Tuesday, September 25, 2007

పెద్దల కోసం చెప్పిన పిల్లల కథ

విలియం గోల్డింగ్ అద్భుతమైన, ఆద్యత్మికమైన, నిరశమయ, అలంకారిక భావనలు కలిగిన గొప్ప రచయిత. ఆయన తన నవలల్లో నాగరిక మనిషి ప్రవ్రుత్తికీ, చీకటి ప్రవ్రుత్తికీ మధ్య జరిగె నిరంతర సంఘర్షణ తనదైన శైలిలో చిత్రీకరించారు.

విలియం గోల్డింగ్ సెప్టెంబెర్ 19, 1911వ సంవత్సరంలొ ఇంగ్లండ్ దేశంలోని కార్న్వాల్లో జన్మించారు. ఆయన తండ్రి అలెక్ గోల్డింగ్ గొప్ప సామ్యవాది. తల్లి మిల్డ్రెడ్. గోల్డింగ్ తెలివైన, పోటీతత్వం కల్గిన వ్యక్తె కాక సంగీతమంటే ఆసక్తి కలవారు. తన తండ్రితో కలసి లాటిన్ భాష నేర్చుకొని కథలు కూడా రాశారు.తన 20వ ఏట రచయిత కావాలనుకుని 1932లో ఇంగ్లీష్ లిటరేచర్లోకి ప్రవేశించారు. వాటిని మెక్మిల్లన్ సంస్థ ప్రచురించినా విజయం సాదించ్కపోవడంతో తన జీవితం శూన్యంలా తోచింది గోల్డింగ్కు. తన స్నేహితుడు ఆడం సహయంతో ఉపాద్యనిగ చేరి పలు విషయాలను భోదిస్తూనె ఎన్నొ సంగీత, నటకాలను ప్రదర్శించారు. 1950లో 'ది సీ ' పద్యం, 1952లో 'స్ట్రేంజర్స్ ఫ్రం వితిణ్నవలలను పబ్లిషర్స్ తిరస్కరించారు. కానీ, ఫేబర్ అండ్ ఫేబర్ సంస్థ ఎడిటర్ ఛార్లెస్ మౌంటెథ్ దానికి కొన్ని సవరన్ణలు చేసి 'లార్డ్ ఆఫ్ ది ఫ్లైస్ 'గా సెప్టెంబర్, 1954లో ప్రచురించారు. ఇదే గోల్డింగ్కు అద్భుత విజయానందించిన మొట్టమొదటి నవల. ఇక గోల్డింగ్ ఇంగ్లిష్ లిటరేచర్లో వెనుదిరిగి చూడలేదు.వరుసగ 'ది ఇన్ హెరిటర్స్ ' (1955), పించర్ మార్టిన్ (1956), ఫ్రీ ఫాల్ (1959), డార్క్నెస్ విజిబ్ల్ (1979), మరెన్నో విజయవంతమైన నవలలు రచించారు. 1983 తన జీవితంలో మరచిపోలేని సంవత్సరంగా చెప్పాలి. ఆక్స్ఫార్డ్ యూనివర్సిటి, సార్బన్ల నుండి డాక్ట్రేట్ను,ఆంగ్ల సాహిత్యంలో విశేష సేవలకుగాను నోబల్ పురస్కారాన్ని అందుకున్నారు. జూన్ ,1995లో ఆయన చివరి నవల 'ది డబల్ టంగ్ ' పబ్లిషైంది.

విలియం గోల్డింగ్ సాహిత్య ప్రయోజనాన్ని ఇలా చెప్పారు. "మానవునిలో దైర్యం, నిజయితీలను నింపడం ద్వార అది చరిత్ర దసను, దిశను మార్చేస్తుంది". చర్చిల్ లాగే గోల్డింగ్ది కూడా, సాహిత్యంలో వెలువడె భావాలు, ఆలోచనలు ప్రపంచంలో మార్పులను సూచిస్తూదేశానికి ఎంతో ఉపయోగపడతాయన్న అభిప్రాయమే.

