఏ మాత్రం మంచి లేకుండా, తన దుర్మార్గ ఆలోచనల్ని ప్రజలు అంగీకరించేలా వారిని ప్రేరేపిస్తుంది. ఈ నవల రెండో భాగం చివర్లో ఒక పిల్లడిని కిడ్నాప్ చేసి, తనని హింసించి, చమ్పేయాలనుకున్న సోఫీ దుర్మార్గం బయటపడితే, మ్యాటీ మంచితనపు శక్తులతో ఆ పిల్లాడిని రక్షించి తన మంచితనాన్ని నిరూపించుకున్నాడు. మంచి, చెడుల మార్గాలైన మ్యాటీ, సోఫీలు ఏ విధంగా ప్రభావితం చెందారో తెలుసుకోవచచు. మంచి, చెడుల మధ్య జరిగిన పోరాటంలో వాళ్ళు పడ్డ సంఘ్ర్షణను గమనించగలం.

ఇక మూడో భాగం, అధ్యాత్మిక ఏకాంత వాస స్థితిని చూపిస్తుంది. అడ్డులు, అడ్డుగోడలు మనుషులతోనే నిర్మించబడతాయి. వాటిని కూల్చేయాలి. ఇది మ్యాటీకి సాధ్యమేనని చెప్పారు. క్రీస్తు ప్రతిమ కనుక అంతరాల్లో ఉన్న రోదనను ఆపగల శక్తి మ్యాటీకున్న వరం. గొప్ప బలంతో మానవ దుర్మార్గం, వారు చేసే పాపాల కోసం విచారిస్తూ, ఇంకా మానవత్వం పై ప్రేమను చూపిసతూ నిశ్శబ్దంగా సంభాషంచగలడు. దానికి ఉదాహరణగా తన సహచరుడు హెండర్సన్ మరణం విషయంలో బంధించబడిన పెడిగ్రీ విడుదలయ్యాక మ్యాటీ అతన్ని కలిసి ఎంతో ఆప్యాయంగా మాట్లాడి తన గురుభక్తిని చూపించాడు. మ్యాటీని క్రీస్తు త్యాగంతో పోల్చి చూపించారు గోల్డింగ్.

అయితే ఈ నవల ముఖ్య ఉద్దేశం అంతిమ తీర్పుగా కనపడిన అలాంటి తీర్పేదైనా వచ్చిందా అంటే ఖచిఛితంగా రాలేదని చెప్పొచ్చు. ఇక్కడ ఎవరూ శిక్షింపబడలేదు, ఎవరూ హర్షించబడలేదు. ఈ నవల ఒక్క తీర్పుకో, మంచితనానికో సంబంధించింది కాదు. నైతికాంశాల్లో అంతిమ తీర్పు పొందడం ఎంతో కష్టమని చెప్పడం మాత్రమే. అయితే ఇక్కడ మ్యాటీ ఆత్మగా, సోఫీ శరీరంగా వర్ణించడం జరిగింది. కానీ ఆధ్యాత్మికతలో ఉన్న నిజాన్ని ఖచ్ఛితత్వాన్ని ఖచ్ఛితంగా చెప్పలేం. ఇంకా ఆ ఆధ్యాత్మికతతో మ్యాటీకున్న సంబంధ్మేంటో కూడా చెప్పలేం. మ్యాటీకి అసాధ్యమైన డిమాండ్లను చేస్తున్న ఆత్మలో ఉన్న అసలైన అంశాన్ని కూడా చెప్పలేం.

కానీ, ఈ డార్క్నెస్ విజ్బుల్లో ఒక అందవికారమైన, ఎవరూ తాకడానికి కూడా ఇష్టపడని, అందరూ ధూషించే ఓ వ్యక్తి తనలోని అపారమైన ఆత్మవిశ్వాసంతో ఒక్కడే ఒంటరిగా దుర్మార్గానికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో సాధించిన విజయం మానవుల ధైర్యానికి ఒక ఉత్సాహం, ఉల్లాసం, ప్రోత్సాహాలకు చిహ్నం.

Friday, April 25, 2008

పడుగు పేకల మధ్య జీవితం

శీలా వీర్రాజు మంచి కథా రచయిత, నవలా రచయిత, చిత్రకారుడు, కవి, ఇంకా వివిధ రూపాల్లో ఎంతగానో ఎదిగిన ఒక మహా వ్యక్తి. కవిత్వాన్ని వచన రూపంలో చెప్పిన తీరు అందరికీ అర్థమయ్యే రీతిలో ఉంటుంది. ఈ విధంగా వచన కవిత్వాన్ని వివిధ అంశాలపై రాశారు. అలా ప్రచురితమైన అన్ని కవితలను ఒకే సంపుటిలో అందచేయాలనే ఉద్దేశంతో ప్రచురించిన పుస్తకం, "శీలా వీర్రాజు కవిత్వం". ఆరు వచన కవితలు, కొన్ని విడి కవితలతో కలిసి ఉన్న ఈ పుస్తకం ఒక్కటి చాలు ఆయన సాహిత్యాభిలాషని, జీవితానుభవాలను, జీవిత విశేషాలను సులభంగా తెలుసుకోవడానికి. ఈ ఆరు వచన కవితల్లో ఒకటైన 'పడుగు పేకల మధ్య జీవితం' ఆయన ఆత్మ కథకు రూపం. పడుగు పేకల మధ్య జీవితం అనగానే ఎవరైనా బడుగు ప్రజల జీవితం అనుకుంటారు కానీ నిజానికి ఇది ఆయన సొంత జీవితం. ఆ పరిచయం ఇప్పుడు మీకోసం....

ఆత్మకథను కథగా రాయడం తేలికే. కానీ దాన్ని కవితగా, నలుగురికీ సులభంగా అర్థమయ్యే రీతిలో రాయడమంటే మాటలేం కాదు. అలాంటిది తన ఆత్మ కథను కవితా రూపంలో ఉంచి, అది చదివిన వాళ్ళు తాము కూడా తమ స్వీయ జీవితాన్ని కూడా అలా రాస్తే బావుంటుందన్న భావనకు రాగలగడం దీని ప్రత్యేకత. ఈ కవితలో మూడు భాగాలున్నాయి. మొదటి భాగంలో ఎం తో సరదాగా సాగిన ఆయన బాల్య జీవితం,అందరికీ తమ జీవితాలకు ఎంతో ఉపయోగపడే చదువును రెండో భాగంలో, ఆ తరువాత జీవితాన్ని ఆనందమయం చేసుకోడానికి, ఆర్థికంగా ఏ ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కావల్సిన ఉద్యోగం, ఆ క్రమంలో ఆయన చేసిన ప్రయత్నాలు, ఎదుర్కొన్న బాధలు, చివరిగా జీవితానికి చివరి దాకా, తోడుగా ఉండేందుకు చేసిన ప్రయత్నం, పెళ్ళి అనే అంశాలను మూడో భాగంలోనూ తనదైన శైలిలో కవీత్వీకరించారు. జీవితం అంటే ఇలాగే ఉంటుందని, ఒడిదుడుకులెదురైనా మంచి కుటుంబం, స్నేహితులు, ముఖయంగా ఏదైనా సాధించాలన్న తపన ఉంటే తప్పకుండా మనం మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది.

ఎటువంటి కష్టాలు లేకుండా ఎంతో ఆనందంగా సాగే బాల్యం ఆయన జీవితంలో ఎలా సాగిందో చెప్పిన తీరు, ఆయన నివసించిన ప్రాంతం, గోదావరి వర్ణన, ఆ రోజుల్లో జరిగిన యుద్ధ సమయంలో ఎలా ఉండేది, తనకు చదువు చెప్పిన గురువులు, తనలోనూ బొమ్మలు వేసే ఓ కళ దాగుందని తెలిసి కలిగిన ఆనందం, పండుగుల వేళ జరిగే ఉత్సవాలు, స్నేహితులతో కలిసి ఆడిన ఆటలు అన్నీ కళ్ళకు కట్టినట్లు, మనసుకు హాయి కలిగేట్టు వివరించారు.

ఇరుకు గదుల ఇంట్లో ఉమ్మడి కుటుంబంతో ఆర్థికంగా కొన్ని ఇబ్బందులున్నా అభిమానం, ఆప్యాతలున్న చోట కష్టాలైనా కనుమరుగవుతాయాని ఇట్టే అర్థమవుతుంది ఆ వచన కవిత ద్వారా. తన భవిష్యత్ సాహిత్య జీవితానికి బాల్యంలోనే పునాది పడిందని చెప్పడంలో ఆనందం కనిపిస్తుంది. ఏదైనా మంచి పనుల్లో విజయం సాధించినందుకు పరోత్సాహకరంగా ఇచ్చే కానుకల్లో, వాటినిచ్చిన వ్యక్తుల గొప్పతనాన్ని పరిశీలించాలని కూడా తెలుసుకోవచ్చు మనం. ఇలాంటి మంచి అంశాల్ని, జీవిత సూత్రాల్ని తన బాల్యం ద్వారా తెలుసుకుంటూనే మనకు తెలియకుండా రెండో భాగానికి చేరుకుంటాం.

బాల్యం అయిపోయింది. ఎంతో ఆనందంగా ఉండాలి, అందంగా కన్పించే ప్రతీ వాటినీ ఆస్వాదించాలన్న కోరిక ఒక వైపు, మరో వైపు రాబోయే జీవితంలో ఆనందంగా ఉండాలంటే వచ్చిన ప్రతీ అవకశాన్ని ఆచి తూచి ఆలోచించి, సద్వినియోగపరుచుకుంటూ, విద్యను అశ్రద్ధ చేయకుండా ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన కౌమార దశ. అందుకేనేమో యావదాంధ్రలోనే మొట్టమొదటి కళాశాలలో తానూ ఒక విద్యార్థినని గర్వంగా చెపారు శీలా వీర్రాజు. పెద్దవాళ్ళకు భారం కాకుండా ఓ పక్క చదువుకుంటూ, మరో పక్క తమలో ఉన్న వేరేదైనా కళను ప్రదర్శిస్తూ, తద్వారా ఎంతో కొంత సంపాదిస్తూ, లేదంటే బాగా చదివి స్కాలర్షిప్ల ద్వారానైనా కొంత మొత్తాన్ని పొందుతూ, తమ తల్లిదండ్రుల బాధ్యతలో కొంతైనా తలకెత్తుకుని, తమ వంతు బాధ్యతను నిర్వర్తించవచ్చని, చదువుకునే విద్యర్థులు ఓసారి ఆలోచించుకునేలా చేస్తుందీ కవిత. అయితే ఏదైనా సాధించలంటే ఆత్మవిశ్వాసంతో ఉండాలే కాని ఆత్మాభిమానాన్ని కోల్పోకూడదు. అలా చేయాల్సి వస్తే ఆ పని ఆ విధంగా చేసే కన్నా చేయకుండా ఉండడమే మేలన్నది తాను నేర్చుకున్నారు, తన జీవితానుభవం నుండి మనమూ నేర్చుకోగల మంచి పాఠం.

ఇక ముఖ్యమైంది జీవితంలో స్థిరపడడం. ఈ విషయంలో ఎక్కడా ఏ విధంగా రాజీ పడకూడదని మనకిష్టమైంది చేస్తేనే త్రుప్తిగా, సంత్రుప్తిగా ఉండగలమని ఋజువైందీ కవితలో మరోసారి. అందుకు తగ్గట్టే ప్రభుత్వ ఉద్యోగమొచ్చినా ఆయనకిష్టమైన సాహిత్య రంగంలోనే సంపాదకునిగా స్థిరపడాలనుకున్నారు. అందుకు వేరే ఊరికి మారి అక్కడ ఎన్నో కష్టాలు పడినా ఇష్టమైన ఉద్యోగం కనుక వదిలి వెళ్ళకుండా అక్కడే ఉండి ఆ ఉద్యోగంలోనే ఆనందాన్ని వెతుకున్నారు. అయితే ఇక్కడ ఇంకో విషయముంది, ఎంతిష్టమైన ఉద్యోగమైనా ముందుగా చెప్పినట్లు ఆత్మాభిమానాన్ని కోల్పోవాల్సి వస్తే మాత్రం ఆ ఉద్యోగాన్ని వదలక తప్పదు. అదే చేసారయన. కానీ, సధించాలన్న తపనుంటే ఒడిదుడుకులెన్నెదురైనా సరే తమలో కళ సజీవంగానే ఉంటుంది, అదే బతుకునీడ్చుకొస్తుందని, ప్రముఖులతో పరిచయాలు పెంచుకునేందుకు తోడ్పడుతుందని ఆయన సాహిత్య జీవితాన్ని చూస్తే అర్థమ్వుతుంది. దీనినే ఈ కావ్యం మూడో భాగంలో చూడొచ్చు.

తొలి జీతం, అందులో సగం అమ్మా నాన్నలకిస్తే ఉండే ఆనందం దాదాపుగా అందరూ అనుభవించేదే. ఆ అనుభవాన్ని మాటల్లోకంటే కవితా రూపంలో చక్కగా చెప్పారు. ఒక ప్లాన్ వేస్తూ ముందుకు సాగితే మనం ఒకటి, రెండు పనులకన్నా మరో ఒకటి, రెండు పనులు నీట్గా చేసి, పేరు, డబ్బు, కీర్తిలను సంపాదించుకోవచ్చ్చని, అయితే ఏ అంశంలోనైనా చేయాలన్న కసి, కృషి,తపనలు ఉండి తీరాలన్నది అందరూ గుర్తుంచుకోవాల్సిన సత్యం. స్నేహితులుంటే ఆ సరదనే వేరు. స్నేహానికి ఎంతటి విలువనివ్వాలో అంతే విలువనిచ్చారు కవి. స్నేహాన్ని ప్రేమగా చూడాలే కానీ, డబ్బుతో కొనకూడదన్న మరో వాస్తవాన్ని గుర్తు చేసారు.

కవి రచించిన ఇతర రచనలు, కవితలు, పొందిన సన్మాన, సత్కారాలను వివరించారు. పల్లెటూళ్ళ అందాలను, పట్నంలో ఏకాకి జీవితంలో ఉండే కష్టాలను, వాటిని తాను ఎదుర్కొన్న సందర్భాలను చెప్పారు. ఒకానొక సందర్భంలో ఆయనకు లభించిన గౌరవానికి గర్వపడ్డానని నిజాయితిగా, సగర్వంగా చెప్పుకున్నారు. ప్రత్యేకంగా మరో కవితను కూడా పొందుపరిచారు. అయితే జీవితమన్నాక కష్టసుఖాలుంటాయిగా. ఆత్మీయులను కోల్పోతాం, తల్లిదండ్రులను కోల్పోతాం. కానీ వాళ్ళున్న రోజుల్లోనే మనం మంచి పేరు తెచ్చుకుంటూ, తద్వారా మన తల్లిదండ్రులకు గొప్ప పేరు తెస్తే, అందుకు వాళ్ళు పొందే ఆనందం చాలదా మన జీవితానికి. అదే సాధించారాయన. అదే అందరం సాధించాలి. ఇలా తన స్వీయ చరిత్రలో బాల్యం నుండీ ఉన్న అమూల్యమైన తీపి జ్ఞాపకాలను, కొన్ని అవమానాలు, వాటికి ఆయన స్పందించిన తీరు, నేర్చుకున్న పాఠాలు, చదువుకోవాలన్న పట్టుదల, స్నేహం, సాహితీవేత్తలతో ప్రత్యేకమైన స్నేహం, పొందిన ప్రశంసలను వివరిస్తూ, సంగీత,సాహిత్యాల పట్ల ఎంతో మక్కువున్న ఆయన మేనమామ కూతురు సుభద్రా దేవితో జరిగిన తన వివాహం వరకే రాసి ముగించారు.

శీలా వీర్రాజు రాసిన వచన కవితా తీరు అద్భుతం, చేసిన సాహసం ప్రశంసనీయం.

శీలా వీర్రాజు వచనా కవిత్వం
రాగాలు పలికే సుందర జలపాతం
లోతైన భావాలున్న సముద్ర గర్భం
సులభంగా అర్థమయ్యే కావ్యరూపం
ఈ అద్భుతం నిజంగా ప్రశంసనీయం
కాగలదు అందరికీ మార్గదర్శకం.

Wednesday, February 27, 2008

పెళ్ళి చూపులు

అనాదిగా వస్తున్న ఆచారం
చెప్పాలంటే ఇదొక గ్రహచారం
ఎప్పుడో మొదలై, ఇప్పటికీ సాగుతూ
సంతల్లో సరుకులా, అంగట్లో బొమ్మలా...

చుట్టూ తక్కువ కాకుండా పది మంది
తెలియని వారు, తెలిసిన వారూ ఉంటారు
మధ్యలో ఎలా ఉండాలో తెలియక
అంతలో ఏమి చేయాలో తోచక
అందరూ ఉన్నా ఎవరూ లేని ఒంటరై....

ఎన్నో తెలివితేటలతో అన్నింటా
విజయం సాధిస్తూ, చాకచక్యంగా
ఎంతటి పన్నైనా, తన వాక్చాతుర్యంతో
అందర్నీ మెప్పించే ఓ అమ్మాయి!!....

తన తల్లిదండ్రుల కోసం, వారి గౌరవం కోసం
తన జీవితంలో 'పెళ్ళి' అనే పనికి కట్టుబడి
"పెళ్ళి చూపులు" అనే మాటకి రాజీపడి
ఏమీ చేయలేని తరుణంలో, ఎక్కడా తలవంచని
ఆమె తలదించుకోక తప్పని పరిస్థితి....

ముందుగానే అన్ని వివరాలు తెలుసుకుని
వచ్చిన వాళ్ళు లక్ష ప్రశ్నలు వేసి
నచ్చింది! అంటే ఏ మాత్రం లేదు ఆశ్చర్యం
లేదంటే! అయినా ఉండదు ఆశ్చర్యం
కానీ, కని వాటిని లోపాలుగా ఎత్తి చూపి వెళ్ళిపోతే....

తెలిసిన వారు ఒక మాటంటేనే ఒప్పుకోం మనం
తెలియని వారు ఎదురుగానే ఎన్నో కామెంట్లు ఇచ్చేస్తుంటే
అలా అంటున్న వాళ్ళని తిట్టాలా?
అలా పిలిచిన వాళ్ళని కోప్పడాలా?
పోనీలే పాపం అని ఊరుకోవాలా?

అన్నీ మారుతున్న నేటి సమాజంలో
ఈ పద్ధతి మాత్రం మారదెందుకనో?
ఎంతో పవిత్రమనుకుంటున్న ఈ సాంప్రదాయం
మగ పిల్లల తల్లిదండ్రులు ఆశించే
లాభాలకు పెట్టుబడి లేని వ్యాపార సూత్రం....
ఒక్కసారి మొదలుపెట్టండి ఆలోచించడం!!!!