లార్డ్ ఆఫ్ ది ఫ్లైస్ -నవల గొప్పతనం:

విలియం గోల్డింగ్ అద్భుతంగా రాసిన ఈ నవల ఎంతో విజయం సాధించింది. భయంకర, కల్పితమైన భావాలకు దగ్గరగ ఉంచి అల్లిన ఫాంటసి కథ. అణుయుద్దం జరిగే సమయంలో కొంత మంది స్కూలు పిల్లలున్న విమానమొకటి పసిఫిక్ సముద్రంలో చిక్కుకుపోతుంది. విమాన పైలట్ మంటల్లో చనిపోవడంతో పిల్లలందరూ ఒంటరిగా మిగిలిపోతారు. అక్కడ వారేం చేశారు? ఎలా ఉన్నారు? చివరకు ఏమి జరిగింది? ఈ ప్రశ్నలకు తనదైన శైలిలో గోల్డింగ్ చెప్పిన జవాబులే ఈ నవల. పూర్తి పరిపక్వత, పరిగ్ణానం రాని చిన్న పిల్లల్ల స్వభావాన్ని, వారికుండే ఉద్దెశాలను అద్భుతంగా వివరించారు. సమాజంలోని, వ్యక్తుల తీరులోని లోపలను వెలికి తేసే ప్రయత్నమే "లార్డ్ ఆఫ్ ది ఫ్లైస్ ". దీనిలో మనం చక్కని పరిహాసం, సింబాలిజంలను చూడవచ్చు. పాత్రలు, వాటి స్వభవాలు కూడా విభిన్నంగా ఉంటూ పన్నెండు అద్యాయాలతో ఉన్న ఈ నవలలో ముఖ్యాంశం 'మానవ సమాజ అధ్యయనం'. ఒక మంచి భావం, స్వెచ్చ, శసంతి బాల్యం నుండే రావాలని తెలిపేందుకే ఆయన కథకు చిన్న పిల్లలను ఎంచుకున్నారు. సమయం, పరిస్తితుల ప్రభావం ఒక వ్యక్తిని ఏ దిశగా తీసుకువెళతాయన్న అంశాన్ని అద్యయనం చేసి అర్థం చేసుకునే వీలు కల్పించారు గోల్డింగ్ "లార్డ్ ఆఫ్ ది ఫ్లైస్" ద్వార.

కథ - విశ్లేషణ:
ఈ నవలలో అణు యుద్ధం కథ ప్రారంభించదానికి ఒక ఆధారం మాత్రమే. కానీ, రచయిత ముఖ్యొద్దేశం పసిఫిక్ తీరాన ద్వీపంలో చిక్కుకున్న పిల్లల స్వభావం తెలియజేయడమే.దీనిలో ముఖ్య పాత్రలు రాల్ఫ్, జాక్, పిగ్గీ, సైమన్, రాగర్, సాం, ఎరిక్, లిట్లన్స్ల చుట్టే అల్లుకుంది. వీరంతా అక్కడ ఒక క్రమ పధ్ధతిలో ఉండాలనుకుని పెద్ద వారెవరు లేకపోవడంతో వారిలో ఒక్కడైన రాల్ఫ్ను నాయకునిగా ఎన్నుకుంటారు. వారందరికి కొన్ని నియమాలను సూచిస్తాడు రాల్ఫ్. మొదటిగా శంఖం నుండి వచ్చే శబ్ధాన్ని వినగానే అందరూ సమావేశమవ్వాలి. ఇక్కడ శంఖాన్ని సాంఘికంగా ప్రజాస్వామ్యాన్ని, క్రమపధ్ధతిని, అధికారాన్ని తెలిపేంతగా సూచించడం గోల్డింగ్ సింబాలిజంకు ఉదాహరనగా చెప్పవచ్చు.

వారంతా అక్కడి నుండి బయట పడేందుకు ఆ ద్వీపంలో కొండపై నిప్పును ఏర్పరచాలని, అలా చేస్తే అతుగా వెళ్లే ప్రయాణికులు ఆ మంటను చూసి వీరిని రక్షిస్తారన్న ఆలోచన రాల్ఫ్ ఆలోచన వారు చేసే ప్రయత్నంలో లోపాలు, ఏ పధ్ధతీ లేక ఒకరికొకరు సహాయం చేసుకోకపోవడంతో ఎప్పుడూ విఫలమౌతుంది. జాక్ ఆ అడవిలోని పందులను వేతాడడంలో చూపే ఆసక్తి రాల్ఫ్కు నచ్చదు. తినడానికి అక్కడున్న చెట్ల పళ్లు సరిపోతాయి కనుక ఉండడానికి ఇళ్ళు నిర్మించాలనుకున్న రాల్ఫ్కు జాక్ సహాయం చేయకపోవడంతో వారిద్దరికీ వైరం మొదలౌతుంది. అయితే ఇదీ ఒక హక్కే. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరికి నచ్చినట్టు వారుండొచ్చు. తోచింది చెప్పొచ్చన్న విషయం గోల్డింగ్ పై విధంగా సమర్థించారు.

అక్కడ పిల్లలంతా 12 సంవత్సరాలలోపు వారే కాబట్టి పరిపక్వత లేక ఏదీ అర్థం చేసుకోరు. అంతా బయటపడాలని చేసె ప్రయత్నంలో ఆ కొండపై ఓ వింతైన ఆకారాన్ని చూసి దానిని ఒక భయంకర వన్యమ్రుగముగా, పెద్ద రాక్షషిగా భావిస్తున్నా, రాక్షసత్వం, దుర్మార్గం మనుషుల్లోనే ఉంటాయి కాని మరెక్కడా ఉండవనే సత్యాన్ని తెలుసుకున్న సైమన్ చాలా తెలివైనవాడు, ఏ విషయంలో జోక్యం చేసుకోడు. సాం, ఎరిక్ అను కవలలు మాత్రం తాము ఆ మ్రుగాన్ని చూసామని, వారిని తరుముకొచ్చిందంటూ చెప్పినా గానీ సైమన్ నమ్మడు. పిగ్గీ తెలివైనవాడైనా చూపు సరిగా లేక ఏమీ చేయలేని, చెప్పలేని స్థితిలో ఉంటాడు. అయితే వారు చూసింది ప్యారాషూట్లో వెళ్తూ జారిపడిన ఒక వ్యక్తిని మాత్రమే.

జాక్ మాత్రం తన పని తాను చేసుకోవడమే కాక మిగిలిన వారిని కూడా రాల్ఫ్కు వ్యతిరేకంగా వుందమని చెప్పడంతో రెందు గ్రూపులుగా విడిపోతారు - వేటాడేవారు, వేటకు వెళ్లనివారు. సైమన్ ఓసారి ఒంటరిగా వెళ్లాలని ప్రయత్నించగా క్నొడపై ఓ భయంకర వన్యమ్రుగం తల కనబడి సైమన్ను అక్కడుండొద్దని, వెళ్లి అందరితోనే వుండమని హెచ్చరిస్తుది.ఆ తలనే "లార్డ్ ఆఫ్ ది ఫ్లైస్" గా గోల్డింగ్ పేర్కున్నరు. ఇది మనకు తెలిసిన దుర్మార్గాలలో ఒకటి. 'నేను నీకు తెలుసు. నీలో భాగాన్ని. నిన్ని విడిచి వెళ్లను. వెళ్లి అందరితో వుండు లేదంటే అంతా చనిపోతారా న్న హెచ్చరికకు సైమన్ చాల భయపడిపోతాడు. ఎటువంటి చెడు భావన, దుర్మార్గాలైనా ఓ వ్యక్తితోనే పుట్ట్, వారిలోనే వుంటూ కొన్ని పరిస్తితుల్లో బయటపడతాయని గోల్డింగ్ వివరణ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇదే ముఖ్యాంసం, కథకు కీలకం.