Friday, February 22, 2008

చిట్టి చేతులు

మన సంస్కృతి, కట్టుబాట్లు, అలవాట్లు ఇలా అన్నింటి పైనా నిశ్శబ్ద ఆంక్షలు విధిస్తున్న కనిపించని రూపం "ప్రపంచీకరణ", జరుగుతున్న కాలం ఇది. ఈ నేపథ్యంలో అణగారిన్, అట్టడుగు, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలు విద్యకు ఏ రకంగా దూరమైపోతారోనని ఆందోళన చెందుతున్న ప్రముఖ విద్యావేత్త 'చుక్కా రామయ్యా గారు బడికి రాని పిల్లలపై దృష్టి సారించి, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిస్తామని పాలకులు చెప్పిన మాట్లని ఆచరణలో ఎందుకు అమలు జరపలేకపోతున్నారన్న విషయాన్ని ప్రశ్నిస్తూ, ఈ బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు ఎవో తూతూ మంత్రంగా పని చేస్తే సరిపోదని, ఇందుకోసం ఓ మహత్తర ఉద్యమాన్ని కొనసాగించాలని, లేదంటే వీధి పిల్లల్లేని, బాల కార్మికుల్లేని సమాజాన్ని నిర్మూలించలేమని, మనకంటే వెనుకబడిన దేశాలు ఈ పనిలో ఏ పని విధానాన్ని ఎంచుకున్నారో, అందుకోసం ప్రభుత్వాలు, యూనివర్సిటీలు, విద్యార్థులు, ఇలా అందరూ ఏ రకమైన భాగస్వామ్యాన్ని తీసుకోవాలో, ఎలాంటి చర్యలు చేపట్టాలో సూచిస్తూ రాసిన పుస్తకం "చిట్టి చేతులు" అందరూ చదవాలనే ఉద్దేశంతో.....నేడు మనం అందరినీ, అంటే, దొర వాకిలూడ్చి, పశువుల కొట్టంలో పని చేస్తున్న చేతులను, బానిస బతుకులు బతుకుతునా చ్యక్తులను, శక్తులను, పెద్దలు చేసిన అప్పుకు వేలి ముద్ర వేసి జీవితాన్ని తాకట్టు పెట్టి బతుకుతున్న వారిని, బడికి పోతానన్నందుకు చెంపపై చెల్లుమని దెబ్బ కాచిన అమ్మాయిలను ఇలా అందరినీ చదువుకోడానికి పిలుస్తున్నాం, చదువుకెళ్ళమని చెప్తున్నాం. వర్గం, కులం, మతం, లింగం, ప్రాంతం, వెనుకబాటుతనం అన్న అంశాలతో పోల్చి చూసినపుడు పేదరికం కూడా ఒక అంశమే కానీ మొత్తం పేదరికమే నిరక్షరాస్యతక్దు కారణం కాదు. బడికి రాని పిల్లవాడు బాల కార్మికుడేనా అన్నదానికి సమాధానాలు వెతకమంటారు. చదువుకోడానికి పిల్లలెందుకు బడికి రావడం లేదన్న అంశాన్ని లోతుగా పరిశీలిస్తే, అసలెవరైనా చదువుకోడానికి, చదువుకోకపోడానికి కారణం సాంస్కృతిక నేపథ్యమే. సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలే చదువుని నిర్థారిస్తాయి, పరిసరాలే అక్ష్రాస్యతను నిర్దేశిస్తాయి. ప్రతి మనిషిలో ఒక మార్పుకు పాదు చదువు అనే దృక్పథం పెరిగితేనే, సకల వృత్తుల్లో బాల్యాన్ని కరిగిస్తున్న పిల్లలు బడికి వస్తారు. చదువుకుంటే పిల్లలు తమకు దూరమైపోతారేమో, చదివిన చదువుకు ఉద్యోగం దొరకదేమో, ఒకవేళ అలానే జరిగితే చాలా మంది అటు ఉద్యోగం దొరకక, ఇటు కులవృత్తులకు సంబంధించిన ఓనులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటారేమోనన్న కొన్ని అపోహలు సామాన్య ప్రజల్లో తొలగిపోవాలంటారు. రాష్ట్ర ప్రభుత్వం, కొన్ని స్వఛ్ఛంద సంస్థలు ఇంత కృషి చేస్తునప్పటికీ మనం వెనుకబడే ఉంటున్నాం, అయితే దీనిపై విశ్లేషణ జరగకపోవడం వల్లే ఇలా జరుగుతుందట. చాలా మంది అటు చదవక, ఇటు పనికీ వెళ్ళక ఉంటారు. మరి వారినీ బాల కార్మికులని ఎలా అనగలం? ఇలా పరిపరి విధాల విశ్లేషిస్తే జనాభా నియంత్రణను కూడా పరిగణించాలి, దీనిపై అట్టడుగు వర్గాల వారికి నమ్మకం కలిగించాలి. ఉన్న ఒక్క బిడ్డకి ఏదో చిన్న ఉద్యోగమైనా వస్తుందన్న భద్రత, ఆడపిల్లలు బడికి రావలసిన వసతులన్నింటినీ కల్పించాలి. ప్రపంచీకరణలో భాగంగా ప్రతి వసతువు తక్కువ ధరకు ఉత్పత్తి చేస్తే, బాల కార్మికుల సంఖ్య పెరిగిపోతుంది. తక్కువ ధరకు కూలీలు కావాలంటే పిల్లలే దొరుకుతారు. కాబట్టి ఈ వ్యవస్థను నిర్మూలించాలంటే మొదటి దశగా సామజిక, సాంస్కృతిక నేపథ్యాల నుంచి తొలచుకొస్తున్న బాధలను వాడికి పాఠాలౌగా చెప్తూ, తన బడి ఇల్లు అనుకునే పరిస్థితి తీసుకురావాలని సూచించారు.

అయితే, ఇంటి భాష లేకనే బడికి పిల్లలు దూరమవుతున్నారట. అందుకు నిదర్శనంగా రామయ్య గారు ఓ ఇంటి పిల్లవానిగా చాల చక్కని ప్రశ్నలు వేశారు. అగాథంలో ఎక్కడో వెనకపడ్డ వర్గానికి చెందిన ఒక పిల్లవాడు చదువుకున్నామని, జ్ఙానులమని తిరిగే వాళ్లల్లో ఎంత వరకు ఇముడ్చుకోగలడనే అనుమానం, మీరైనా మారాలి, లేక నేనైనా మారాలై, ఉభయుల కలయిక ఇంటి బడి కావాలంటూ, నేను మా శ్రమ సంస్కృతిని వదులుకునేందుకు సిద్ధంగా లేను, మీ చదువుల వల్ల నేను బాగుపడాలనే కోరిక మీకుంటే నా ఇంటి చదువు నాకిప్పించండంటూ మీ అక్ష్రాల ద్వారా, నా ఇంటి జ్ఞానం ద్వారా బాగుపడటానికి, బతకటానికి స్కూలుకు వచ్చేందుకు సిద్ధపడతాను, మీరే తేల్చుకోండంటూ, పెద్ద చదువులు చదివిన వారు మనుషుల్ని సక్రమంగా నడిపించలేక పడుతున్న పాట్లు అన్నిన్ని కావని, అజ్ఞానుల మాటల్లో రామయ్య గారు చక్కగా వివరించి, ఆలోచించేలా చేశారు. అయితే, పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులకు తమ వృతుల్లో సహాయపడడమనే భావంతో ఉండేవారు. ఇదో చక్కని బాంధవ్యంగా ఉండేది. కానీ, బ్రిటీష్ ప్రభుత్వం తమ పరిపాలనను కొనసాగించుటకై, భూమిపై తన ఆధిపత్యం సంపాదించి జమీందారీ వ్యవస్థను, భూస్వామ్య వ్యవస్థను తీసుకొచ్చినప్పటినుంచీ ఈ భాందవ్యాల మధ్య విఘాతం కలిగి, అదే బాల కార్మిక వ్యవస్థ పుట్టుటకు, వెట్టి చాకిరీకి కారణమయ్యింది, కానీ గ్రామీణ సంస్కృతి కాదని మనం తెలుసుకోవాలి. ఎక్కువ లాభాలను ఆశించి, పారిశ్రామిక వర్గం వారు తక్కువ ఖర్చుతో పిల్లలను పనిలోకి తీసుకుంటున్న సంగతి తెలిసిందే, దీనికంతటికీ కారణం తెలుసుకోవాలి. బడికి పంపనందుకు తల్లిదండ్రులని సిక్షించాలా? బడికి రానందుకు పిల్లలను కోప్పడ్డాల? కానీ, లోతుగా పరిశీలించినట్లయితే దీనికి కారణమైన మహనీయులను శిక్షించాలి. కానీ, అది జరిగే పనేనా?(జరిగితే ఎంతో బావుంటుంది). ఈ వ్యవస్థను నిర్మూలించాలంటే పిల్లలకు బోధించే ప్రాథమిక విద్యలో కనీసం మార్పు తేవాలి. కుల, మత, మూఢ విశ్వాసాలను ఆయుధంగా ప్రాథమిక విద్యను తీర్చిదిద్దాలి. బాల కర్మికుడి జీవితానికుపయోగపడే విధంగా వాడి యాసలో, భాషలో తయారుచేసే అవి అతని జీవితాన్నే మార్చేస్తాయని భావించాలంటారు. ఇలా చేయడమంటే ఒకటి నుండి అయిదో తరగతి వరకూ సిలబస్ను మార్చడం కాదు. ఈ వ్యవస్థకు పట్టిన చీడలను వదిలించాలి. ఒక ఊరికి ఎన్నో సేవలనందిస్తున్న వృత్తులను తక్కువ చేసి, తనది కాని సంస్కృతిని బలవంతంగా వాళ్ళపై రుద్దటానికి ప్రయత్నం చేయకుండా, అందరి బాధల్ని, కష్ట సుఖాల్ని, స్రమను, వాళ్ళ పరిసరాల గురించి పిల్లలకర్థమయ్యే భాషలో చెప్తే బాలలు కార్మికులుగా మారరేమో. ఇక నిరక్షరాస్యతకు కారణాలెన్నో. ముఖ్యంగా చెప్పుకోవల్సింది కొన్ని వృత్తులు ఎలా చేయాలో పుస్తక రూపంలో లేకపోవడమే. వాటిని మౌఖికంగా నేర్చుకుని చేస్తున్నారు. చదువుకున్న వారు చేసిన పరిశోధన తక్కువే కావటంతో చదివి తెలుసుకునే వీలు లేక వారి నైపుణ్యాన్ని పెంచుకోలేకపోతున్నారంటూ, వృత్తులపై పుస్తకాలు వచ్చే ప్రయత్నం చేసినపుడు కొంత నిరక్షరాస్యతను తొందరగా తగ్గించవచ్చనుట నిస్సందేహం. ఇలా చేయడమంటే ఒకటి నుండి అయిదో తరగతి వరకూ సిలబస్ను మార్చడం కాదు. ఈ వ్యవస్థకు పట్టిన చీడలను వదిలించాలి. ఒక ఊరికి ఎన్నో సేవలనందిస్తున్న వృత్తులను తక్కువ చేసి, తనది కాని సంస్కృతిని బలవంతంగా వాళ్ళపై రుద్దటానికి ప్రయత్నం చేయకుండా, అందరి బాధల్ని, కష్ట సుఖాల్ని, స్రమను, వాళ్ళ పరిసరాల గురించి పిల్లలకర్థమయ్యే భాషలో చెప్తే బాలలు కార్మికులుగా మారరేమో. ఇక నిరక్షరాస్యతకు కారణాలెన్నో. ముఖ్యంగా చెప్పుకోవల్సింది కొన్ని వృత్తులు ఎలా చేయాలో పుస్తక రూపంలో లేకపోవడమే. వాటిని మౌఖికంగా నేర్చుకుని చేస్తున్నారు. చదువుకున్న వారు చేసిన పరిశోధన తక్కువే కావటంతో చదివి తెలుసుకునే వీలు లేక వారి నైపుణ్యాన్ని పెంచుకోలేకపోతున్నారంటూ, వృత్తులపై పుస్తకాలు వచ్చే ప్రయత్నం చేసినపుడు కొంత నిరక్షరాస్యతను తొందరగా తగ్గించవచ్చనుట నిస్సందేహం. ఇలా చేయడమంటే ఒకటి నుండి అయిదో తరగతి వరకూ సిలబస్ను మార్చడం కాదు. ఈ వ్యవస్థకు పట్టిన చీడలను వదిలించాలి. ఒక ఊరికి ఎన్నో సేవలనందిస్తున్న వృత్తులను తక్కువ చేసి, తనది కాని సంస్కృతిని బలవంతంగా వాళ్ళపై రుద్దటానికి ప్రయత్నం చేయకుండా, అందరి బాధల్ని, కష్ట సుఖాల్ని, స్రమను, వాళ్ళ పరిసరాల గురించి పిల్లలకర్థమయ్యే భాషలో చెప్తే బాలలు కార్మికులుగా మారరేమో. ఇక నిరక్షరాస్యతకు కారణాలెన్నో. ముఖ్యంగా చెప్పుకోవల్సింది కొన్ని వృత్తులు ఎలా చేయాలో పుస్తక రూపంలో లేకపోవడమే. వాటిని మౌఖికంగా నేర్చుకుని చేస్తున్నారు. చదువుకున్న వారు చేసిన పరిశోధన తక్కువే కావటంతో చదివి తెలుసుకునే వీలు లేక వారి నైపుణ్యాన్ని పెంచుకోలేకపోతున్నారంటూ, వృత్తులపై పుస్తకాలు వచ్చే ప్రయత్నం చేసినపుడు కొంత నిరక్షరాస్యతను తొందరగా తగ్గించవచ్చనుట నిస్సందేహం. ఇలా చేయడమంటే ఒకటి నుండి అయిదో తరగతి వరకూ సిలబస్ను మార్చడం కాదు. ఈ వ్యవస్థకు పట్టిన చీడలను వదిలించాలి. ఒక ఊరికి ఎన్నో సేవలనందిస్తున్న వృత్తులను తక్కువ చేసి, తనది కాని సంస్కృతిని బలవంతంగా వాళ్ళపై రుద్దటానికి ప్రయత్నం చేయకుండా, అందరి బాధల్ని, కష్ట సుఖాల్ని, స్రమను, వాళ్ళ పరిసరాల గురించి పిల్లలకర్థమయ్యే భాషలో చెప్తే బాలలు కార్మికులుగా మారరేమో. ఇక నిరక్షరాస్యతకు కారణాలెన్నో. ముఖ్యంగా చెప్పుకోవల్సింది కొన్ని వృత్తులు ఎలా చేయాలో పుస్తక రూపంలో లేకపోవడమే. వాటిని మౌఖికంగా నేర్చుకుని చేస్తున్నారు. చదువుకున్న వారు చేసిన పరిశోధన తక్కువే కావటంతో చదివి తెలుసుకునే వీలు లేక వారి నైపుణ్యాన్ని పెంచుకోలేకపోతున్నారంటూ, వృత్తులపై పుస్తకాలు వచ్చే ప్రయత్నం చేసినపుడు కొంత నిరక్షరాస్యతను తొందరగా తగ్గించవచ్చనుట నిస్సందేహం.

అసలు బాల కార్మికులెలా ఏర్పడతారు? సాధారణంగా వీరు రెండు రకాలు. పల్లెల నుంది వచ్చిన వారు, పట్టణాల్లో వుండేవారు. కొంతమంది ఇంట్లో ఏదో నచ్చక బయటకు వచ్చేస్తారు. అలాంటివcరే బాల కార్మికులుగా తయారవుతారు. అపుడు వారిని పలు రకాల వ్యాపారాలు చేసే వాళ్ళు ఉపయోగించుకుంటారు. వారి శ్రమను దోపిడీ చేసేస్తారు. ముందుగా బాలలు ఈ దోపిడీ వ్యవస్థకు గురి కాకుండా చూడాలి. ఇలాంటి వారిని ఆదరించి తమదైన రీతిలో సహాయం అందించాలి. దీనికి కార్మిక సంఘాల సహాయం తీసుకున్నా మంచిదే. ఇక ఆడపిల్లల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. మైనారిటీ తీరని ఆడపిల్లలు సినిమాలు చూసి, ఏవేవో ఊహించుకుని నగరాలకు వెళ్ళిపోతారు. కానీ, సినిమా పరిస్థితి వేరు, బయటి పరిస్థితి వేరన్న సంగతి గ్రహించలేక పోతున్నారు. ఆ తర్వాత వళ్ళ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో వేరే చెప్పనవసరం లేదు. ఇలాంటి వారిని ఆదుకోడానికి స్వచ్ఛంధ సంస్థలు ధైర్యంగా ముందుకు రావాలి. ఒక పని చేయాలంటే ఒక మనిషి కన్నా, కొంత మంది వ్యక్తులు ఒక శక్తిగా ఏర్పడితేనే కదా ఏదైనా సులభంగా, విజయవంతంగా జరిగేది.

బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేటపుడు సామజిక, ఆర్థిక సమస్యలను దృష్టిలో ఉంచుకోవాలి. మహిళలు ఈ సమాజంలో ఏ స్థానంలో చూపబడుతున్నారు.? ఏ రకమైనా సంస్కృతి, సాంప్రదాయాలకు కట్టుబడి ఉన్నారు? పట్టణ, నగర మహిళలు ఒకడుగు ముందేసి ఎలా ఉన్నారు? అన్న విషయల్ని గ్రామాల్లో ఉండేవారికి తెలిసేలా శిక్షణ ఇప్పించాలి. బాల్య వివాహాలు ఆపి, బాలికా చదువుకు శ్రీకారం చుట్టాలి. ఇక వికలాంగ పిల్లలకు చేయుాతనందించాలి, వారు ఎంత శ్రద్దతో, కొత్త ఆశలతో ముందుకు వస్తారు, కాని కొత్త వాతావరణంలో ఉండలేక వెళ్ళిపోతారు, అలాంటివారికి ప్రత్యేకంగా శ్రద్ధగా చూడాలి. 'బాల కార్మిక సమస్య' అనగానే చాలా మంది ఇది లేబర్ డిపార్ట్మెంట్కు చెందిందని అనుకుంటారు. కానీ ఇది సమాజ సమస్యే కానీ ఒక 'శాఖ' సమస్య కానే కాదు.

ఇలా కొంతమంది ఉంటే, అసలు తల్లెవరో, తండ్రెవరో తెలియని ఎంతో మంది కనీసం బాల కార్మికుల చిట్టాలో కూడా లేక రోడ్ల మీద, ఫుట్ పాత్ల మీద జీవిస్తున్నారు, మరి వీరి పరిస్థితేమిటి? నిజంగా ఇది దారుణం. ఆరు సంవత్సరాల నుండి పద్నాలుగు సంవత్సరాల వరకు పిల్లల చదువును ప్రభుత్వం చూస్తుంది. ఆరు సంవత్సారల తరువాత వాళ్ళు బడికి వెళ్ళకపోతే బాల కార్మికులని అంటారు. మరి అంతకు ముందే ఈ దేశంలో ఎంతోమంది తమ జీవితాలను మార్చేసుకుంటున్నారు. మున్సిపాల్టి దృష్టిలో పశువులకు, కుక్కలకు లెక్కలుంటాయి, కానీ ఇలాంటి పిల్లలకు లెక్కలు లేవు. కుక్క కరిస్తే మనిషికి హాని కలుగుతుందని వాటిపై నిఘా వేస్తారు, మరి ఇల్లంటి పిల్లలు చదవకపోతే, చైతన్యవంతులు కాకపోతే సమాజంలో ఎన్ని రకాల నేరాలకు కారణభూతులవుతారో చెప్పలేం, ఆలోచించలేం. వీరందిరినీ ప్రభుత్వమే ఒక దారికి తేవాలి. అందరికీ చదువు సాధ్యం కావాలంటే వీధుల్లో అనాధ చిట్టి చేతులు కనపడకూడదు.

ఇక్కడ ముఖ్యమైనది దూసుకొస్తున్న ప్రపంచీకరణ. దీని ఫలితం పేదరికంలో మగ్గుతున్న పిల్లలపై తీవ్రమైన విష ప్రభావాన్ని చూపించనున్నాయి. ఒకసారి బడికి వచ్చిన పిల్లవాడు మళ్ళీ వీధిలో పడకుండా చూసుకోవాలి. కంపెనీలన్నీ ఎక్కడపడితే అక్కడ విస్తరిస్తున్నాయి. ఇది అన్ని రంగాలకూ వర్తిస్తుంది. కార్మికుల సంఖ్య పెరుగుతుంది. దీని వల్ల మగవాళ్ళు, ఆడవాళ్ళూ, ఆర్థిక సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నం చేయడంతో పిల్లలు నిర్లక్ష్యానికి గురవుతారు. అంతేకాక ఆ పిల్లలు కూడా పని చేయాల్సిన పరిస్థితి. పాఠశాలల్లో డ్రాపవుట్ల సంఖ్య పెరిగిపోతుంది. ఇతర దేశాలు మన దగ్గరకు వస్తున్నాయంటే ఆ సంస్కృతి ప్రభావాలన్నీ ఈ పిల్లలపైనా పడతాయి. కనుక, వీళ్ళు మళ్ళీ స్వతంత్ర జీవనాన్ని ఏదోలా ఊహించుకుని వీధి పిల్లలవుతారు. కనుక, ప్రపంచీకరణపైనా దృష్టి పెట్టమంటున్నారు. వారిని భాద్యతగల పౌరులుగా తీర్చిదిద్దాలంటే అంత సులభమేమీ కాదు. దీనిని ఒక యజ్ఞంలా చేయాలి. విద్యార్థులు సైతం దీనిని ప్రోత్సహించాలి. ఒక సోషల్ కమిట్మెంట్ను తీసుకురావాలని, అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని, ఏ ఏ దేశాల్లో ఎవరెలా కృషి చేశారో అధ్యయనం చేసి చక్కగా ఆ వివరాలన్నీ మనకందించారు.

పాఠశాల స్థాయిలోనే వృత్తి విద్య నేర్పాలని, అక్షరాస్యతే విద్య కాదు, 'విద్య అంటే పిల్లల్లోని శారిరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులు సంపూర్ణంగా అభివృద్ధి చెందా'లన్న గాంధీజి మాటలు అనుసరణీయమంటూ అకాడ గాంధీజీ ఆ రోజుల్లో చేతిపని అన్నా, ఈ రోజుల్లో అది వేరే రూపంలో ఉన్న వేరే పనైనా కావచ్చు. ఏదైనా ప్రాథమిక విద్యకు నిధుల కొరత లేదని బడ్జెట్లో తేలింది కాబట్టి కొత్త కోర్సులు ప్రవేశపెట్టవచ్చు. తరువాత విద్యలో అసమానతలు తొలగించాలి. విద్యావకాశాలు అందరికీ సమానంగా అందేలా ప్రభుత్వం చూడాలి. ఇంటి భాషలోనే పాఠాలు చెప్పమంటున్నారు. పర భాషలో చదవడం వల్ల విద్యార్థుల్లో అవగాహన, ఆలోచన, అభివ్యక్తి అన్న మూడు అంశాల్లో దేన్నీ పెంపొందించలేని స్థితిలోకి వెళ్ళిపోవటానికి కారణం పరభాషలో బోధన చేయడమని గుర్తించమంటూ, వారికి తమదైన భాషలోనే పాఠాల్ని బోధిస్తే, మూడు పూటల తిండికి ఢోకాలేని రీతిలో వాళ్ళు నైపుణ్యాన్ని చదువు ద్వారా సంపాదించుకోగలుగుతారు. ఎందుకంటే ఈ రోజుల్లో విద్యర్థి ఎంత మేలైన విద్యను చదువుకొస్తున్నాడో మాత్రమే గ్లోబల్ ప్రపంచానికి అవసరం కనుక దిన్ని అన్ని చోట్లా ఏర్పాటు చేసేలా చూడాలి. మనపైకి దూసుకొచ్చే పరిణామాల్ని మనమేం చేయలేం. ఆ పరిణామాల్నుంచే అడుగులు వేస్తూ మనం మరో కొత్త ప్రపంచాన్ని ఎట్లా నెలకొల్పుకోగలుగుతామన్నదే చూడాలి. తెలిసిన దాని నుంచి తెలియని దని వద్దకు (నోన్ టు అన్నోన్) అన్నది చదువు విషయంలో ప్రాథమిక సూత్రం. అయితే ఇది ఉల్లంఘన జరుగుతుంది. రాడియో గురించి తెలియని వాడికి కంప్యూటర్ గురించి చెప్తే ఎలా అర్థమవుతుంది?అని ప్రశ్నిస్తూ, వాడికి తెలిసిన విషయాలను ఇంకా అందంగా, కొత్తగా బోధిస్తూ, ఆ పై కొత్త వాటిని గురించి చెప్తే, వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన వారు ప్రతిభలో ఏ మాత్రం తీసిపోరంటూ, దీనికి పరిష్కారం పాలకుల చిత్తశుద్ధిపై ఆధారపడి ఉందని చుక్కా రామయ్యగారు వివిధ ప్రాంతాల్లో వివిధ భాషలను పోలుస్తూ, ఉదాహరణలతో చెప్పారు.

ఇక సార్వత్రిక విద్యను పెంపొందించాలని, వర్సిటీల్లో సఖ్యత రావాలని, వాటికి నిధులు రావాలని, వర్సిటీల్లో ఉండే సంక్షోభాలు పోవాలని, ఒకప్పుడు ఎంతో గొప్పగా ఉన్న ఐఐటి లు ఇప్పుడెందుకు చిన్న చూపుకు గురవుతున్నాయి, ప్రభుత్వ విధానాల్లో లోపాలే కార్పొరేట్ విద్యా రంగానికి పునాదులని, ఇంజనీరింగ్ విద్యలో ఉన్న లోపాలు, మొదలైన అంశాలను రామయ్య గారు చక్కగా వివరించారు. అయితే ఇవన్నీ మనందరికీ తెలిసినవే. కానీ, ఎందుకో దేనిలోనూ అభివృద్ధి కనిపించడంలేదు. ఎక్కడ, ఎవరిలో లోపముందో అంతు చిక్కని ప్రశ్న. గొప్ప గొప్ప నేతలు పుట్టింది విద్యాలయాల నుంచే కదా. సమాజ పరివర్తనకు మార్గ నిర్దేశం చేసేది విద్యాలయమే. విద్యా రంగంలో ఏ మార్పు రావాలన్నా అందులో కీలక పాత్ర ఉపాధ్యాయులదే అన్నది అందరికీ విధితమే. కనుక, ఉపాధ్యాయ విద్యలో ఇంకా పరిణామాత్మక, గుణాత్మక మార్పులకు శ్రీకారం చుడితే శ్రేయస్కరంగా ఉంటుందంటున్నారు.

తరువాత చేయాల్సింది కులాల అడ్డు గోడల్ని కూల్చేయాలి. అప్పుడే సమాజం వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది. ప్రీ ప్రైమరి విద్య అందరికీ అందినపుడే అంతరాలు పోతాయి. కనుక, టీచర్ ప్రతీ పిల్లవాడి స్థాయికి దిగి, వాడితో ఉంటూ, వారి అవసరాలకు, వారి భాషలోనే పాఠాలను బోధిస్తే పిల్లలందరూ మేలైన విద్యను అందుకుని, సమాజంలో ఉన్నతులుగా తయారవుతారని, దీని కోసం అందరం కృషి చేయాలి, ముఖ్యంగా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని రామయ్య గారు ఈ పుస్తకంలో వివరించారు.

అయితే, ఈ విషయాలు అందరికీ తెలిసినవే. అందరం ఈ విషయాలన్నిటినీ ఆలోచిస్తున్నాం. కాకపోతే ఏమీ చేయలేక పోతున్నాం. ఈ పుస్తకంలో రమయ్య గారి కోపం, తపన, ఆవేదనల్ని మనం చూడొచ్చు. ఆయన చేసిన సూచనలు, మనమూ అనుకుంటూ ఉంటాం, కాకపోతే వాటిని అమలు జరపడం కోసం ముందుకు రావాలి. ప్రపంచీకరణలో వస్తున్న మార్పులకు ధీటుగా నిలబడి, ప్రాథమిక విద్యను బోధిస్తూ, తన బడి ఇల్లు అనుకునే పరిస్థితిని నెలకొల్పినపుడే, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించగలం., పనులు చేస్తున్న చిన్నారి చిట్టి చేతులకు సహాయాన్నందిస్తూ, రామాయా గారి ఆశ నిజం కావాలని, వీధి పిల్లలు, బాల కార్మికులు లేని సమాజం త్వరలోనే రావాలని ఆశిద్దాం.






Monday, January 28, 2008

ఆకాశానికి నిచ్చెనలు

ఇంత వరకు ఎవరైనా ఆకాశానికి నిచ్చెనలు వేసి, ఆకాశాన్ని అందుకున్నారా? ఇంకొంచెం దీక్షగా, మరి కొంత మనస్సు, దృష్టి కేంద్రీకరించి చూడండి. అవిగో, అనంతమైన ఆకాశంలో లక్షలాది, కోట్లాది నిచ్చెనలు ఆకాశం అంచులను తాకుతూ కనబడటం లేదా మీకు? అన్న ఎ.జి.కృష్ణమూర్తి గారి ప్రశ్నకు అందరికీ అనంతమైన ఆకాశాన్ని అందుకోవాలనే కల కలుగుతుంది. నెరవేరని కలలుండవు అన్న మాటను మనం నమ్మితే ఎవరో మహానుభావుడు చెప్పినట్టు ప్రపంచంలో అన్ని శక్తులు మనల్ని మన గమ్యం చేరుస్తాయంటూ కృష్ణమూర్తిగారు తన జీవితానుభవాలను, తన కల సాకారమైన విధానాలను, అలా సాకారమయ్యేందుకు అతనికి సహాయ సహకారాలందించిన అందరి భావాలను మనకందిస్తూ, జీవితంలో ఆయన నేర్చుకున్న పాఠాలు (అలా అని ఇది ఆయన స్వీయ చరిత్ర కాదు) అందరిలో స్ఫూర్తిని నింపేందుకు, అందరూ విజేతలు కావాలనే ఆకాంక్షతో అందించిన చిన్న పుస్తకమే "ఆకాశానికి నిచ్చెనలు" , దీనికి ఆంగ్ల మాతృక ఆయన "దేశీ డ్రీం మర్చెంట్స్" (Desi Dream Merchants), అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో..


ముద్ర కమ్మునికేషన్స్ ఫౌండర్ ఛైర్మన్ ఎ.జి.కృష్ణ మూర్తి గారు అతి తక్కువ పెట్టుబడితో, ఒకే ఒక్క క్లైంట్తో అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ప్రారంభించారు. కేవలం తొమ్మిదేళలలో ముద్ర భారతదేశంలో అతి పెద్ద అడ్వర్టైజింగ్ ఏజన్సీ లలో ప్రథమ స్థానాన్ని చేరుకుంది. ఈ పుస్తకంలో ముద్ర గురించి కూడా మనం తెలుసుకుంటాం. కలలు కంటే సరిపోదు. ఆ కలను సాకారం చేసుకోవడానికి ఎలా ప్రయత్నించాలి, ఏ విధంగా పయనించాలి, ఏదైనా ఒక పనిని సాధించడానికి ఎలా కృషి చేయాలి మొదలైన విషయాలను ముద్ర టీం వాళ్ళు అంటే అంతటి గొప్ప సంస్థలో ఉద్యోగం చేసిన వారు, తద్వారా వారి కలలను సాకారం చేసుకున్న వాళ్ళు చాలా చక్కగా వివరించారు. ముద్ర గొప్పతనం చెప్తూనే, అందుకు వాళ్ళు పడ్డ శ్రమను కూడా తెలియజేసారు. యాడ్ ఏజెన్సి అంటే మృదువుగా, నాజూకుగా మాట్లాడటం, స్టైల్గా అటూ, ఇటూ తిరగడం, వేరే వాళ్ళు కష్టపడి దంచుతుంటే ఇంకెవరో భుజాలెగరేయడమన్నది కేవలం అపోహేనని, ఏసీ రూముల్లో, ఈజీ చైర్లో కూర్చుని చేసే పని కాదని, అసలు యాడ్ ఏజెన్సీ అంటే ఏంటో తెలియజెప్పిందీ పుస్తకం. అలాగే జీవితంలో విజయాలను సొంతం చేసుకునేందుకు కావల్సినంత ఉత్సాహం, ఊరడింపునిస్తుంది.


ముందుగా ఏ పనైనా చేయాలంటే వ్యక్తులు సరైన వాళ్ళై ఉండాలి, సవాళ్ళని ఎదుర్కోవాలి, ప్రతీ నిమిషం కొత్తగా శ్వాసించాలనే ఉత్సాహం వారికుండాలి. ఇలాంటి వ్యక్తులే ముద్రలో పని చేసారు, ముద్రకు అంకితమయ్యారు, ముద్ర మనుషులయ్యారు. "తిక్కల్లేని ప్రతిభ, పొగరులేని ప్రావీణ్యం" అన్న ముద్ర ఫిలాసఫి మనమూ ఫాలో అయితే మనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకోవచ్చు కదా. అవసరం కొత్త దారిని చూపిస్తుంది. సంస్థ లేదా పని అవసరాన్ని బట్టి, ఏ పని చేసినా గట్టి నమ్మకంతో ముందుకెళ్తే, అవసరం వచ్చిన వెంటనే ఓ ప్లాన్‌తో సిద్ధంగా ఉంటూ, ఆలస్యం చేయకుండా ఆచరణలో పెడుతుంటే మొదట కొన్ని ఒడిదుడుకులెదురైనా పని మాత్రం తప్పక పూర్తవుతుందని, ఎంతో హాయిని కలిగిస్తుందని 'ముద్ర పధ్ధతి" ద్వారా మళ్ళీ ౠజువైంది. అవసరం మంచి ఆలోచనలను కూడా రేకెత్తిస్తుంది. అందుకే ఆ దిశగా అందరూ ఆలోచించినట్లైతే ఇంకా ఎన్నో విజయాలు సాధించవచ్చు. కొత్త పుంతలు తొక్కడానికి నగర నేపథ్యం అవసరం లేదు, మేథావులుగా చలామణీ కానక్కర్లేదు, టక్కు టమారా విద్యలు ప్రదర్శించి, ప్రసంశలు పొందక్కర్లేదు. సూటిగా చెప్పాలంటే- విభిన్న్నంగా ఆలోచించడం మొదలుపెడితే, నీ గమ్యాన్ని నీవే నిర్దేశించుకుంటావు, నీకెవరూ కొమ్ములు తిరిగిన మేథావులు చెప్పనవసరం లేదని ముద్ర నమ్మకం, నాకూ నమ్మకమే. సాధారణంగా అందరూ నిజాలు వినడానికి ఇష్టపడతారు కానీ వాళ్ళు చిన్నబుచ్చుకునే విషయాల్ని చెప్పినప్పుడు మాత్రం అసహ్యించుకుంటారు. సంస్కృతంలో ఓ నానుడిలా, నిజం చెప్పాలి, ఇష్టమైన మాట చెప్పాలి, ఇష్టం లేనిది నిజమైనా చెప్పకూడదు. అలాగే అబద్ధం, ఇష్టమైనదైనా చెప్పకూడదు. అందుకే ఆ సంస్థలో ఉద్యోగులు నిజమే చెబుతూ, నిజాయితీగా ఉంటూ, ఎంతో కృషి చేస్తూ, ప్రతిభా పాఠవాలను ప్రదర్శించిన ఫలితంగా రెండు బ్రాండ్లు సాధించిన విజయాల్ని యావత్ అడ్వర్టైజింగ్ పరిశ్రమ గుర్తించింది. మనకూ తెలుసు అవేంటో, మొదటిది విమల్, రెండో బ్రాండ్ రస్న - దేశాన్ని ఓ ఊపు ఊపేశాయి. కసి, పట్టుదల, సాధించాలనే తపన, కృత నిశ్చయాలతో ముందుకు వెళితే విజయం ఎవరికైనా తథ్యమని తెలుసుకోవచ్చు. కానీ, పెరుగుతున్న కొద్దీ విజయానికి కారణమైన అంశాల్ని మర్చిపోకూడదు.



ఇక చాలా మంది హోదా, జీతం, ఆఫీసు సౌకర్యాలు ... మొదలైన వాటితో తృప్తిపడిపోతారు. బలిసిన పిల్లి ఎలాగైతే కదలడానికి తెగ కష్టపడిపోతుందో, వీళ్ళు కూడా అంతే. ఉన్న దాంతో తృప్తి పడిపోతారు. మనలోగానీ, మన సంస్థలో లేదా పనిలో గానీ ఎప్పుడైతే ఎదుగుదల ఆగిపోయిందో మనకు గడ్డు రోజులు వచ్చినట్టే, క్షీణ దశ ఆరంవ్భమైనట్టే!! భవిష్యత్తు మన చేతుల్లో ఉంది, మనం ఎలా కావాలనుకుంటే, దాన్ని అలా రూపొందించుకోవచ్చు. మనం వేగంగా, పెద్దగా అభివృద్ధి చెందాలి. ఏ రంగంలోనైనా, నిలదొక్కుకోవాలంటే పైకి సులువుగా ఎగరగలం. భారం ఎక్కువైన కొద్దీ, మరో కక్ష్యలోకి వెళ్ళాలంటే అధిక శక్తి అవసరం. ఫోర్లు, సిక్స్లు కొడితేనే మరో ఓవర్ ఆడే అవకాశం కలుగుతుందన్న ఎజికెగారి మాటలు ఆ ఆర్గనైజేషన్ బిహేవియర్ అండ్ డెవలప్మెంట్ వృత్తి నిపుణులైన డాక్టర్ నాగానంద్కే కాదు, అందరికీ కర్తవ్య బోధ చేస్తాయి. ఏదైనా లక్ష్యాన్ని చేరుకోవాలనుకోవాలి. ఆ లక్ష్యం చంద్రుడనుకుంటే, మనం చంద్రుణ్ని చేరుకోవచ్చు లేదా చేరలేకపోవచ్చు, కనీసం చెట్టు చివరిదాకా వెళ్ళినా మంచిదే. అందుకే ముందుగా పనిని ప్రారంభించాలి. ఓ చోట స్థిరంగా ఉన్న లక్ష్యాన్ని ఎవరైనా చేధించగలరు. కదులుతున్న మత్స్య యంత్రంలాంటి లక్ష్యాన్ని కొట్టాలంటే, అది అర్జునుల వల్లే సాధ్యం! మనం అర్జునులం కావాలి. మనం చేసే ప్రయత్నంల విఫలం కాకూడదనుకుంటూ ముందుకు సాగాలి.