ఇక తాను తెలుసుకున్న విషయాన్ని అందరికీ చెప్పి వారి బాధ, భయం పోగొట్టాలనే ఉద్దేశంతో జాక్ బ్రుందం వద్దకు వెళ్తే అది గమనించని వారు సైమన్ను వన్యమ్రుగమంటూ దారుణంగా చంపేసి అక్కడున్న భయంకర మ్రుగాన్ని చంపేశామంటూ సరదా పడతారు. తర్వాత వారు చంపింది సైమన్నని తెలుసుకున్నా ఏం చేయలేని పరిస్తితి. మంచి చేయాలనుకుని ప్రాణాలు కోల్పోతాడు కనుక సైమన్ని క్రీస్తుల్లా వర్ణించారు గోల్డింగ్. లిట్లన్స్ బాగా చిన్నవారు, ఏమీ చేయలేరు. జాక్ అక్కడి నుండి తప్పించుకోవాలని, నిప్పు ఏర్పరచాలని ఏ పరికరం లేక పురాతన పద్ధతిలో చేద్దామని పిగ్గీ కళ్ళద్దాలను దొంగలించి చాల ఇబ్బంది పెడతాడు. రాల్ఫ్ సమావేశమై జాక్ను దొంగగా పిలిచాడన్న కోపంతో తన స్నేహితుడు రాగర్ సహాయంతో పిగ్గీని చంపేస్తాడు. కపట రాజకీయాలు పెద్దవారిలోనే కాదు జరిగే సంఘటనలతో చిన్నవారిలోనూ అల్లుకుపోతాయన్న అంశాన్ని ప్రస్తావించారు.

ఇక ఒంటరిగా మిగిలిన రాల్ఫ్ను కూడా తన స్నేహితులతో కలిసి చంపేయాలని ప్రయత్నిస్తే రాల్ఫ్ తప్పించుకుని అక్కడ సముద్ర తీరాన్ని చేరి, అటు వెళ్ళే వారి సహాయం కోసం ఎదురుచూస్తాడు. ఈ సన్నివేశాన్ని గోల్డింగ్ ఎంతో భయంకరంగా చిత్రీకరించారు. అటుగా వెళ్తున్న ఓ నావల్ అధికారి రాల్ఫ్ను, రాల్ఫ్ కళ్ళల్లో వేదనను గమనించి, జరిగింది తెలుసుకుని రాల్ఫ్ను తనతో తేసుకువెళ్ళాడన్న ముగింపుతో గోల్డింగ్ ఈ అమ్షాన్ని తెలిపారు.

"ఏదైనా ఒక పనిని పూర్తి చేయాలంటే ముఖ్యంగా ఆ పని పూర్తి చేయాలంటే ముఖ్యంగా ఆ పని పట్ల శ్రద్ధ, తపన, ఆ వ్యక్తుల ప్రవర్తన, క్రమశిక్షన, దన్ని అమలు చేసే విధానం, సామర్థ్యం కలిగి ఉంటే ఏ పనైనా సాద్యపడుతుంది."

5 comments:

Unknown said...

బ్లాగు లోకానికి స్వాగతం.

మీ బ్లాగు జల్లెడకు కలపడం జరిగినది.

http://www.jalleda.com

జల్లెడ

oremuna said...

బాగా వ్రాసినారు, వికీలో ఉంచవచ్చు.

జాన్‌హైడ్ కనుమూరి said...

good writeup

see my other blog
http://alalapaikalatiga.blogspot.com/

Unknown said...

baavundi.... nice one keep goin

mohanraokotari said...

chala baga vrasthunnaru, marrini english novels telugu loki anvadinchandi brief ga nallanti vaalu enno kotha vishayaalu telusuko galugu tham. mee krushi ellapudu mammulanu inspire chesthu untundani asatho,