ముద్ర సంస్థకు ప్రత్యేక ఆభరణాలైన ఆ పద్ధతి, పనితీరు, ఆ తపన మొత్తంగా ముద్ర ఫిలాసఫీ విలక్ష్ణమైంది. అది అందరినీ కలిసికట్టుగా, ఓ జట్టుగా ఉంచుతుంది. అలాగే 'ఇది మనదీ అనుకునేట్టు చేస్తుంది. ఈ ఫిలాసఫి పుస్తకాల్లో ఉండదు. ఎగిరి అందుకుందామంటే ఎక్కడా కనబడదు. కన్న కలను సాకారం చేసుకోవాలంటే అందుకు తగ్గట్టుగా కష్ట పడాలి. అందరికంటే "కొంచెం ఎక్కువ"గా. ఆ "కొంచెం ఎక్కువ" పని చేసి, ఎంతో మంది హీరోలయ్యారు., ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు. "ఎవరూ గొప్పవాళ్లుగా పుట్టరు", అనే విషయాన్ని ఎప్పుడూ గుర్తు చేసుకుంటూండాలి. అలాగే అద్భుతాల్ని ఎవరైనా సాధించొచ్చు, అందరూ సాధించొచ్చు. కేవలం నాలుగు లక్షణాలు - ప్రతిభా పాఠవాలు, సాధించాలనే కోరిక, పని మీద వ్యామోహం, నిజాయితీ లు. ఇందులో ఏ ఒక్క లక్షణం లేకపోయినా విజయం సాధించడం కష్టమని వేరే తెలుసుకోనవసరం లేదు. అలా ఎదిగే దశలో కిందపడినా మామూలు వారైతే నవ్వుతారు, పట్టించుకోకుండా వెళ్ళి పోతారు కానీ ముద్ర మనుషులు మాత్రం అలా నవ్వరు, లోపల్లోపల కూడా ఎవరూ సంతోషించరు. అయ్యో! ఇలా జరిగిందా అని సానుభూతితో ఓ మాటనేసి ఎవరూ వెళ్ళిపోరు, కిందపడితే లేపి, ముందుకు నడిపించడానికి వంద చేతులు సిద్ధంగా ఉంటాయి. భారతీయ కుటుంబ వాతావరణంలో ఎవరైనా విఫలమైనపుడు అవమానించడం ఉండదు. అలాగే వారి ఆశయాన్ని అనుమానించడముండదు. అన్నిటికీ మించి, అందర్ని ముందుకు నడిపించడానికి, అవసరమైనపుడు సహాయమందించడానికి కుటుంబ పెద్ద ఉండనే ఉంటారు. అయితే ఈ మధ్య కొంత మంది భారతీయ సంస్కృతిని ఆకళింపు చేసుకోలేకపోవడం వళ్ళ అలా నవ్వుతున్నారు, పట్టించుకోకుండా ఉంటున్నారు కానీ నిజానికి భారతీయ సంస్కృతిలో అవమానించడమనేది ఉండదు. అందుకే భారతీయ సంస్కృతికి అంత గొప్ప పేరు. ప్రతిభా ప్రావీణ్యాలను గుర్తించడానికి పై పై మెరుగుల హడావిడి అవసరం లేదని, మనదైన పద్ధతిలో ముందుకు వెళ్ళొచ్చని, తాను నమ్మిన ఆశయాలతో ప్రచారం చేయొచ్చని, ప్రభావం కలిగించ్చొచ్చని, ఆలోచన మంచిదైనప్పుడు, అది వస్తువైనా, ప్రదేశమైనా, మనిషైనా, విజయం తప్పక లభిస్తుందని ముద్ర ద్వారా, ఈ పుస్తకం ద్వారా తెలియవస్తుంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా పని సాఫీగా జరిగిపోవాలి. పని జరిగి తీరాలి, ఎలాగైనా సరే, ఎప్పుడైనా సరీ, అదే కదా వర్క్ కల్చర్.



ఇక ఈ పుస్తకం రెండవ భాగం ఎజికె గారు నేర్చుకున్న పాఠాలు. ఆయన వాటిని తన వ్యాసాలుగా బిజినెస్ స్టాండర్డ్ పత్రికలో "ఎజికె స్పీక్" కాలంలో కూడా ప్రచురింపజేసరు. సెప్టెంబర్ 3,2004 నుండి ఆగష్టు 19, 2005 వరకు 15 రోజులకొకసారి ప్రచురితమైన, పేరొందిన వ్యాసాలు. మొదటిగా ఆయన నేర్చుకున్నది,మనకు తెలియజేసింది పని,పని,పని. ఈ రోజుల్లో చాలా మంది యజమానులు, తమ ఉద్యోగులు రోజంతా కష్టపడిపోవాలనే కోరుకుంటారు. అలా లేనప్పుడు తెగ బాధ పడిపోతుంటారు, అంతేకాక, వళ్ళ కోసం కొత్త కొత్తగా ఏవో సృష్టిస్తుంటారు. అయితే చేయాల్సిందది కాదని, ఇలాంటి విషయాలను కొంచెం తేలిగ్గా తీసుకుంటూ, వారిని కొంచెం విశ్రాంతి తీసుకోనిస్తూ, కోపం తెచ్చుకోకుండా ఉంటే, వాళ్ళు రిలాక్సయ్యాక, తిరిగి ఎంత ఉత్సాహంగా పనిని ప్రారంభిస్తారో చూస్తే ఎటువంటి సంస్యలుండవంటూ ఉదహరణలతో చెప్పారు.



గురుశిష్య పరంపర అలా సాగిపోవాలంటారయన. దానిక్కారణం ఓ సంస్థ నిలదొక్కుకోవాలంటే ఒకరి నుంచి ఒకరు అందిపుచ్చుకోవడమనే ప్రక్రియ నిరంతరంగా జరుగుతుండాలి. ఈ అంది పుచ్చుకోవడం ఏ ఇద్దీరి మధ్యనైనా ఆగిపోకూడదు, అలా సాగిపోవాలి. ప్రతిభా పాఠవాలు, ప్రావీణ్య నైపుణ్యాలను ఒకరి నుంచి ఒకరు అందిపుచ్హ్చుకోవడం ద్వారానే సృజనాత్మక ప్రక్రియ జీవిస్తుంది, అభ్వృద్ధిని సాధిస్తుంది, అన్నింటిని మించి విజయ పథాన పయనిస్తుంది. ఇది ఏ రంగానికైనా వర్తిస్తుంది. ముందు తరం వదిలివెళ్ళిన పనిని కొనసాగించాలి. అయితే సొంతంగా విజయాలు సాధించగలమనే విషయాన్ని నిరూపించాలని కొత్త తరాల్ వారు భావిస్తుంటారు.గురుశిష్య పరమపర అలా సాగిపోవాలంటారయన. దానిక్కారణం ఓ సంస్థ నిలదొక్కుకోవాలంటే ఒకరి నుంచి ఒకరు అందిపుచ్చుకోవడమనే ప్రక్రియ నిరంతరంగా జరుగుతుండాలి. ఈ అంది పుచ్చుకోవడం ఏ ఇద్దీరి మధ్యనైనా ఆగిపోకూడదు, అలా సాగిపోవాలి. ప్రతిభా పాఠవాలు, ప్రావీణ్య నైపుణ్యాలను ఒకరి నుంచి ఒకరు అందిపుచ్హ్చుకోవడం ద్వారానే సృజనాత్మక ప్రక్రియ జీవిస్తుంది, అభ్వృద్ధిని సాధిస్తుంది, అన్నింటిని మించి విజయ పథాన పయనిస్తుంది. ఇది ఏ రంగానికైనా వర్తిస్తుంది. ముందు తరం వదిలివెళ్ళిన పనిని కొనసాగించాలి. అయితే సొంతంగా విజయాలు సాధించగలమనే విషయాన్ని నిరూపించాలని కొత్త తరాల్ వారు భావిస్తుంటారు.గురుశిష్య పరమపర అలా సాగిపోవాలంటారయన. దానిక్కారణం ఓ సంస్థ నిలదొక్కుకోవాలంటే ఒకరి నుంచి ఒకరు అందిపుచ్చుకోవడమనే ప్రక్రియ నిరంతరంగా జరుగుతుండాలి. ఈ అంది పుచ్చుకోవడం ఏ ఇద్దీరి మధ్యనైనా ఆగిపోకూడదు, అలా సాగిపోవాలి. ప్రతిభా పాఠవాలు, ప్రావీణ్య నైపుణ్యాలను ఒకరి నుంచి ఒకరు అందిపుచ్హ్చుకోవడం ద్వారానే సృజనాత్మక ప్రక్రియ జీవిస్తుంది, అభ్వృద్ధిని సాధిస్తుంది, అన్నింటిని మించి విజయ పథాన పయనిస్తుంది. ఇది ఏ రంగానికైనా వర్తిస్తుంది. ముందు తరం వదిలివెళ్ళిన పనిని కొనసాగించాలి. అయితే సొంతంగా విజయాలు సాధించగలమనే విషయాన్ని నిరూపించాలని కొత్త తరాల్ వారు భావిస్తుంటారు.గురుశిష్య పరమపర అలా సాగిపోవాలంటారయన. దానిక్కారణం ఓ సంస్థ నిలదొక్కుకోవాలంటే ఒకరి నుంచి ఒకరు అందిపుచ్చుకోవడమనే ప్రక్రియ నిరంతరంగా జరుగుతుండాలి. ఈ అంది పుచ్చుకోవడం ఏ ఇద్దీరి మధ్యనైనా ఆగిపోకూడదు, అలా సాగిపోవాలి. ప్రతిభా పాఠవాలు, ప్రావీణ్య నైపుణ్యాలను ఒకరి నుంచి ఒకరు అందిపుచ్హ్చుకోవడం ద్వారానే సృజనాత్మక ప్రక్రియ జీవిస్తుంది, అభ్వృద్ధిని సాధిస్తుంది, అన్నింటిని మించి విజయ పథాన పయనిస్తుంది. ఇది ఏ రంగానికైనా వర్తిస్తుంది. ముందు తరం వదిలివెళ్ళిన పనిని కొనసాగించాలి. అయితే సొంతంగా విజయాలు సాధించగలమనే విషయాన్ని నిరూపించాలని కొత్త తరాల్ వారు భావిస్తుంటారు.గురుశిష్య పరమపర అలా సాగిపోవాలంటారయన. దానిక్కారణం ఓ సంస్థ నిలదొక్కుకోవాలంటే ఒకరి నుంచి ఒకరు అందిపుచ్చుకోవడమనే ప్రక్రియ నిరంతరంగా జరుగుతుండాలి. ఈ అంది పుచ్చుకోవడం ఏ ఇద్దీరి మధ్యనైనా ఆగిపోకూడదు, అలా సాగిపోవాలి. ప్రతిభా పాఠవాలు, ప్రావీణ్య నైపుణ్యాలను ఒకరి నుంచి ఒకరు అందిపుచ్హ్చుకోవడం ద్వారానే సృజనాత్మక ప్రక్రియ జీవిస్తుంది, అభ్వృద్ధిని సాధిస్తుంది, అన్నింటిని మించి విజయ పథాన పయనిస్తుంది. ఇది ఏ రంగానికైనా వర్తిస్తుంది. ముందు తరం వదిలివెళ్ళిన పనిని కొనసాగించాలి. అయితే సొంతంగా విజయాలు సాధించగలమనే విషయాన్ని నిరూపించాలని కొత్త తరాల్ వారు భావిస్తుంటారు.అందుకు, వంశ పారంపర్యంగా వస్తున్న వ్యాపారాలను, వృత్తులను విస్మరిస్తుంటారు కనుక ఎంత కష్ట పడినా, గొప్ప గొప్ప సంస్థల్ని నిర్మించలేకపోతున్నారు. టాటాలు, బిర్లాలు, అంబానీలు లా అనుకోకపోవడం వల్ల వారికి ఎంత అభివృద్ధి కలిగిందో మనకు తెలుసు కదా. అలా చేసినంత మాత్రాన చేసిన పనినే మళ్లీ చేసినట్టు కాదు. కొత్త తరం ఎప్పుడూ కొత్త డ్ర్ష్టితోనే చూస్తుంది. డాంతో కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి. ఇదో సృజనాత్మక ప్రపంచం!! అందులో మనం భాగస్వాములం. ఓ కొత్త ఆలోచనతో ప్రయోగం చేయడం కన్నా ఉన్న ఆలోచనను ముందుకు తీసుకెళటం ఎన్నొ రెట్లు మంచిది. కొత్త తరాలు వస్తుంటే, ఉన్న అలోచనలు కూడా కొత్త రూపాల్ని సంతరించుకుంటునే ఉంటాయంటే ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి కదూ!అందుకు, వంశ పారంపర్యంగా వస్తున్న వ్యాపారాలను, వృత్తులను విస్మరిస్తుంటారు కనుక ఎంత కష్ట పడినా, గొప్ప గొప్ప సంస్థల్ని నిర్మించలేకపోతున్నారు. టాటాలు, బిర్లాలు, అంబానీలు లా అనుకోకపోవడం వల్ల వారికి ఎంత అభివృద్ధి కలిగిందో మనకు తెలుసు కదా. అలా చేసినంత మాత్రాన చేసిన పనినే మళ్లీ చేసినట్టు కాదు. కొత్త తరం ఎప్పుడూ కొత్త డ్ర్ష్టితోనే చూస్తుంది. డాంతో కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి. ఇదో సృజనాత్మక ప్రపంచం!! అందులో మనం భాగస్వాములం. ఓ కొత్త ఆలోచనతో ప్రయోగం చేయడం కన్నా ఉన్న ఆలోచనను ముందుకు తీసుకెళటం ఎన్నొ రెట్లు మంచిది. కొత్త తరాలు వస్తుంటే, ఉన్న అలోచనలు కూడా కొత్త రూపాల్ని సంతరించుకుంటునే ఉంటాయంటే ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి కదూ!అందుకు, వంశ పారంపర్యంగా వస్తున్న వ్యాపారాలను, వృత్తులను విస్మరిస్తుంటారు కనుక ఎంత కష్ట పడినా, గొప్ప గొప్ప సంస్థల్ని నిర్మించలేకపోతున్నారు. టాటాలు, బిర్లాలు, అంబానీలు లా అనుకోకపోవడం వల్ల వారికి ఎంత అభివృద్ధి కలిగిందో మనకు తెలుసు కదా. అలా చేసినంత మాత్రాన చేసిన పనినే మళ్లీ చేసినట్టు కాదు. కొత్త తరం ఎప్పుడూ కొత్త డ్ర్ష్టితోనే చూస్తుంది. డాంతో కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి. ఇదో సృజనాత్మక ప్రపంచం!! అందులో మనం భాగస్వాములం. ఓ కొత్త ఆలోచనతో ప్రయోగం చేయడం కన్నా ఉన్న ఆలోచనను ముందుకు తీసుకెళటం ఎన్నొ రెట్లు మంచిది. కొత్త తరాలు వస్తుంటే, ఉన్న అలోచనలు కూడా కొత్త రూపాల్ని సంతరించుకుంటునే ఉంటాయంటే ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి కదూ!అందుకు, వంశ పారంపర్యంగా వస్తున్న వ్యాపారాలను, వృత్తులను విస్మరిస్తుంటారు కనుక ఎంత కష్ట పడినా, గొప్ప గొప్ప సంస్థల్ని నిర్మించలేకపోతున్నారు. టాటాలు, బిర్లాలు, అంబానీలు లా అనుకోకపోవడం వల్ల వారికి ఎంత అభివృద్ధి కలిగిందో మనకు తెలుసు కదా. అలా చేసినంత మాత్రాన చేసిన పనినే మళ్లీ చేసినట్టు కాదు. కొత్త తరం ఎప్పుడూ కొత్త డ్ర్ష్టితోనే చూస్తుంది. డాంతో కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి. ఇదో సృజనాత్మక ప్రపంచం!! అందులో మనం భాగస్వాములం. ఓ కొత్త ఆలోచనతో ప్రయోగం చేయడం కన్నా ఉన్న ఆలోచనను ముందుకు తీసుకెళటం ఎన్నొ రెట్లు మంచిది. కొత్త తరాలు వస్తుంటే, ఉన్న అలోచనలు కూడా కొత్త రూపాల్ని సంతరించుకుంటునే ఉంటాయంటే ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి కదూ!అందుకు, వంశ పారంపర్యంగా వస్తున్న వ్యాపారాలను, వృత్తులను విస్మరిస్తుంటారు కనుక ఎంత కష్ట పడినా, గొప్ప గొప్ప సంస్థల్ని నిర్మించలేకపోతున్నారు. టాటాలు, బిర్లాలు, అంబానీలు లా అనుకోకపోవడం వల్ల వారికి ఎంత అభివృద్ధి కలిగిందో మనకు తెలుసు కదా. అలా చేసినంత మాత్రాన చేసిన పనినే మళ్లీ చేసినట్టు కాదు. కొత్త తరం ఎప్పుడూ కొత్త డ్ర్ష్టితోనే చూస్తుంది. డాంతో కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి. ఇదో సృజనాత్మక ప్రపంచం!! అందులో మనం భాగస్వాములం. ఓ కొత్త ఆలోచనతో ప్రయోగం చేయడం కన్నా ఉన్న ఆలోచనను ముందుకు తీసుకెళటం ఎన్నొ రెట్లు మంచిది. కొత్త తరాలు వస్తుంటే, ఉన్న అలోచనలు కూడా కొత్త రూపాల్ని సంతరించుకుంటునే ఉంటాయంటే ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి కదూ!అందుకు, వంశ పారంపర్యంగా వస్తున్న వ్యాపారాలను, వృత్తులను విస్మరిస్తుంటారు కనుక ఎంత కష్ట పడినా, గొప్ప గొప్ప సంస్థల్ని నిర్మించలేకపోతున్నారు. టాటాలు, బిర్లాలు, అంబానీలు లా అనుకోకపోవడం వల్ల వారికి ఎంత అభివృద్ధి కలిగిందో మనకు తెలుసు కదా. అలా చేసినంత మాత్రాన చేసిన పనినే మళ్లీ చేసినట్టు కాదు. కొత్త తరం ఎప్పుడూ కొత్త డ్ర్ష్టితోనే చూస్తుంది. డాంతో కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి. ఇదో సృజనాత్మక ప్రపంచం!! అందులో మనం భాగస్వాములం. ఓ కొత్త ఆలోచనతో ప్రయోగం చేయడం కన్నా ఉన్న ఆలోచనను ముందుకు తీసుకెళటం ఎన్నొ రెట్లు మంచిది. కొత్త తరాలు వస్తుంటే, ఉన్న అలోచనలు కూడా కొత్త రూపాల్ని సంతరించుకుంటునే ఉంటాయంటే ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి కదూ!అందుకు, వంశ పారంపర్యంగా వస్తున్న వ్యాపారాలను, వృత్తులను విస్మరిస్తుంటారు కనుక ఎంత కష్ట పడినా, గొప్ప గొప్ప సంస్థల్ని నిర్మించలేకపోతున్నారు. టాటాలు, బిర్లాలు, అంబానీలు లా అనుకోకపోవడం వల్ల వారికి ఎంత అభివృద్ధి కలిగిందో మనకు తెలుసు కదా. అలా చేసినంత మాత్రాన చేసిన పనినే మళ్లీ చేసినట్టు కాదు. కొత్త తరం ఎప్పుడూ కొత్త డ్ర్ష్టితోనే చూస్తుంది. డాంతో కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి. ఇదో సృజనాత్మక ప్రపంచం!! అందులో మనం భాగస్వాములం. ఓ కొత్త ఆలోచనతో ప్రయోగం చేయడం కన్నా ఉన్న ఆలోచనను ముందుకు తీసుకెళటం ఎన్నొ రెట్లు మంచిది. కొత్త తరాలు వస్తుంటే, ఉన్న అలోచనలు కూడా కొత్త రూపాల్ని సంతరించుకుంటునే ఉంటాయంటే ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి కదూ!అందుకు, వంశ పారంపర్యంగా వస్తున్న వ్యాపారాలను, వృత్తులను విస్మరిస్తుంటారు కనుక ఎంత కష్ట పడినా, గొప్ప గొప్ప సంస్థల్ని నిర్మించలేకపోతున్నారు. టాటాలు, బిర్లాలు, అంబానీలు లా అనుకోకపోవడం వల్ల వారికి ఎంత అభివృద్ధి కలిగిందో మనకు తెలుసు కదా. అలా చేసినంత మాత్రాన చేసిన పనినే మళ్లీ చేసినట్టు కాదు. కొత్త తరం ఎప్పుడూ కొత్త డ్ర్ష్టితోనే చూస్తుంది. డాంతో కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి. ఇదో సృజనాత్మక ప్రపంచం!! అందులో మనం భాగస్వాములం. ఓ కొత్త ఆలోచనతో ప్రయోగం చేయడం కన్నా ఉన్న ఆలోచనను ముందుకు తీసుకెళటం ఎన్నొ రెట్లు మంచిది. కొత్త తరాలు వస్తుంటే, ఉన్న అలోచనలు కూడా కొత్త రూపాల్ని సంతరించుకుంటునే ఉంటాయంటే ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి కదూ!అందుకు, వంశ పారంపర్యంగా వస్తున్న వ్యాపారాలను, వృత్తులను విస్మరిస్తుంటారు కనుక ఎంత కష్ట పడినా, గొప్ప గొప్ప సంస్థల్ని నిర్మించలేకపోతున్నారు. టాటాలు, బిర్లాలు, అంబానీలు లా అనుకోకపోవడం వల్ల వారికి ఎంత అభివృద్ధి కలిగిందో మనకు తెలుసు కదా. అలా చేసినంత మాత్రాన చేసిన పనినే మళ్లీ చేసినట్టు కాదు. కొత్త తరం ఎప్పుడూ కొత్త డ్ర్ష్టితోనే చూస్తుంది. డాంతో కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి. ఇదో సృజనాత్మక ప్రపంచం!! అందులో మనం భాగస్వాములం. ఓ కొత్త ఆలోచనతో ప్రయోగం చేయడం కన్నా ఉన్న ఆలోచనను ముందుకు తీసుకెళటం ఎన్నొ రెట్లు మంచిది. కొత్త తరాలు వస్తుంటే, ఉన్న అలోచనలు కూడా కొత్త రూపాల్ని సంతరించుకుంటునే ఉంటాయంటే ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి కదూ!అందుకు, వంశ పారంపర్యంగా వస్తున్న వ్యాపారాలను, వృత్తులను విస్మరిస్తుంటారు కనుక ఎంత కష్ట పడినా, గొప్ప గొప్ప సంస్థల్ని నిర్మించలేకపోతున్నారు. టాటాలు, బిర్లాలు, అంబానీలు లా అనుకోకపోవడం వల్ల వారికి ఎంత అభివృద్ధి కలిగిందో మనకు తెలుసు కదా. అలా చేసినంత మాత్రాన చేసిన పనినే మళ్లీ చేసినట్టు కాదు. కొత్త తరం ఎప్పుడూ కొత్త డ్ర్ష్టితోనే చూస్తుంది. డాంతో కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి. ఇదో సృజనాత్మక ప్రపంచం!! అందులో మనం భాగస్వాములం. ఓ కొత్త ఆలోచనతో ప్రయోగం చేయడం కన్నా ఉన్న ఆలోచనను ముందుకు తీసుకెళటం ఎన్నొ రెట్లు మంచిది. కొత్త తరాలు వస్తుంటే, ఉన్న అలోచనలు కూడా కొత్త రూపాల్ని సంతరించుకుంటునే ఉంటాయంటే ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి కదూ!

మనుషులు గుంపులుగా, సమూహాలుగా ఉన్నప్పుడు వాళ్లల్లో బాధ్యతాయుతమైన ప్రవృత్తి పలచబడిపోతుందట! ఎవరో ఒకరు చూస్తారులే, ఏదో చేస్తారులే అనే భావం పెరిగిపోయి, అందరూ అలా అనుకుంటూ, ఎవరూ ఏమీ చేయరు. ఫలితం శూన్యం. నిజానికి ఇదో పెద్ద సమస్య కాదు. స్పష్టమైన నాయకత్వం లేకపోతే ఏదైనా సరే బాధ్యతను తన దగ్గర్నుంచి వేరే వ్యక్తి నెత్తి మీదకు నెట్టేద్దామనే అనుకుంటారు. కనుక, నాయకుడు పటిష్టంగా ఉండాలంటారు. మంచి నాయకుడ్ని ఎంపిక చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది.అందుకు ముఖ్యంగా ఉండాల్సింది నూటికి నూరు శాతం నమ్మకం. చూడనిదాన్ని నమ్మటం విశ్వాసం. ఆ విశ్వాసానికి ప్రతిఫలం నమ్మినదాన్ని చూడటం. ఏదైనా సాధించవచ్చని కొందరు ఆత్మవిశ్వాసంతో, అపార నమ్మకంతో చెప్పే మాటలు ఒక్కోసారి అర్థం లేనివిగా అనిపించినా, నమ్మకమనేది నూరు శాతం ఉంటే తప్పకుండా విజయం వరిస్తుంది. ఇది కేవలం ఒక్క వ్యాపారానికో, పనికో వర్తించింది కాదు, నిత్య జీవన విధాన వ్యవహారాలకూ వర్తిస్తుంది. పూర్తి విశ్వాసంతో చేసిన కొన్ని ప్రయోగాలు సంచలనాలు సృష్టించాయి కదా. క్లుప్తంగా ఎజికె గారి మాటల్లో చెప్పాలంటే, మనం నమ్మేదాన్ని బట్టే వాస్తవం ఉంటుంది. అదీ ఎప్పుడంటే నూటికి నూరు శాతం మన నమ్మకం ఉన్నప్పుడు. జీవితంలో ప్రతీ పనికీ ఓ సమయం ఉంటుంది. అదెప్పుడు వస్తుందో, ఎవరికి వారికే తెలుస్తుంది. దేనివల్ల మనకు హాని కలుగ్గుతుంది, దేనివల్ల మనకు లాభం చేకూరుతుంది, ఈ విషయాలు తెలుసుకుంటే జీవితంలో దీర్ఘకాళిక ప్రయోజనాలు పొందవచ్చు. నాలుగు రోడ్ల జంక్షన్లో ఉన్నప్పుడు ఏ రోడ్డులో వెళ్తే మంచిదన్న సంగతి ఎలా తెలుస్తుంది? అదే నేర్చుకోవాలి. ఉద్యోగం ఎంపిక చేసుకునేటప్పుడు, ఏ రంగం మనకు సరైనదో నిర్ణయించి, ఆ తరువాత సంస్థను ఎంచుకోవాలి. సంస్థలు కూడా వ్యక్తుల వంటివే. అందుకే మన మనస్తత్వానికి, పనితీరుకు సరిపోయే సంస్థను ఎన్నుకోవాలి. తర్వాత బాస్ సంగతి... బాస్గా ఉన్న వ్యక్తే, కొంతకాలం మనకు ఫ్రెండ్గా, గైడ్గా ఉండాల్సి వస్తుంది. మన భావాలకు వ్యతిరేకంగా ఉండే నాయకుడిని ఎంపిక చేసుకోవద్దంటారు. అయితే ఇవన్నీ ఒకే రోజులో అయిపోయేవి కావు. చాలా సమయం పడుతుంది. సులభంగా కూడా అయ్యేవి కావు. కష్టపడి సాధించాలి. అందుకే ముందుగా మనకేం కావాలో, ఎప్పుడు కావాలో తెలుసుకుంటే, మన మార్గంలో వచ్చే ఆటంకాల్ని ఎదుర్కోగలం, ఇవన్నీ జరిగితే కలల్ని నిజం చేసుకుని ఆనందించగలం. నిజమే కదా మరి. ఎప్పుడూ విజయాలే రావు. ఓటమిని కూడా ఎదుర్కోవలసి వస్తుంది. ఓడిపోవడం కూడా ఒక కళే. జీవితంలో ఎప్పుడూ ఒకరికే విజయాలు రావు, రాకూడదు కూడా అని అంటుంటారు. ఒక్కొకరికీ ఒక్కో సమ్యంలో, సందర్భంలో విజయం దక్కితేనే అందరి జీవితాలకు సార్థకత చేకూరుతుందట. అయితే ఎంత హుందాగా గెలుస్తామో, ఓడిపోయినప్పుడూ అంతే గౌరవంగా, హుందాగా ఉండాలంటారాయన. అది ఎక్కడైనా, రాజకీయాలు, వ్యాపార లేదా ఇతర సొంత విషయాలు కావచ్చు.

చాలా సమయాల్లో మనల్ని ఎవరైనా కాదన్నా, వాళ్ల ద్వారా మనసు గాయపడినా ఒక్కసారిగా మన ఆలోచనా విధానం మారిపోతుంది. దాంతో అర్థం లేని ఆరోపణలు, విమర్శలు చేసేస్తాం. అలా కాక సమ్యమనంతో వ్యవహరించి, పరిస్థితిని చక్కదిద్దితే అన్ని సంస్యలూ పరిష్కారమౌతాయి. మనల్ని పరిశీలించేవాళ్లు మనం ఓడిపోయినప్పుడైనా, గెలిచినప్పుడైనా ఒకేలా చూస్తారు, మనం సమ్యమనంతో ఉంటే. అలా కాక, ఓడిపోయామని ఎదుటివాళ్లని ధూషిస్తే సంబంధ బాంధవ్యాలు కూడా తెగిపోతాయి. తిరిగి ఏర్పరచుకోవడం చాలా కష్టం. తప్పులు సరిదిద్దుకుంటే మరో మెట్టు పైకెళ్ళవచ్చని ముద్రలో జరిగిన తన అనుభవాలను చెప్పారు కృష్ణమూర్తి గారు. ఇలా మనం సాగిస్తున్న జీవితంలో మనం నమ్మిన వారు నమ్మక ద్రోహులు కావచ్చు . మనల్ని మోసం చేయొచ్చు. అలా అని వారిని ముందుగా కనిపెట్టలేం, ఇలాంటి కుట్రలు, కుతంత్రాల మధ్యే మనం మనుగడ సాగించాలి. అలాగని "ఎవరినీ నమ్మకూడదు" అని అనుకోలేం. వీరిలో నమ్మకస్తులుంటారు. నిజానికి నమ్మకం, అనుబంధం లేకపోతే మనం జీవితంలో ముందుకెళ్ళలేం. నమ్మకాన్ని వమ్ము చేసేవాళ్ళు ఎంతమంది తారసపడినా, నమ్మకస్తుల సంఖ్యను పెంచుకుంటూపోవడమే తెలివైన పనంటారు ఎజికె, తాను నమ్మిన వాళ్ళు మోసం చేసిన అనుభవాలతో. మన విజయానికి ముఖ్య సూత్రం "పనే పరమావధి". ధైర్యం చేసి ఏ పనైనా చేయాలి. మనకెందుకులే అని కాకుండా, అది మన పని కాకపోయినా, చేయవల్సిన అవకాశం, సందర్భం వస్తే తప్పకుండా చేయాలి. ముందు తరాల వారిని సరైన దిశలో నడిపించాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఏ బాటలో నడిస్తే - భవిష్యత్ తరాల వారు కూడా అదే మార్గంలో పయనిస్తారు, దీని కోసం ప్రత్యేకించి కష్టపడనక్కర్లేదు, ముందు పని చేయాలి, జస్ట్ డు ఇట్ అన్న మాటలు నిజంగా స్ఫూర్తిదాయకం.
ఎజికె గారు సాధించిన విజయాల వెనుక మూడు సూత్రాలున్నాయట. మొదటిది వ్యక్తిత్వానికి అడ్రస్ మనం వేసుకునే డ్రస్. సింపుల్గా ఉండాలిగానీ ద్రస్సింగ్ పట్ల అశ్రద్ధ కనబరచాలి. ఎందుకంటే మనల్ని మనం పూర్తిగా పరిచయం చేసుకునేంత వరకూ మన వ్యక్తిత్వాన్ని తెలిపేది మన డ్రస్సేగా. రెండవది సమయపాలన. ముందుగానైనా ఉండొచ్చుగానీ, ఆలస్యం కాకూడదు. అలా ఆలస్యమైతే కలిగే భావన ఎంతో వేదనకు గురి చేసి, గిల్టీ ఫీలింగ్ కలిగించి, ఆత్మ విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తుంది. ఇక మూడవది మనం రోజూ కార్యకలాపాలు ఒక లిస్ట్ రాసుకుంటే, ఓ రోజు పూర్తయ్యాక, లిస్ట్ చూసుకుంటే, మన జీవితంలో ఒక అమూల్యమైన రోజు ఎలా గడిపామో మనకు తెలుస్తుందంటూ, అలా చేయడం వల్ల ఆయనకు ఎన్నో విజయాలు వచ్చాయంటారు. అంతేకాక, వీటిని పాటించడంలో విఫలమైన వారు ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కున్న సందర్భాలున్నాయట. ఇక కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి, ఇగోను పక్కన పెట్టాలి. లేకపోతే తన కోపమే తన శత్రువని మనకందరికీ తెలుసు కదా. ప్రత్యర్థుల్ని గౌరవిస్తూ, అవరోధాల్ని ఎదుర్కొని విజయం దక్కించుకోవాలి. ఒకవేళ ఓడిపోయినా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలి. కెరటం కావాలి మనకు ఆదర్శం, పడినందుకు కాదు, పడినా లేచినందుకు. జీవితం నేర్పిన పాఠాల్ని గుర్తు పెట్టుకుని, అడుగు ముందుకేస్తే, రేపు మనదే, గెలుపు మనదే అన్న ఆయన మాటలను నిజంగా ఒప్పుకోక తప్పదు. ఇక్కడ ఇంకో విషయముంది. మనం ప్రతీదీ శాశ్వతమని అనుకోవడం వల్ల దానిని సకాలంలో చేయం. అశాశ్వతం అనుకున్న రోజున జీవితాన్ని ఆనందమయం చేసుకుంటూ అన్ని పనుల్ని సత్వరం నెరవేర్చాలని అనుకుంటున్నాం. జీవితంలో మనకెదురయ్యేవన్నీ ఒక రకమైన బహుమతులు. వాటిని స్వీకరించాలి, అనుభవించాలి, సంతోషించాలి. మనకు ఎప్పుడు ఎలాంటి అవకాశం వస్తుందో తెలీదు. అందుకే వచ్చిన ఛాన్స్ని సద్వినియోగం చేసుకోకపోతే, అంతకు మించి పెద్ద తప్పు వేరేదీ ఉండదు. నిజమే కదా.

కోరికలు గుర్రాలంటారు, అవి ఒక్కోసారి దెయ్యాలుగా కూడా మారుతుంటాయి. ఎవరైనా కోరికలకు అతీతులు కారు. కోరిక ఓ స్థాయిలో నెరవేరగానే సరిపోదు. ఇంకా పై స్థాయిలో అవి నెరవేరాలని మనం కోరుకుంటాం. సంతృప్తి అనేది లేకపోతే కోరికలు నెరవేరలేదనే ఆవేదన, ఆక్రోశం పెరిగిపోతాయి. కనుక, కోరికల్ని అభివృద్ధి చేసుకోవద్దంటారు, వాటిని అంతం చేయాలంటారు.

సమిష్టి కృషిని గౌరవించే ఈ పుస్తక రచయిత, తన బృందంలో సభ్యుల అభిప్రాయాలకూ ఈ పుస్తకంలో పెద్ద పీట వేశారు. అందరి అంతరంగ భావాల అద్భుత విశ్లేషణలకు ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. జీవిత గమ్యం తెలుసుకుని కలలు కన్న ప్రతీ ఒక్కరం ఆకాశానికి నిచ్చెనలు వేసి, విజేతలమై ఇతరులకూ మార్గదర్శకులం కావచ్చు. అలా కావాలని ఆశిస్తాను.

Monday, December 31, 2007

ఉమెన్

ఈ ప్రపంచంలో మనం మన జీవితంలో ఎన్నో రకాలుగా స్ఫూర్తి పొందుతాం. ప్రక్రుతి నుండి, పక్షుల నుండి, జంతువుల నుండి, ముఖ్యంగా గొప్ప వ్యక్తుల జీవితాల నుండి, అలా కలిగిన స్ఫూర్తి మన జీవితాలనే మార్చేస్తుంది. ఏదో సాధించాలనే తపన పెరుగుతుంది. జీవితాన్ని ఆనందమయం చేస్తుంది. నిజానికి మనం అలా ఆనందంగా, ప్రపంచంలో మనకంటూ ఒక ప్రత్యేకత కలగాలంటే ఖచ్ఛితంగా స్ఫూర్తి కలిగే విషయాలను గమనిస్తూండాలి. అలా నేను గమనించిన, నాకు స్ఫూర్తి కలిగించిన ఒక పుస్తకం డా.కెవిఎస్ మురళీ క్రిష్ణ గారు రాసిన "ఉమెన్ - హు ఇన్స్పైర్డ్ ది వరల్డ్". ఇందులో ఆయన ప్రపంచంలోని వివిధ రంగాలలో విజయం సాధించి, వారికంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుని, ఈ ప్రపంచానికే స్ఫూర్తిని కలిగించే ఎంతో మంది స్త్రీల గురించి తనదైన చక్కని శైలిలో వివరించారు, ప్రపంచ వ్యాప్తంగా ఎందరి నుంచో మంచి మార్కులు కొట్టేసారు. ఇది మహిళల గురించే అయినా అందరూ తప్పక చదవాల్సిన, అందరి డెస్కులో దాచుకోవాల్సిన పుస్తకం మీ కోసం ...

గడచిన కొన్ని శతాబ్దాలుగా, స్త్రీలకు ఎటువంటి హక్కులూ లేవు, చివరికి ఓటు హక్కు కూడా. ప్రపంచంలో మూడొంతుల పని స్త్రీల ద్వారానే జరుగుతుంది కాని వారికి ప్రపంచ సంపదలో ఏడు శాతం కూడా లభించదు. దేవుడు స్త్రీ, పురుషులను సమానంగానే తయారు చేసాడు. కానీ, చాలా మంది స్త్రీలకు తమను తాము నిరూపించుకోవడానికి ఒక్క అవకాశం కూడా కలుగదు. కొంత మంది స్త్రీలు వారి పనుల ద్వారా వారిలో కాంతిని ప్రకాశింపజేస్తారు అంటే కాంతి అంత అద్భుతంగా పనులు చేస్తారు కాని వారు ప్రసరించిన కాంతి వెలుగులోకి రాదు, వెలుగునివ్వదు. అయితే ఇప్పుడు రోజులు మారాయి. వారిప్పుడు అలా లేరు. అన్నింటిలోని ముందే వున్నారు, డ్రైవరు సీటును ఆక్రమించారు. అన్ని రంగాల్లో అంటే తత్వవేత్తలుగా, శాస్త్రవేత్తలుగా,గణిత, సాహిత్య, సాంఘిక,రచన, రాజకీయ, చిత్రలేఖన, సంగీత,కళలు, ఇలా అన్ని రంగాల్లోను ముందుకు దూసుకుపోతున్నారు, ముందు వరుసలో ఉంటున్నారు. ఈ పుస్తకంలో మనం అటువంటి పాత్రలను తమ నిజ జీవితంలో పోషించిన ఎంతో మంది స్త్రీలను చూడగలము. కాని, కొంతమంది అల్ప మానవులు మాత్రం స్త్రీలు దయ, ఓర్పు, సహనం, బాధను భరించే, పతులకు సేవ చేసే, పిల్లలను పెంచే కొన్ని క్వాలిఫికేషనుల కోసమే చదువుతున్నారంటూ, వారిని, వారి చదువుని కూడా అంటూంటారు, ఇంకా ఈ సమాజంలో స్త్రీ పాత్ర ఏమీ లేదు, వారు ఏమీ కాలేరు అంటూ అనడమే కానీ, అలా అంటూ వారేం కోల్పోతున్నారో అర్థం చే సుకోరు.

కనుక, ఇక్కడ పురుష జాతి స్వభావాన్ని మార్చుకోవడమనేది ముఖ్యం కాదు కానీ స్త్రీల పట్ల అనుకూల భావనను కలిగి వుండాలి, వారిలో దాగి ఉన్న ప్రతిభను ఒప్పుకోవాలి. 19వ శతాబ్దంలో, స్త్రీలకు ఎటువంటి అవకాశం ఇవ్వబడలేదు, ఎంతో నీచంగా చూడబడేవారు. కానీ, 21వ శతాబ్దంలో, స్త్రీ పాత్రలో ఎంతో పెరుగుదల, వారు నెమ్మదిగా, నిదానంగా ముందుకు వెళ్ళారు. ఖచ్చితంగా ఈ సమాజంలో వారికంటూ ప్రత్యేక స్థనాన్ని ఏర్పరచుకున్నారు. అలా స్థానాన్ని, విజయాన్ని దక్కించుకున్న కొంత మంది స్త్రీల జీవితాలు నిజంగా ఒక్కరినీ, ఇద్దరినీ కాదు, ఈ మొత్తం ప్రపంచానికే ఆదర్శవంతం, స్ఫూర్తిదాయకం. కొత్త ఆలోచనలను, జీవిత సరళిని మార్చారు కొంత మంది స్త్రీలు, మరి కొంత మంది తత్వవేత్తలు, తిరుగుబాటుదారులుగా, ఇంకొందరు శాస్త్రవేత్తలు, సంఘ సంస్కర్తలు, నాయకులు, పాలకులు, ధైర్య, ధీరశాలురుగా, ఇంకొందరు క్రీడల్లో, రచనల్లో ప్రతిభను చూపితే, మరికొందరు కళలలో,నటనలో, అందంలో కూడా తమ ప్రతిభను చాటుకున్నారు. వారి గురించి క్లుప్తంగా చెప్పాలంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఎంతో చక్కగా ఆలోచించి, జీవన సరళిని మార్చుకుని, తన జీవితాన్ని ఆదర్శంగా తీసుకునేలా చేసిన యశోధర, సిద్ధార్థుడి భార్య. ఒక కొడుకు పుట్టిన తరువాత సిద్ధార్థుడు తన కుటుంబాన్ని వదిలి బుద్ధుడిగా మారితే, యశోధర తన కొడుకుని చక్కగా పెంచి, మంచి బుద్ధులు చెప్పి, తరువాత ఆమె కూడా సన్యాసం తీసుకుని, బౌద్ధ మతంలో మొట్టమొదటి సన్యాసినిగా చరిత్రలో నిలిచింది. ఆమె ఎప్పుడూ తన కొడుకు రాహులాకు "ప్రపంచంలో అందరూ మరో జన్మ వద్దనుకుంటే, సుర్యచంద్రులతో సహా, అప్పుడు ఈ ప్రపంచం ఏమవుద్ది? అందుకే సుర్యచంద్రుల్లాగే ఎప్పుడూ జీవిద్దాం, ప్రపంచానికి 365 రోజులు, 24 గంటలు వెలుగునిద్దాం, అలా జన్మిస్తూనే ఉండాలి," అని చెప్పేది. యశోధర తత్వాన్ని మైథిలి శరన్ గుప్త్ రాసిన చాల పుస్తకాల్లో తెలుసుకోవచ్చు.

తరువాత, ఆండర్సన్ ఇ గారెట్, మొట్టమొదటిగా వైద్య శాస్త్రాన్ని అభ్యసించిన గొప్ప మహిళ. ఆమె స్త్రీల హక్కుల కోసం కూడా పోరాడి గెలిచింది. ఆన్నిబీసెంట్, భారతీయ సంస్క్రుతీ, ఆచారాలు,తత్వానికి ఆకర్షితురాలై భారతీయురాలిగా మారిపోయింది. ఎన్నో ఉద్యమాల్లో పాల్గుంది. ఆమె ప్రత్యేకంగా హోం రూల్ ఉద్యమాన్ని ప్రారంభించి చరిత్రలోనే తను ఒక పుట సంపాదించుకుంది. మనకందరికీ తెలుసు కిరణ్ బేడీ,భారత ఉక్కు మహిళ, మన దేశంలో మొట్టమొదటి ఐపీఎస్ ఆఫీసర్. నిజానికి తాను ఐఏఎస్ కావాలనుకుంది కానీ దాంట్లో ఎంపిక అవకుండా ఐపిఎస్కు ఎంపికైంది. అదే ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆమె ఈ వ్రుత్తిని ఒక సవాల్గా తీసుకుంది, మంచి పేరు సాధించింది. ఆమె ఎన్నో అద్భుతమైన రచనలు కూడా చేసింది. "నవ జ్యోతి" అనే పేరుతో సాంఘిక సంస్థను స్థాపించింది. ఆమె విజయానికి గల కారణం మనకున్న భయాలను వదిలేస్తే మనం సాధించనిదంటూ ఏమీ లేదనే సిద్దాంతంపై ఆమెకున్న నమ్మకమే. నిజమే కదా. ఇక, ఇప్పుడు మహిళలందరూ తమకున్న ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు కాని వారికా హక్కు ఎలా వచ్చిందో తెలియదు. ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం. 1914వ సంవత్సరంలో మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు మిసెస్ ఎమిలైన్ పాంకరస్ట్, ఆమె కూతురు క్రిస్టాబెల్లు ఈ మహిళా ఓటు హక్కు కోసం ఎంతో శ్రమ పడి, అప్పటి బ్రిటీష్ ప్రభుత్వానికి స్త్రీలు ఏ పనైనా చేయగలరని నిరూపించి, 1918లో 30 సంవత్సరాలు పై బడిన స్త్రీలకు ఓటు హక్కును సాధించారు. 1928లో మాత్రమే, దానిని 21 సంవత్సరాలకు తగ్గించారు. మరి వీరి గురించి మనం తెలుసుకోవాలి కదా.

ఇక మనందరికీ తెలిసిన గొప్ప స్త్రీ హెలెన్ కెల్లెర్. ఆమె పూర్తిగా గుడ్డిది, చెవిటిది అయినా ఏమాత్రం నిరుత్సాహ పడకుండా, బ్రైయిలీ లిపిలో చదవడం, రాయడం నేర్చుకుని, కేంబ్రిడ్జ్లో, ఇంగ్లీష్లో గ్రాడ్యేషన్ పూర్తి చేసి తెలివైన విద్యార్థిగా నిరూపించుకుంది. ఇంకా ఎన్నో రచనలు కూడా చేసింది. మనకు ఎన్నో లోపాలను కలిగించినా వాటికి ఒక కారణం ఉంటుంది అంతేకాక దాని బదులుగా ఆ దేవుడు మనకు ఖచ్ఛితంగా మరో ఉన్నత, ఉత్తమ లక్షణాన్ని ఇస్తాడు. జీవించడమంటే ఇవ్వడమని ఆమెకు తెలుసు. మనం ఏవి సంపాదించినా, అది మనల్ని వదిలి వెళ్ళిపోతుంది. మనతో వుండదు. మనం సమాజానికి ఏదైతే ఇస్తామో అదే శాశ్వతం, అదే మనకు జీవితానిస్తుంది. అది ఎంత చిన్నదైనా, తక్కువైనా అదే మనల్ని విజయతీరాలకు చేరుస్తుంది. కనుక, మంచిగా వుంటూ, సమాజానికి ఎంతోకొంత సేవ చేద్దాం. మనం మన జీవితం గురించి, సమాజం గురించి ఆలోచించాలి, మన జీవితంలో ఎన్నో ఇచ్చిన ఆ దేవునికి క్రుతజ్ఞత చెప్పాలి., చివరికి మనం చేసిన దానం మనలో నవ్వుల్ని పూయిస్తుంది. అస్తమించే సూర్యుడు,"ఇప్పుడు నా పనెవరు చేస్తా," రని అడిగితే, చిన్న కొవ్వొత్తి వెలుగు,"నాకు సాధ్యమయ్యేంత వరకూ నేను చేస్తాన"ని చెప్తుంది. మనం కూడా ఆ కొవ్వొత్తిలా జీవిద్దాం.

ఇక శాస్త్రజ్ఞుల విషయానికి వస్తే ముందుగా గుర్తొచ్చేది మేడం క్యూరి. మానవుల్లో, అది, స్త్రీ ఐనా, పురుషులైనా, ప్రపంచంలోనే నోబెల్ బహుమతిని రెండు సార్లు అందుకున్న గొప్ప మహిళ. ఆ రోజుల్లో ఒక స్త్రీ సైన్స్ రంగంలో వుండడమనేది ఊహాతీతం. కానీ,సైన్స్ పరిశోధనలో ఆమెకున్న ఆసక్తే ఆమె విజయనికి దోహదపడింది. ఆమె పెళ్ళి తరువాత కూడా, తన భర్త, తాను కలిసి రేడియో ధార్మిక మూలకాలను కనిపెట్టారు. అది కాన్సర్ నిర్మూలనకు ఉపయోగపడింది. అందుకే ఆమె నోబెల్ బహుమతిని సాధించింది. రోజుకు 18 గంటలు పని చేసి, 8 సంవత్సరాల తరువాత కెమిస్ట్రీలో పరిశోధనకుగాను ఆమెకు రెండవ సారి నోబెల్ను ప్రధానం చేసారు. మిసెస్ మేరీ లావోయిసెర్, ఆధునిక కెమిస్ట్రీకి పితామహుడైన లావోయిసెర్ భార్య నిజంగా ఒక స్త్రీగా, ఒక భార్యగా ఎప్పుడూ ఆమె భర్తను ప్రోత్సహిస్తూ, అతని మరణం తరువాత కూడా అతను రాసిన రచనలను పుస్తకాలుగా ప్రచురించి, పబ్లిష్ అయ్యేలా చేసింది. ఆ శాస్త్రవేత్త గొప్పతనాన్ని ప్రపంచమంతటికీ చాటింది. ఎప్పటికీ అతనే గొప్ప ఫ్రెంచ్ శాస్త్రవేత్తగా కొనియాడబడ్డాడు. ఇప్పుడు స్త్రీలు భార్యలుగా ఎంతవరకూ తమ భర్తల జీవితం, పిల్లల జీవితం గురించి ఆలోచిస్తూ, తమకి తాము ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటున్నారు? ఏదో ఒకటే చేస్తున్నారు. వారిని వారు నిరూపించుకోవటంలేదు. మేరీ లావోయీసెర్లా క్రుషి చేస్తే వారి జీవితం కూడా వెలుగులోకి వస్తుంది. వారికీ ఒక ప్రత్యేక పేజి కేటాయించబడుతుంది. ఎందుకంటే ప్రతీ మగవారు వారు చేసిన పనిని ఒక నిచ్చెన ఎక్కినట్టుగా భావిస్తే, వారు కిందికి చూస్తే కింద ఒక వ్యక్తిని చూడగలరు, ఆ వ్యక్తే "భార్య".అందుకే ప్రతీ పురుషుని విజయం వెనుకా ఒక స్త్రీ వుంటుందనే మహత్తర సత్యం లావోఇసర్స్ వల్లే వెలుగులోకి వచ్చింది. కనుక, ఏది చేసినా, ఏం జరిగినా అందులో స్త్రీ పాత్ర ఖచ్ఛితంగా వుంటుందనడానికి వెనుకాడాల్సిన పని లేదు.

తరువాత చెప్పుకోవాల్సిన వారు శకుంతలాదేవీ, గణిత ప్రావీణ్యురాలు. ఆమెను నవ కంప్యూటెర్గా వరిగణించారు. గణిత శాస్త్రంలో ఆమెకున్న పట్టు ఆమెకు గిన్నీస్ బుక్లో స్థానమిచ్చింది. ఇక సాంఘిక సంస్కరణల విషయంలో, ఫ్లోరెన్స్ నైటేంగిల్ సమాజానికి చేసిన సేవ చెప్పుకోదగింది. ఆధునిక నర్సింగ్ని స్థాపించిన ఫ్లోరెన్స్ నర్సింగ్పరంగా ఎంతో సేవ చేసింది. ఆమె తన అవసరాలను, సౌకర్యాలను త్యాగం చేసి, కేవలం అనారోగ్యంతో భాదపడే వారికి సేవ చేయడానికే తన జీవితాన్ని అంకితం చేసింది. రాత్రి వేళల కూడా ఆమె దీపాన్ని పట్టుకుని రోగులకు చికిత్స చేసేందుకై వెళ్ళేది. అందుకే ఆమె "ది లేడీ విథ్ ది లాంప్" గా పేరు పొందింది. పేషెంట్లు ఆమె నీడను సైతం చూసి చలించిపోయేవారు, ఎంతో ఆప్యాయతతో చూసేవారు. తరువాత చెప్పుకోవాల్సిన వారు మనకందరికీ బాగా తెలుసు మదర్ థెరిస్సా. ఆమె సమాజానికి చేసిన సేవ చిరస్మరణీయం, ప్రతీ స్త్రీ ఒక మదర్ థెరిస్సా కావాలనుకునేంత స్ఫూర్తిని కలిగించారు. ఒక మంచి పనిని చేయడాన్ని వాయిదా వేయద్దు. జీవితం చాల చిన్నది, ఇప్పటికే ఆలస్యమైంది. లేద్దాం, కాలాన్ని ఉపయోగిద్దాం, విజయం మనదే. ఇక మనకందరికీ తెలుసు ప్రపంచ ధనవంతుల్లో మొదటి పది మందిలో ఒకరు, ఆసియా ఖండంలో పది మంది ప్రముఖుల్లో ఒకరు, "ఇన్‌ఫోసిస్" అధినేత ఎన్ ఆర్ నారాయణ మూర్తి గారు, ఆయన వెనుక ఒక స్త్రీ ఉన్నారు, ఆమె వారి భార్య సుధా మూర్తి. టాటా టెల్కొలో పని చేసిన మొట్టమొదటి మహిలా ఇంజినీర్. 1000 స్కూళ్ళకు, 4000 లైబ్రరీలు, అనేక మంది పిల్లలు, స్త్రీ విద్యా కార్యక్రమాలకు ముఖ్య పోషకురాలు ఆమె, మంచి రచయిత్రి కూడా. ఆమె రాసిన "గ్రాండ్మా కథలు" అందరూ చదవాల్సిన పుస్తకం.

గొప్ప దేశభక్తులు కూడా ఉన్నారు. అలా చూస్తే ఝాన్సీ రాణీ లక్ష్మీ భాయిని మించిన వారెవరూ లేరు. ఆమె చిన్నప్పుడే గుర్రపు స్వారీ, యుద్ధ కళలు నేర్చుకుంది. తన 8వ ఏట వివాహం చేసుకుని ఝాన్సికి రాణి అయింది. తన భర్త, కొడుకుల మరణం తరువాత బ్రిటీష్ వాళ్ళు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తే లక్ష్మీ భాయ్ వేరే పిల్లాడిని దత్తత చేసుకుని , తన దేశం కోసం పోరాడి, బిడ్డను తన వెనుకకు కట్టుకుని యుద్ధ భూమికి వెళ్ళి, వారితో యుద్ధం చేసింది. ఆమె ధైర్యానికి బ్రిటీష్వారు ఆశ్చ్ర్యపడినా వెరే దారి లేక ఆమెను చంపితే గానీ రాజ్యం రాదు కనుక ఆమెను చుట్టు ముట్టారు. యుద్ధ భూమిలోనే ఆమె వీర మరణం చెందింది. తరువాత చెప్పుకోవల్సిన మహత్తర మనిషి, దేశ భక్తురాలు, రచయిత్రి, "భారత నైటింగేల్ " సరోజినీ నాయుడు. భారత జాతీయ కాంగ్రెస్కు మొట్ట మొదటి మహిళా అధ్యక్షురాలు. ఎన్నో పుస్తకాలను కూడా రచించారు. దేశభక్తితో దేశానికి మంచి చేయాలని, దేశానికే అధ్యక్షులయారు ఇందిరా గాంధి, ఎవరూ మర్చిపోని, ప్రతీ స్త్రీ ఆదర్శవంతంగా తీసుకోవల్సిన వ్యక్తి. మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎంతో మంది స్త్రీలు తమ దేశాలను పాలించారు. బెనజ్జీర్ బుట్టొ, క్వీన్ విక్టోరియా, సోనియా గాంది ఇలా అందరూ స్త్రీలే.

కల్పనా చావ్లా, పేరు వినగానే మనకు గుర్తొచ్చేది దైర్యం. అంతరిక్షంలో అడుగు పెట్టిన తొలి మహిళ. కొన్ని రోజులు ఆమె అక్కడ ఉండి, ఎన్నో ఆపరేషన్లు నిర్వహించి అన్నింటా విజయం సాధించి స్త్రీలు ఏ విష్యంలోను తక్కువ కాదని, ఏ పనైనా చేయగలరని నిరూపించారు. కొంతమందికి మరణం ఉండదు. అలాగే కల్పనా చావ్లా కూడా. ఆమె భౌతికంగా మరణించినా, కొన్ని వేల సంవత్సరాల తరువాత కూడా అందరి హ్రుదయాల్లో, పుస్తకాల్లో ఆమెకు శాశ్వత జీవం, జీవితం ఉంటుంది. ఎందుకంటే మనకు గొప్ప లక్ష్యాలు సాధించాలన్న తపన ఉంటే, తప్పకుండా సాధిస్తాం. అలా సాధించినపుడు, సాధించేటప్పుడు మరణించినా, అది నిజమైన మరణం కాదు, నిజానికి అప్పుడే మన జీవితం ప్రారంభమౌతుంది! అదెలాగో మీరు అర్థం చేసుకుంటారనుకుంటాను. సునీతా విలియంస్, క్రిస్టినా డాడ్వెల్ ఇలా ఎందరో సాహస వనితలు మన దేశంలో, మన ప్రపంచంలో జన్మించారు. కొంతమంది వెలుగులోకి రాకపోయినా మన మధ్యనే ఉండి ఉంటారు, మనం వారిని వెలుగులోకి తెద్దాం, తేవడానికి ప్రయత్నిద్దాం.

అంతేకాక, క్రీడల్లోనూ స్త్రీలు వారి సత్తాను చాటుకున్నారు. జీవితాన్ని అనందమయం చేసుకున్నారు. వారిలో టెన్నిస్ క్రీడాకారిణి, క్రిస్ అవెర్ట్ సంపాదించిన పేరు ప్రఖ్యాతులు మరెవరు సాధించుండరేమో. ఆమె టెన్నిస్ నుండి రెటైర్ అవుతునప్పుడు 20,000 మంది పైగా అభిమానులు బాధపడ్డారు, కన్నీరు పెట్టుకునారు. ఎంత ఆశ్చర్యం? మనం ఆ విధంగా స్ఫూర్తి పొందాలంటే చాలా మంది క్రీడాకరులు ఉన్నరు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి విల్మా రుడాల్ఫ్. ఆమె పుట్టడమే 2 కేజీల కన్నా తక్కువ ఉంటూ, తరువాత కూడా అనేక సమస్యలతో బాధ పడింది. నిజంగా అలా ఎవరికీ జరగదేమో. తరువాత ఆమె ఎడమ కాలు పూర్తిగా నాశనమైంది. డాక్టర్లు ఇంకెన్నడూ ఆమె నడవలేదని తేల్చేశారు. ఆమె జీవితం ప్రతికూలాంశాలను సాధించిందని చెప్పొచ్చు. కానీ ఆమె అధైర్య పడకుండా ముందుగా జీవించాలనుకుంది. తన స్కూలు రోజుల్లోనే బాస్కెట్ బాల్ లో ప్రథమ స్థానం పొంది, తరువాత 16 సంవత్సరాల గ్రూప్లో ఒలింపిక్స్లో పాల్గొని, బ్రాంజ్ మెడల్ సాధించింది. విజయానికి ఎక్కడా అంతమనేదే లేదు, అది ముగింపు కాని గమ్య స్థానం. వివిధ అంశాల్లో మూడు బంగారు పతకాలను సాధించిన మొదటి అమెరికన్ స్త్రీ. ఆమె విజయానికి కారణం, ఆమె సాధించాలన్న కల. ఆమె ఆ కలను ఎప్పుడూ చెరగనివ్వలేదు. దాన్ని నిజం చేసేందుకు, తన లక్ష్యాన్ని సాధించేందుకు ఎంతో కష్ట పడింది. ఒక ఆశ , నడవలేని మనిషిని కూడా పర్వతాలను ఎక్కేలా చేస్తుంది. అలా ఇక్కడ మనం ఓ సాధారణ గౄహిణి గొప్ప అథ్లెటై ఒలింపిక్స్లో ప్రపంచ రికార్డ్ సాధించి, ఆ శతాబ్దానికే ఉత్తమ మహిళా అథ్లెట్గా కీర్తించబడింది. మనం సహనాన్ని కోల్పోతే, అంతా కోల్పోతాం. ఓడిపోయేవాడు ఎప్పుడూ గెలవడు, గెలిచేవాడు ఎన్నడూ ఓడడు. ఇలా మనం మార్టినా నవ్రతిలోవా, పీ.టీ.ఉషా, సానియా మీర్జా ఎంతో మందిని చూడవచ్చు, స్ఫూర్తిని పొందవచ్చు.

తమ రచనల ద్వారా కూడా స్ఫూర్తిని నింపుతూ, తద్వారా ఆ రచనలు చేసిన వ్యక్తులనే స్ఫూర్తిగా తీసుకునేలా వుండే వ్యక్తులు అని ఫ్రాంక్, ఆమె రాసిన డైరి 19 భాషల్లో ప్రచురించబడి, రెండు మిలియన్ల కాపీలు అమ్ముడయ్యాయి అంటే అది ఎంత ప్రభావితపరిచే రచనో. ఇల ఎంతో మంది స్త్రీలు వారి రచనలను మనకందించారు. జె.కె.రౌలింగ్- హ్యారి పాటర్, కమలా దాస్ - తన జీవిత చరిత్ర, "మై స్టోరీ" , మేధా పాట్కర్ - సాంఘిక, పర్యావరణాలపై చేసిన రచనలు, హిందూ వేదాంతం, హిందూ దేవతలపై, తోరూ దత్ చేసిన రచనలు నిజంగా అద్భుతం. లతా మంగేష్కర్, గాయనిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని, ప్రపంచ గిన్నీస్ బుక్లో కూడా స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. ప్రతీ రోజూ ప్రపంచంలో ఎక్కడో ఓ చోట, ఏ మూలనో ప్రతీ సెకను, ప్రతీ నిముషం లేదా రోజంతా ఆమె గొంతుని పాటల రూపంలో వింటూనే ఉంటాం. ఎమ్మెస్ సుబ్బ లక్ష్మి గారి సంగీతం కూడా చాల మందిని ప్రభావితం చేయగలదు. ఏక్తా కపూర్, అమ్రితా షెర్గల్, ఇలా చాలా మంది తమ కళల్లో పేరు సంపాదించుకున్నారు. అందంలో, అందంతో కూడా డయాన,క్లియోపాత్ర, సమతా ఫాక్స్, ఎలిజిబెత్ టేలర్, హేమా మాలిని, నర్గిస్ దత్, మడోన్నాలు ప్రపంచ చరిత్రలో తమ మార్కును వేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని పేజీలైనా సరిపోవు. ఇంకా మనం రుక్మిణీ దేవీ అరుంధల్, గొప్ప థింకర్, సిరిమావొ బండారు నాయక- ప్రపంచ మొదటి మహ్ళా ప్రధాన మంత్రి, భారత దేశంలో మెరుగులు దిద్దుకున్న జయ లలిత, మేనకా గాంధి, ప్రియా టెండూల్కర్, ప్రియాంకా గాంధీ, మిథాలీ రాజ్, వసుంధరా రాజే వంటి గొప్ప స్త్రీలను చూడవచ్చు, వారిలా మనమూ కావచ్చు. ఇన్సులిన్ నుండి అనేక యాంటీ బయాంటిక్స్ను ఉత్పత్తి చేస్తూ, ఫార్మా రంగంలోనే 1000 కోట్ల టర్నోవర్ను చేస్తున్న కిరణ్ మజూందర్ షా, మొదట్లో డాన్స్ తప్పా ఏమీ నేర్చుకోక, ఇద్దరు పిల్లల తల్లయిన ప్రీతా రెడ్డి, ఇప్పుడు అపోలో గ్రూప్ హాస్పిటల్లకు నిర్వాహక కార్యదర్శి, షబానా ఆజ్మి- ప్రఖ్యాత సినీ తార, అరుంధతీ రాయ్, భరతీయ ఆంగ్ల రచయిత్రీ, బృందా కారత్, స్త్రీ ఉద్యమకారి అందరూ స్త్రీలే, స్ఫూర్తిమంతులే.

ఆ దేవుడు స్త్రీ జాతికిచ్చిన వరాలు రెండు. ఒకటి మాతృత్వం, రెండు అందం. కొన్ని ప్రతికూలాంశాలనూ ఇచ్చాడనుకోండి. వాటిని మనం ఈ పుస్తకం చివరి పేజీల్లో చూడవచ్చు. కానీ, వాటిని అనుకూలంగా అర్థం చేసుకోవాలి. ఏదేమైనా స్త్రీ, పురుషులు ఒకరు ఎక్కువా కాదు, ఒకరు తక్కువా కాదు. అందరూ సమనమే. మనది పురుష జాతీ కాదు, స్త్రీ జాతీ కాదు, అలా అని మానవ జాతీ కాదు.మనది జంతు జాతి. ఏదీ ఎక్కువా కాదు, ఏదీ తక్కువా కాదు. మనందరం ఈ సజీవ నిజాన్ని జీవితాంతం గుర్తుంచుకోవాలన్న మురళీ కృష్ణగారి మాటలతో నేను ఏకీభవిస్తాను. "ఉమెన్ " పుస్తకం చదివితే మీరూ ఏకీభవిస్తారు.

Monday, November 26, 2007

సూర్యుడు వస్తూ వెలుతురును తెస్తాడు
వెళ్తూ ఆ వెలుతురును తీసి చీకటినిస్తాడు
చంద్రుడు వస్తూ ఆ చీకటికి వెలుగు తెస్తాడు
వెళ్తూ వెలుగును కాస్తా వెలుతురు చేస్తాడు
అందుకే చంద్రుడు చందమామై అందరికీ నచ్చుతాడు.

ఉషా కిరణాలు

అనుదినం ఉదయించే ఉషా కిరణాలు
అందరికీ ఇష్ట్పడతాయి ఆ కిరణ కాంతులు
నింపుతాయి అందరి మనసులో వింత వెలుగులు
ఆ వెలుగులు చూపుతాయి సరిక్రొత్త బాటలు.....

Monday, November 19, 2007

కవితలు కేవలం మాటలే కాదు, మనసులోని భావాలు. మనసుతో అలోచించే శక్తిని కల్పించడానికి, చైతన్యాన్ని రగిలించడానికి, మనల్ని మనం దిశా నిర్దేశం చేసుకోడానికి ఝులిపించే పదునైన బాణాలు అనుటలో అతిశయోక్తి లేదు. ఆ భావాలు సామాజిక మార్పుకుపయోగపడతాయని నిరూపించేలా ఉంది 'జనసాహితి ' అందించిన "నూరు అలల హోరు" (ప్రజా సాహితి కవితలు). కేవలం ఒక భావ కవిత ఎంతో మర్పును తెచ్చి ఆలోచనలో పడేస్తుంది. అలాంటిది వెర్వేరు కవులు వ్యక్తిగతంగా, సామాజికపరంగా అందించిన వివిధ కవితలను ( వందకు పైగా) మనముందుంచి కవితా ప్రయోజనాన్ని పాఠకులూ తెలుసుకోవాలనే చిన్న ఉద్దేశంతో---


డా. బి.సూర్యారావ్ గారు రాసిన 'జెండా 'కవిత మొట్టమొదటిగా పాఠకుల మనస్సుకు హత్తుకుని వందనం చేయాలనిపించేలా ఉంది. జెండాను నిలబెట్టడమే కాదు, దాన్ని ఎగురవేసిన వాడు జెండాలాగే నిలువగలగాలి అన్న ఆయన మాటలు మన ఆశయాన్ని తెలొయజేసేలా వుంది. తరువాత ఉపాధ్యాయుల ధ్యెయాన్ని, ఏదైనా వారి చేతుల్లోనే వుందంటూ, తరగతి గదే వారికి ఆయుధమని ' కొత్తపల్లి రవిబాబు ' గారు చక్కగా వ్యక్తపరిచారు ' తరగతి గది నా తుపాకీ ' లో. ఏవరెన్ని ఆంక్షలు విధించినా భయపడకుండా, చేసే పనిని ఆపకుండా, అక్షరాలనే ఆయుధంగా చేసి రగిలించక తప్పదంటూ 'అల ' గారు రాసిన కవిత అక్షరాలకే లక్ష్నంగా ఉంది, రాయడం ఆపకూడదనే నిర్ణయం తీసుకునేలా చేస్తుంది.

కవితలు ఆలోచనల్లో పడేస్తాయి. ఆ ఆలోచన మీద కవిత రాస్తే ఎంత బావుంటుందో 'ఆశా రాజు ' గారి కవిత ద్వారా తెలుసుకోవచ్చు. 'మనిషి ఆలోచనల్ని ఎలా బంధిస్తావ్ ఆలోచనంటే నిప్పు కదా - ఆలోచనంటే సముద్రపు హోరు కదా
ఆలొచన ఎవడి చేతికి చిక్కేది కాదు - ఎవడి కాళ్ళకి మొక్కేది కాదు
ఆలోచనంటే సమస్త భూమండలం - ముంచెత్తే వాయుగుండం
ఆలోచనంటే మనిషి పిడుగవటం - మంటవ్వటం
మనిషినైతే బంధించొచ్చు కానీ ఆలోచన్ల్ని ఎలా నిషేధిస్తావ్?" అన్న ప్రశ్న రేకెత్తిస్తుంది అందరి గుండెల్లో ఆలోచనను. మరి కొంత మంది కవులు తాము తెలుసుకున్న విషయాలకు స్పందించి సూటిగా, ఘాటుగా రాసిన వాటినీ చూడొచ్చు. అందుకు ఎ. మురళీక్రిష్ణ ' గారు ఖలిస్తానీ తీవ్రవాదుల చేతుల్లో మరణించిన పాష్ అనే కవి సంస్మరణ కోసం రాసిన 'మరణం లేని అక్షరం ', చాయ్రాజ్ ' కొత్త రాగం ' కాకరాల గారు విన్నాక అభినందించేందుకు రాసిన ' భళే బాగుంది బొమ్మ ' , శాంతి - ప్రజాస్వామ్యాల కోసం ఏర్పడిన భారత - పాకిస్తాన్ ప్రజా వేదికకు వెళ్ళే దారిలో తన భావాలను కవితా రూపంగా చేసిన దివికుమార్ గారి 'ఉద్విగ్న క్షణాలు ' , కరీమ్నగర్ పోలిసుల అఘాయిత్యానికి రాజన్న గారి ప్రతిస్పందన 'ప్రక్రుతి విరుద్ధం ', అగ్రరాజ్యం చిన్న దేశాల మీద చేస్తున్న దౌర్జన్యానికి నిరసనగా వర్రే రాణి గారి 'ఎదురు దాడి ' లను ఉదాహరణలుగా చెప్పొచ్చు.


"ఓడిపోతాం .... గెలుస్తాం, ఓడిపోతూనే గెలుస్తాం, ఓటమిలోంచి గెలుపై మొలుస్తాం, మేం కొండ మోడులమై మళ్ళీ .. మళ్ళీ... చిగురిస్తూనే వుంటా" మంటూ పిడుగురాళ్ళ ప్రంతం కొండమోడులో పోలిసులు, ఫారెస్టధికారులూ కలిసి మూడు సార్లు కూల్చేసినా, తిరిగి ఇళ్ళు నిర్మించుకున్న ద్రుశ్యానికి పై విధంగా స్పందించి శ్రీ హరి గారు రాసిన "కొండ మోడు చిగురిస్తూనే వుంటుంది!" లో ఆయన భావాలు కొత్త ఆశలను, కవిత్వం మీద ఇష్టాన్ని చిగురించేలా చేస్తాయి.


ప్రక్రుతే అందం, ప్రక్రుతిలోని ప్రతీ వస్తువు అందం. అందులో సముద్రం, ఏదో చేరుకోవాలనే ఆరాటంతో ఎంత దిగినా అంతే ఎత్తుకు ఎదగాలనే ఒక స్ఫూర్తిని రగిలిస్తూంటే ఆ సముద్రంలో ఎగసిపడే అలలు, అల్లంత దూరాన కలిసిపోయాయా అన్నట్టు కనిపించే సముద్రం, ఆకాశంలో మబ్బులు, బీచ్లో కాళ్ళ కింద ఇసుకను ఎలా మర్చిపోగలం. ఇక అక్కడ వెలిగే ఆ శోభను పై పై చూడకుండా, చూపును కొంచెం వేరు చేసి చూడమంటూ, అందులో వుండే ఉప్పెనను ఉద్వేగం చేయమంటూ, జీవితాల్ని చెరువును తవ్వినట్టు తవ్వీ తవ్వీ సముద్రాన్ని నిలబెట్టమంటూ, ఆ అలల్నీ, అలల్లో కలల్నీ, కలల్లో మహోపాన్యాస విన్యాసాల్నీ లెక్కపెట్టమంటూ క్నదుకూరి శ్రీ రాములు గారి "సముద్ర సభ" ప్రక్రుతికే శోభ.

విదేశీ ఫ్యాషన్లకలవాటుపడిన ప్రజలు చేనేత విలువలను తగ్గించి, ఆ వర్గాల వారికి పూర్తిగా అన్యాయం చేస్తుంటే, ప్రభుత్వం కూడా కెవలం వారిని ఓటర్లుగానే గుర్తిస్తుందే కానీ వారి ఆకలి భాదలను గుర్తించట్లేదు. వారి ఓట్లతో నాయకులు పదవుల్లో వుంటున్నారు. మరి ఆ ఓటర్లూ, పిరికి ఊహలతో గొంతు నులుముకుని ఈ వ్యవస్థకు ఆహారమై అరిగిపోతున్నారని చల్లా విశ్వనాధంగారు "మగ్గం కొయ్యపై చేనేత తనువులు" లో కనుమరుగౌతున్న చేనేత వర్గాల కళా స్రుష్టిని కళాత్మకంగా కవితా రూపాంతరం చేశారు. నేడు ఈ సమాజంలో జరుగుతున్న దారుణాల్లో ఒకటి రైతుల ఆత్మహత్యలు. ఏదో పండించాలని, ఎంతో సంపాదించాలనే ఆశతో, వున్న డబ్బుల్ని తగలేసి, వున్న బంగారాన్ని తాకట్టు పెట్టి, వున్న అవసరాలకై కాడి కింద ఎద్దులా, కన్నీరు కార్చి, కన్న కలలన్నీ కల్లలైనప్పుడు, చేసేదేంలేక బూడిధ పాలైన ఈ రైతే, అసమర్థ ప్రభుత్వాన్ని అంతం చేయడానికీ, ఈ దోపిడీ వ్యవస్థను కూల్చి వేయడానికీ, "మళ్ళీ మళ్ళీ రైతుగానే మొలకెత్తుతా" డని పుప్పాల మట్టయ్య గారు స్పందించిన తీరు, మనిషి కన్నా వస్తువులకే నేటి ప్రపంచంలో విలువ పెరిగిందంటూ, ఆప్యాయతల్ని పెట్టుబడిగా, అభిమానాల్ని ఉత్పత్తులుగా, శ్రమను నిత్యావసర జాబితాల్లోకి చేర్చేస్తూ, మానవ సంబంధాలన్నీ వస్తు సంబంధాలయ్యాక ఇంకేం మిగిలింది, మనుషుల్ని హాలు మధ్యలో శిలల్ని చేసేస్తున్నరన్న చేదు నిజాన్ని బండ్ల మాధవరావు గారి "వస్తు ప్రవాహంలోంచి..." ఒప్పుకోక తప్పదు.

ఇక మరికొంత మంది తమ అందమైన భావాలను సొంత భావాలతో కలబోసి రాసిన కవితలు భూమి, చెట్టుం నది, దేశం, విప్లవం, మారుతున్న సమాజం, సమ్మజంలోని తీరు, వ్యక్తిగత భావాలు, ప్రక్రుతి గురించి వర్ణనలు, జరుగుతున్న అన్యాయాలు, ఒకటేమిటి కాదేది కవితకు అనర్హమనే విధంగా, తలుచుకుంటే ఆలోచనను ఆచరణ చేయొచ్చు, ఆ ఆచరణలను కవితల ద్వారా పెంపొందించుకోవచ్చనే విధంగా వున్నాయి. ఎంపిక చేసి మరీ అమర్చిన ఈ కవితా సమాహారాన్ని మనమందరం ఒక్కసారి చదవక తప్పదు, చదివాక విశ్లేషించుకోక తప్పదు, వీటిని మనకందించిన వారికి క్రుతజ్ఞత చేయక తప్పదు.
ఈ నూరు అలల హోరు

నూరు మనుషుల తీరు

వారి భావాల జోరు

చేద్దాం వాటికి జోహారు.....

నా భావం

మనసు అనేది మహా సముద్రం
ప్రేమతో నిండిన అలల ప్రవాహం

ఒక్క క్షణం ఎగసిపడే కెరటం
మరు క్షణం అంతా నిశ్శ్బ్దం

కొందరికి తెలియనిది ఆ భావం
అల్పులకు ఎప్పటికీ కాదు అర్థం...

నిజం

ఒక ప్రయోగం నేర్పుతుంది ఎన్నో పాఠాలు......
ప్రతీ పాఠం తెలుపుతుంది ఎన్నో సత్యాలు!

ఒక హ్రుదయం పలుకుతుంది ఎన్నో రాగాలు......
ప్రతీ రాగం కలిగి ఉంటుంది ఎన్నో కావ్యాలు!

ఒక నయనం చూపుతుంది ఎన్నో భావాలు.........
ప్రతీ భావం వివరిస్తుంది ఎన్నో అర్థాలు!

ఇవి ఎవరికి అర్థమవుతాయి?
మనసుతో ఆలోచించే వారికి తప్పా!!!!!!

Tuesday, September 25, 2007

పెద్దల కోసం చెప్పిన పిల్లల కథ

విలియం గోల్డింగ్ అద్భుతమైన, ఆద్యత్మికమైన, నిరశమయ, అలంకారిక భావనలు కలిగిన గొప్ప రచయిత. ఆయన తన నవలల్లో నాగరిక మనిషి ప్రవ్రుత్తికీ, చీకటి ప్రవ్రుత్తికీ మధ్య జరిగె నిరంతర సంఘర్షణ తనదైన శైలిలో చిత్రీకరించారు.

విలియం గోల్డింగ్ సెప్టెంబెర్ 19, 1911వ సంవత్సరంలొ ఇంగ్లండ్ దేశంలోని కార్న్వాల్లో జన్మించారు. ఆయన తండ్రి అలెక్ గోల్డింగ్ గొప్ప సామ్యవాది. తల్లి మిల్డ్రెడ్. గోల్డింగ్ తెలివైన, పోటీతత్వం కల్గిన వ్యక్తె కాక సంగీతమంటే ఆసక్తి కలవారు. తన తండ్రితో కలసి లాటిన్ భాష నేర్చుకొని కథలు కూడా రాశారు.తన 20వ ఏట రచయిత కావాలనుకుని 1932లో ఇంగ్లీష్ లిటరేచర్లోకి ప్రవేశించారు. వాటిని మెక్మిల్లన్ సంస్థ ప్రచురించినా విజయం సాదించ్కపోవడంతో తన జీవితం శూన్యంలా తోచింది గోల్డింగ్కు. తన స్నేహితుడు ఆడం సహయంతో ఉపాద్యనిగ చేరి పలు విషయాలను భోదిస్తూనె ఎన్నొ సంగీత, నటకాలను ప్రదర్శించారు. 1950లో 'ది సీ ' పద్యం, 1952లో 'స్ట్రేంజర్స్ ఫ్రం వితిణ్నవలలను పబ్లిషర్స్ తిరస్కరించారు. కానీ, ఫేబర్ అండ్ ఫేబర్ సంస్థ ఎడిటర్ ఛార్లెస్ మౌంటెథ్ దానికి కొన్ని సవరన్ణలు చేసి 'లార్డ్ ఆఫ్ ది ఫ్లైస్ 'గా సెప్టెంబర్, 1954లో ప్రచురించారు. ఇదే గోల్డింగ్కు అద్భుత విజయానందించిన మొట్టమొదటి నవల. ఇక గోల్డింగ్ ఇంగ్లిష్ లిటరేచర్లో వెనుదిరిగి చూడలేదు.వరుసగ 'ది ఇన్ హెరిటర్స్ ' (1955), పించర్ మార్టిన్ (1956), ఫ్రీ ఫాల్ (1959), డార్క్నెస్ విజిబ్ల్ (1979), మరెన్నో విజయవంతమైన నవలలు రచించారు. 1983 తన జీవితంలో మరచిపోలేని సంవత్సరంగా చెప్పాలి. ఆక్స్ఫార్డ్ యూనివర్సిటి, సార్బన్ల నుండి డాక్ట్రేట్ను,ఆంగ్ల సాహిత్యంలో విశేష సేవలకుగాను నోబల్ పురస్కారాన్ని అందుకున్నారు. జూన్ ,1995లో ఆయన చివరి నవల 'ది డబల్ టంగ్ ' పబ్లిషైంది.

విలియం గోల్డింగ్ సాహిత్య ప్రయోజనాన్ని ఇలా చెప్పారు. "మానవునిలో దైర్యం, నిజయితీలను నింపడం ద్వార అది చరిత్ర దసను, దిశను మార్చేస్తుంది". చర్చిల్ లాగే గోల్డింగ్ది కూడా, సాహిత్యంలో వెలువడె భావాలు, ఆలోచనలు ప్రపంచంలో మార్పులను సూచిస్తూదేశానికి ఎంతో ఉపయోగపడతాయన్న అభిప్రాయమే.

లార్డ్ ఆఫ్ ది ఫ్లైస్ -నవల గొప్పతనం:

విలియం గోల్డింగ్ అద్భుతంగా రాసిన ఈ నవల ఎంతో విజయం సాధించింది. భయంకర, కల్పితమైన భావాలకు దగ్గరగ ఉంచి అల్లిన ఫాంటసి కథ. అణుయుద్దం జరిగే సమయంలో కొంత మంది స్కూలు పిల్లలున్న విమానమొకటి పసిఫిక్ సముద్రంలో చిక్కుకుపోతుంది. విమాన పైలట్ మంటల్లో చనిపోవడంతో పిల్లలందరూ ఒంటరిగా మిగిలిపోతారు. అక్కడ వారేం చేశారు? ఎలా ఉన్నారు? చివరకు ఏమి జరిగింది? ఈ ప్రశ్నలకు తనదైన శైలిలో గోల్డింగ్ చెప్పిన జవాబులే ఈ నవల. పూర్తి పరిపక్వత, పరిగ్ణానం రాని చిన్న పిల్లల్ల స్వభావాన్ని, వారికుండే ఉద్దెశాలను అద్భుతంగా వివరించారు. సమాజంలోని, వ్యక్తుల తీరులోని లోపలను వెలికి తేసే ప్రయత్నమే "లార్డ్ ఆఫ్ ది ఫ్లైస్ ". దీనిలో మనం చక్కని పరిహాసం, సింబాలిజంలను చూడవచ్చు. పాత్రలు, వాటి స్వభవాలు కూడా విభిన్నంగా ఉంటూ పన్నెండు అద్యాయాలతో ఉన్న ఈ నవలలో ముఖ్యాంశం 'మానవ సమాజ అధ్యయనం'. ఒక మంచి భావం, స్వెచ్చ, శసంతి బాల్యం నుండే రావాలని తెలిపేందుకే ఆయన కథకు చిన్న పిల్లలను ఎంచుకున్నారు. సమయం, పరిస్తితుల ప్రభావం ఒక వ్యక్తిని ఏ దిశగా తీసుకువెళతాయన్న అంశాన్ని అద్యయనం చేసి అర్థం చేసుకునే వీలు కల్పించారు గోల్డింగ్ "లార్డ్ ఆఫ్ ది ఫ్లైస్" ద్వార.

కథ - విశ్లేషణ:
ఈ నవలలో అణు యుద్ధం కథ ప్రారంభించదానికి ఒక ఆధారం మాత్రమే. కానీ, రచయిత ముఖ్యొద్దేశం పసిఫిక్ తీరాన ద్వీపంలో చిక్కుకున్న పిల్లల స్వభావం తెలియజేయడమే.దీనిలో ముఖ్య పాత్రలు రాల్ఫ్, జాక్, పిగ్గీ, సైమన్, రాగర్, సాం, ఎరిక్, లిట్లన్స్ల చుట్టే అల్లుకుంది. వీరంతా అక్కడ ఒక క్రమ పధ్ధతిలో ఉండాలనుకుని పెద్ద వారెవరు లేకపోవడంతో వారిలో ఒక్కడైన రాల్ఫ్ను నాయకునిగా ఎన్నుకుంటారు. వారందరికి కొన్ని నియమాలను సూచిస్తాడు రాల్ఫ్. మొదటిగా శంఖం నుండి వచ్చే శబ్ధాన్ని వినగానే అందరూ సమావేశమవ్వాలి. ఇక్కడ శంఖాన్ని సాంఘికంగా ప్రజాస్వామ్యాన్ని, క్రమపధ్ధతిని, అధికారాన్ని తెలిపేంతగా సూచించడం గోల్డింగ్ సింబాలిజంకు ఉదాహరనగా చెప్పవచ్చు.

వారంతా అక్కడి నుండి బయట పడేందుకు ఆ ద్వీపంలో కొండపై నిప్పును ఏర్పరచాలని, అలా చేస్తే అతుగా వెళ్లే ప్రయాణికులు ఆ మంటను చూసి వీరిని రక్షిస్తారన్న ఆలోచన రాల్ఫ్ ఆలోచన వారు చేసే ప్రయత్నంలో లోపాలు, ఏ పధ్ధతీ లేక ఒకరికొకరు సహాయం చేసుకోకపోవడంతో ఎప్పుడూ విఫలమౌతుంది. జాక్ ఆ అడవిలోని పందులను వేతాడడంలో చూపే ఆసక్తి రాల్ఫ్కు నచ్చదు. తినడానికి అక్కడున్న చెట్ల పళ్లు సరిపోతాయి కనుక ఉండడానికి ఇళ్ళు నిర్మించాలనుకున్న రాల్ఫ్కు జాక్ సహాయం చేయకపోవడంతో వారిద్దరికీ వైరం మొదలౌతుంది. అయితే ఇదీ ఒక హక్కే. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరికి నచ్చినట్టు వారుండొచ్చు. తోచింది చెప్పొచ్చన్న విషయం గోల్డింగ్ పై విధంగా సమర్థించారు.

అక్కడ పిల్లలంతా 12 సంవత్సరాలలోపు వారే కాబట్టి పరిపక్వత లేక ఏదీ అర్థం చేసుకోరు. అంతా బయటపడాలని చేసె ప్రయత్నంలో ఆ కొండపై ఓ వింతైన ఆకారాన్ని చూసి దానిని ఒక భయంకర వన్యమ్రుగముగా, పెద్ద రాక్షషిగా భావిస్తున్నా, రాక్షసత్వం, దుర్మార్గం మనుషుల్లోనే ఉంటాయి కాని మరెక్కడా ఉండవనే సత్యాన్ని తెలుసుకున్న సైమన్ చాలా తెలివైనవాడు, ఏ విషయంలో జోక్యం చేసుకోడు. సాం, ఎరిక్ అను కవలలు మాత్రం తాము ఆ మ్రుగాన్ని చూసామని, వారిని తరుముకొచ్చిందంటూ చెప్పినా గానీ సైమన్ నమ్మడు. పిగ్గీ తెలివైనవాడైనా చూపు సరిగా లేక ఏమీ చేయలేని, చెప్పలేని స్థితిలో ఉంటాడు. అయితే వారు చూసింది ప్యారాషూట్లో వెళ్తూ జారిపడిన ఒక వ్యక్తిని మాత్రమే.

జాక్ మాత్రం తన పని తాను చేసుకోవడమే కాక మిగిలిన వారిని కూడా రాల్ఫ్కు వ్యతిరేకంగా వుందమని చెప్పడంతో రెందు గ్రూపులుగా విడిపోతారు - వేటాడేవారు, వేటకు వెళ్లనివారు. సైమన్ ఓసారి ఒంటరిగా వెళ్లాలని ప్రయత్నించగా క్నొడపై ఓ భయంకర వన్యమ్రుగం తల కనబడి సైమన్ను అక్కడుండొద్దని, వెళ్లి అందరితోనే వుండమని హెచ్చరిస్తుది.ఆ తలనే "లార్డ్ ఆఫ్ ది ఫ్లైస్" గా గోల్డింగ్ పేర్కున్నరు. ఇది మనకు తెలిసిన దుర్మార్గాలలో ఒకటి. 'నేను నీకు తెలుసు. నీలో భాగాన్ని. నిన్ని విడిచి వెళ్లను. వెళ్లి అందరితో వుండు లేదంటే అంతా చనిపోతారా న్న హెచ్చరికకు సైమన్ చాల భయపడిపోతాడు. ఎటువంటి చెడు భావన, దుర్మార్గాలైనా ఓ వ్యక్తితోనే పుట్ట్, వారిలోనే వుంటూ కొన్ని పరిస్తితుల్లో బయటపడతాయని గోల్డింగ్ వివరణ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇదే ముఖ్యాంసం, కథకు కీలకం.

ఇక తాను తెలుసుకున్న విషయాన్ని అందరికీ చెప్పి వారి బాధ, భయం పోగొట్టాలనే ఉద్దేశంతో జాక్ బ్రుందం వద్దకు వెళ్తే అది గమనించని వారు సైమన్ను వన్యమ్రుగమంటూ దారుణంగా చంపేసి అక్కడున్న భయంకర మ్రుగాన్ని చంపేశామంటూ సరదా పడతారు. తర్వాత వారు చంపింది సైమన్నని తెలుసుకున్నా ఏం చేయలేని పరిస్తితి. మంచి చేయాలనుకుని ప్రాణాలు కోల్పోతాడు కనుక సైమన్ని క్రీస్తుల్లా వర్ణించారు గోల్డింగ్. లిట్లన్స్ బాగా చిన్నవారు, ఏమీ చేయలేరు. జాక్ అక్కడి నుండి తప్పించుకోవాలని, నిప్పు ఏర్పరచాలని ఏ పరికరం లేక పురాతన పద్ధతిలో చేద్దామని పిగ్గీ కళ్ళద్దాలను దొంగలించి చాల ఇబ్బంది పెడతాడు. రాల్ఫ్ సమావేశమై జాక్ను దొంగగా పిలిచాడన్న కోపంతో తన స్నేహితుడు రాగర్ సహాయంతో పిగ్గీని చంపేస్తాడు. కపట రాజకీయాలు పెద్దవారిలోనే కాదు జరిగే సంఘటనలతో చిన్నవారిలోనూ అల్లుకుపోతాయన్న అంశాన్ని ప్రస్తావించారు.

ఇక ఒంటరిగా మిగిలిన రాల్ఫ్ను కూడా తన స్నేహితులతో కలిసి చంపేయాలని ప్రయత్నిస్తే రాల్ఫ్ తప్పించుకుని అక్కడ సముద్ర తీరాన్ని చేరి, అటు వెళ్ళే వారి సహాయం కోసం ఎదురుచూస్తాడు. ఈ సన్నివేశాన్ని గోల్డింగ్ ఎంతో భయంకరంగా చిత్రీకరించారు. అటుగా వెళ్తున్న ఓ నావల్ అధికారి రాల్ఫ్ను, రాల్ఫ్ కళ్ళల్లో వేదనను గమనించి, జరిగింది తెలుసుకుని రాల్ఫ్ను తనతో తేసుకువెళ్ళాడన్న ముగింపుతో గోల్డింగ్ ఈ అమ్షాన్ని తెలిపారు.

"ఏదైనా ఒక పనిని పూర్తి చేయాలంటే ముఖ్యంగా ఆ పని పూర్తి చేయాలంటే ముఖ్యంగా ఆ పని పట్ల శ్రద్ధ, తపన, ఆ వ్యక్తుల ప్రవర్తన, క్రమశిక్షన, దన్ని అమలు చేసే విధానం, సామర్థ్యం కలిగి ఉంటే ఏ పనైనా సాద్యపడుతుంది."